4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

యముని శాప పరిష్కారం

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ  గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తల్లితో శపించబడిన యముడు, తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించాడు. యముడు చెప్పిన మాటలు విన్న వివస్వంతుడు / సూర్యుడు ఆలోచించాడు.  యమునికి సంధ్యాదేవి ఇచ్చిన శాపమును తప్పించే అవకాశం లేనందువలన సూర్యుడు ఆతనికి మధ్యేమార్గంగా ఒక వరం ఇచ్చాడు. అతని తల్లి ఇచ్చిన శాప కారాణంగా యముని కాలు  భూమిపై పడాలి, దానికి సూర్యుడు యముని కాలులోని మాంసమును క్రిములు తీసుకుని భూమిపైకి వెళతాయి అని, అలా జరగడం వలన అతని కాలులోని మాంసం భూమి పైకి వెళ్ళిన కారణంగా యమునికి పుర్తిగా శాప విమొచనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. ఆ పరిష్కారం విన్న యముడు తన అవేశమును తగ్గించుకుని వెళ్ళిపోయాడు. 

ఒక తల్లి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది. కానీ తన భార్య ముందు పుట్టిన పిల్లలు, తరువాత పుట్టిన పిల్లల మధ్య భేదం ఎందుకు చూపుతోందో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడనికి  సూర్యుడు తన భార్య వద్దకు బయలుదేరాడు. 

మరి తరువాత ఏం జరిగింది? నిజం బయటపడిందా, లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి