21, ఫిబ్రవరి 2022, సోమవారం

దారితప్పిన దశగ్రీవుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి, అతనిపై ఉన్న చెప్పుడు మాటల ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! 

ఎంత మంచివారయినా తమ చుట్టూ ఉన్నవారిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ విషయం దశగ్రీవుని విషయంలో నిజం అని మనం చూడవచ్చు. అతను తన చుట్టూ తన తాత సుమాలి, అతని మంత్రులు ఉన్నారు.  వారు చెప్పే మాటలు వింటూ కాలం గడుపుతున్న దశగ్రీవునికి వారి అలోచనలలో నుండి అనేక చెడ్డ ఆలోచనలు అతని మెదడులో ఊపిరి పోసుకోసాగాయి. అతని మనస్సులోనికి అరిషట్వర్గములు ప్రవేశించాయి. అతనికి తను సొంతం చేసుకున్న స్వర్ణలంక చిన్నది అనిపించసాగింది. హింస ప్రవృత్తి పెరిగింది. స్వార్ధం పెరిగిపోయింది. అహంకారం మితిమీరి ప్రవర్తించసాగాడు. ఋషులను మునులను భాదించడం మొదలు పెట్టాడు. అతని పద్దతులను, అతని జీవన విధానంలోని మార్పులను తెలుసుకున్న అతని అన్న కుబేరుడు అతనిని మార్చాలని అనుకున్నాడు. మరి అతను ఏమి చేసాడు? దశగ్రీవుడు అన్నగారి మాట విన్నాడా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి