రాక్షస వధ (నిగ్రహం) : రహస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాక్షస వధ (నిగ్రహం) : రహస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

పల్వలుడు

పల్వలము = చిన్ని నీటి గుంత
పల్వలుడు ఇల్వలుని కుమారుడు. ఇల్వలుడు వాతాపి మహర్షి ఐన అగస్త్యుని కారణం గా మరణించారు. తన తండ్రి పిన తండ్రుల మరణమునకు ఈ మునులే కారణం అని భావించిన పల్వలుడు  నైమిశారణ్యం లోని మునులను ఋషులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అమావాస్య నాడు మునులు పితృ తర్పణలు ఇస్తూ ఉండే కాలం లో ఈ పల్వలుడు ఆ యజ్ఞ వాటికలో సుర, మల, మూత్ర, రక్త మరియు మాంసములతో అపవిత్రం చేస్తూ ఉండేవాడు. ముని స్త్రీ లనుకూడా వేధించే వాడు.
ఒకనాడు బలరాముడు తీర్ధయాత్రలకు బయలు దేరి వెళ్ళాడు. వెళుతూ ఉండాగా, దారిలో ఒకరు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు దానిని స్వీకరించాడు. కొంతదూరం వెళ్ళాక సూతమహాముని చేస్తున్న సత్సంగమునకు వెళ్లారు. సూతుడయిన రోమహర్షనుడు  తప్ప ఆ సభలో ఉన్న అందరు మునులు, ఋషులు అవతార పురుషుడైన బలరామునకు అతిధి సత్కారములు చేసారు. కాని బ్రహ్మ స్థానం లో ఉన్న రోమహర్షణుడు తనను గౌరవించలేదని భావించి, ఇంతకూ ముందు తీసుకున్న కల్లు  ప్రభావం చేత ఆలోచించకుండా అతని తలపై ఒక్క దెబ్బ తన ఆయుధమైన రోకలితో కొట్టాడు. రోమహర్షణుడు అక్కడికి అక్కడే మరణించాడు. తరువాత తన తప్పు తెలుసుకుని పరిష్కారంగా రోమహర్షనుడిని శాశ్వతంగా బ్రహ్మలోకమునకు, అతని తెలివితేటలు, ఆయుషు ను ఆటను పుత్రుదయినా సూతునకు ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెయాల అని ఋషులను అడుగగా వారు పల్వలుని గురించి చెప్పి వానిని వధించమని కోరారు. బలరాముడు రోమహర్షనుని సంహరించినది ఏకాదశి కనుక మరొక నాలుగు రోజులలో అమావాస్య తిధి వస్తుంది అని ఆ నాలుగు రోజులు బలరాముడు అక్కడే ఉన్నాడు.
అమావాస్య రోజు మునులు, ఋషులు యధాప్రకారం తన యజ్ఞమును ప్రారంభించారు. అప్పుడు ఆకాశంలో ఒక నల్లటి ఆకారం కొండలా కనిపించినది. దాని వికటాట్టహాసం భయంకరంగా ఉన్నది. మిడిగుడ్లు, విరబోసిన రాగి రంగు జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన శరీరం తో పల్వలుడు అక్కడకు వచ్చాడు. పల్వలుడిని చూసిన బలరాముడు తన నాగలితో అతని మెడను పట్టి క్రిందికి లాగి ఎడమ చేతిలో ఉన్న రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. అప్పుడు ప్లవలుడు అక్కడికి అక్కడే మరణించాడు.
మహర్షులు ఎంతో సంతోషించి బలరాముని దీవించి తీర్ధయాత్రలకు వెళ్లి, మిగిలిన బ్రహ్మ హత్య పాపమును తొలగించుకోమని అనుజ్ఞ ఇచ్చారు. 

30, ఆగస్టు 2014, శనివారం

అంధకాసురుడు-శివుని 108 నామములు

అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :
  1. మహాదేవ 
  2. విరూపాక్ష 
  3. చంద్రశేఖర 
  4. అమృతుడు 
  5. శాశ్వతుడు 
  6. స్థాణువు 
  7. నీలకంఠుడు 
  8. పినాకి 
  9. వృషభాక్షుడు 
  10. మహాజ్ఞేయుడు 
  11. పురుషుడు 
  12. సర్వకామదుడు 
  13. కామారి 
  14. కామదహనుడు 
  15. కామరూపుడు 
  16. కపర్ది 
  17. విరూపుడు 
  18. గిరిశుడు 
  19. భీముడు 
  20. స్రుక్కి 
  21. రక్త వస్త్రుడు 
  22. యోగి 
  23. కామదహనుడు 
  24. త్రిపురజ్ఞుడు 
  25. కపాలి 
  26. గూఢవ్రతుడు 
  27. గుప్తమంత్రుడు 
  28. గంభీరుడు 
  29. భావగోచరుడు 
  30. అణిమాది గుణాధారుడు 
  31. త్రైలోకైస్వర్యదాయకుడు 
  32. వీరుడు 
  33. వీరహనుడు 
  34. ఘోరుడు 
  35. ఘోరహణుడు 
  36. విరూపుడు 
  37. మాంసలుడు 
  38. పటువు 
  39. మహామాంసాదుడు 
  40. ఉన్మత్తుడు 
  41. భైరవుడు 
  42. మహేశ్వరుడు 
  43. త్రైలోక్య ద్రావణుడు 
  44. బుద్ధుడు 
  45. లుబ్ధకుడు 
  46. యజ్ఞసూదనుడు 
  47. ఉన్మత్తుడు 
  48. కృత్తివాసుడు 
  49. గజకృత్తిపరిధానుడు 
  50. క్షుబ్దుడు 
  51. భుజంగభూషణుడు 
  52. దత్తాలoబుడు 
  53. వీరుడు 
  54. కాసినీపూజితుడు 
  55. అఘోరుడు 
  56. ఘోరదైత్యజ్ఞుడు 
  57. ఘోరఘోషుడు 
  58. వనస్పతి రూపుడు 
  59. భాస్మాoగుడు 
  60. జటిలుడు 
  61. సిద్ధుడు 
  62. భేరుండక తసేవితుడు 
  63. భూతేస్వరుడు 
  64. భూతనాధుడు 
  65. పంచభూతాస్రితుడు 
  66. ఖగుడు 
  67. క్రోధితుడు 
  68. విష్ణురుడు 
  69. చండుడు 
  70. చండీసుడు 
  71. చండికాప్రియుడు 
  72. తుంగుడు 
  73. గరుక్మంతుడు 
  74. అసమభోజనుడు 
  75. లేవిహానుడు 
  76. మహారౌద్రుడు 
  77. మృత్యువు 
  78. మృత్యుఅఘోచరుడు 
  79. మృత్యుమృత్యువు 
  80. మహాసేనుడు 
  81. శ్మాసాన వాసి
  82. అరణ్యవాసి 
  83. రాగస్వరూపుడు 
  84. విరాగస్వరూపుడు
  85.  రాగాంధుడు 
  86. వీతరాగశతార్చితుడు 
  87. సత్వగుణుడు 
  88. రజోగుణుడు 
  89. తమోగుణుడు 
  90. అధర్ముడు 
  91. వాసవానుజుడు 
  92. సత్యుడు 
  93. అసత్యుడు 
  94. సద్రూపుడు 
  95. అసద్రూపుడు
  96. ఘోరహనుడు 
  97. ఆహేతుకుడు 
  98. అర్ధనారీస్వరుడు 
  99. భానువు 
  100. భానుకోటి శతప్రభుడు
  101. యజ్ఞస్వరూపుడు 
  102. యజ్ఞపతి 
  103. రుద్రుడు 
  104. ఈశానుడు 
  105. వరదుడు 
  106. నిత్యుడు 
  107. శివుడు 
  108. శంకరుడు 

25, ఆగస్టు 2014, సోమవారం

ఏకదంతుడు

విఘ్నరాజు వినాయకునికి ఏకదంతుడు అనే పేరుకూడా ఉన్నది. ఆ పేరు అతనికి ఎలావచ్చింది అనేవిషయం గురించి పురాణములలో అనేకవిధాలుగా చెప్పబడింది. 

1. బ్రహ్మాండ పురాణం:
వేయిచేతులు కలిగిన కార్త్యవీర్యార్జునుని సంహరించిన తరువాత పరశురాముడు ఆదిదంపతులైన శివపార్వతుల ను దర్శించుకొనుటకు కైలాసపర్వతానికి వచ్చాడు. ఆ సమయంలో ఏకాంతంలో ఉన్న పర్వతిపరమేస్వరులు తమ ఏకాంతమునకు ఎటువంటి భంగం కలుగకుండా చూడమని బాలగణపతిని నియమించారు. 

పరశురాముని రాకనుగమనించిన వినాయకుడు అతనికి నమస్కరించి ఈ సమయంలో ఆదిదంపతుల దర్శనం కుదరదు అని చెప్పారు. మహర్షి పరశురాముడు అప్పటికే భూమండలం అంతా 21సార్లు తిరిగి క్షత్రియుల నాశం చేసి ఉన్నారు. అతనిలో కొంత గర్వంప్రవేసించి ఉన్నది. ఆ సమయలో అతనికి వినాయకుని మాటలు నచ్చలేదు. ఈ బాలకుడు తనను ఎదిరిస్తున్నాడు అని భావించారు. మహాదేవునకు భక్తుడనైన నన్ను ఇలా ఆపివేసే అధికారం నీకు ఏడూ అని వినాయకుడిని ఎదిరించాడు. అతనిలోని గర్వమును గమనించిన వినాయకుడు ఆ గర్వమును తొలగించాలని భావించాడు. ఎట్టి పరిస్థితులలోనూ పరశురాముని లోపలకు అనుమతించలేనని స్పష్టంచేసాడు. కోపగించిన పరశురాముడు పరమశివప్రసాదమైన తన పరశువును వినాయకుని మీద ప్రయోగించాడు. అతనికి వినాయకుడు కూడా అతనికి ఆయుధములతో సమాధానం చెప్పటం ప్రారంభించారు. వారిద్దరి మద్య జరిగిన యుద్ధంలో పరశురాముడు తన పరశువుతో వినాయకుని ఎడమవైపు దవడమీద చేసిన దాడి వల్ల అతని ఎడమ దంతం విరిగిపోయినది. 
బయట జరుగుతున్న ఈ కోలాహలం విన్న శివపార్వతులు బయటకు వచ్చారు. తన పుత్రుని విరిగిన దంతమును చూసిన పార్వతీదేవి ఆగ్రహించి పరశురాముని శపించదలచినది. ఆ ఆపదను ముందే గమనించిన నారద మహాముని పార్వతిమాతను వారించారు. ఈ పొరపాటు జరుగుటకు కారణం పరశురామునికి వినాయకుడు ఆదిదంపతుల పుత్రుడు అని తెలియక పోవుట  అని, విరిగిన ఈ వినాయక దంతం మునుముందు కాలంలో ఎన్నో తరములకు, సకల మానవకోటికి ఉపయోగపడుతుంది అని చెప్పి పార్వతిదేవిని సంతోషపరచారు. 

కాలాంతరంలో ఆ దంతంతోనే విఘ్నేశ్వరుడు వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా మహాభారత ఇతిహాసాన్ని రచించారు. 
      
2. వేరే పురాణములలో వినాయకుడు యుధం చేసినది శనిదేవుడు అని చెప్పబడినది.

3. వినాయకుడు ముషికాసురుని నియంత్రించే సమయంలో తన దంతమును వినియోగించారు అని మరొక కధ  ప్రచారంలో ఉన్నది.


1, ఆగస్టు 2014, శుక్రవారం

అంధకాసురుడు-శివుని 108 నామములు

అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :

  1. మహాదేవ 
  2. విరూపాక్ష 
  3. చంద్రశేఖర 
  4. అమృతుడు 
  5. శాశ్వతుడు 
  6. స్థాణువు 
  7. నీలకంఠుడు 
  8. పినాకి 
  9. వృషభాక్షుడు 
  10. మహాజ్ఞేయుడు 
  11. పురుషుడు 
  12. సర్వకామదుడు 
  13. కామారి 
  14. కామదహనుడు 
  15. కామరూపుడు 
  16. కపర్ది 
  17. విరూపుడు 
  18. గిరిశుడు 
  19. భీముడు 
  20. స్రుక్కి 
  21. రక్త వస్త్రుడు 
  22. యోగి 
  23. కామదహనుడు 
  24. త్రిపురజ్ఞుడు 
  25. కపాలి 
  26. గూఢవ్రతుడు 
  27. గుప్తమంత్రుడు 
  28. గంభీరుడు 
  29. భావగోచరుడు 
  30. అణిమాది గుణాధారుడు 
  31. త్రైలోకైస్వర్యదాయకుడు 
  32. వీరుడు 
  33. వీరహనుడు 
  34. ఘోరుడు 
  35. ఘోరహణుడు 
  36. విరూపుడు 
  37. మాంసలుడు 
  38. పటువు 
  39. మహామాంసాదుడు 
  40. ఉన్మత్తుడు 
  41. భైరవుడు 
  42. మహేశ్వరుడు 
  43. త్రైలోక్య ద్రావణుడు 
  44. బుద్ధుడు 
  45. లుబ్ధకుడు 
  46. యజ్ఞసూదనుడు 
  47. ఉన్మత్తుడు 
  48. కృత్తివాసుడు 
  49. గజకృత్తిపరిధానుడు 
  50. క్షుబ్దుడు 
  51. భుజంగభూషణుడు 
  52. దత్తాలoబుడు 
  53. వీరుడు 
  54. కాసినీపూజితుడు 
  55. అఘోరుడు 
  56. ఘోరదైత్యజ్ఞుడు 
  57. ఘోరఘోషుడు 
  58. వనస్పతి రూపుడు 
  59. భాస్మాoగుడు 
  60. జటిలుడు 
  61. సిద్ధుడు 
  62. భేరుండక తసేవితుడు 
  63. భూతేస్వరుడు 
  64. భూతనాధుడు 
  65. పంచభూతాస్రితుడు 
  66. ఖగుడు 
  67. క్రోధితుడు 
  68. విష్ణురుడు 
  69. చండుడు 
  70. చండీసుడు 
  71. చండికాప్రియుడు 
  72. తుంగుడు 
  73. గరుక్మంతుడు 
  74. అసమభోజనుడు 
  75. లేవిహానుడు 
  76. మహారౌద్రుడు 
  77. మృత్యువు 
  78. మృత్యుఅఘోచరుడు 
  79. మృత్యుమృత్యువు 
  80. మహాసేనుడు 
  81. శ్మాసాన వాసి
  82. అరణ్యవాసి 
  83. రాగస్వరూపుడు 
  84. విరాగస్వరూపుడు
  85.  రాగాంధుడు 
  86. వీతరాగశతార్చితుడు 
  87. సత్వగుణుడు 
  88. రజోగుణుడు 
  89. తమోగుణుడు 
  90. అధర్ముడు 
  91. వాసవానుజుడు 
  92. సత్యుడు 
  93. అసత్యుడు 
  94. సద్రూపుడు 
  95. అసద్రూపుడు
  96. ఘోరహనుడు 
  97. ఆహేతుకుడు 
  98. అర్ధనారీస్వరుడు 
  99. భానువు 
  100. భానుకోటి శత 
  101. యజ్ఞస్వరూపుడు 
  102. యజ్ఞపతి 
  103. రుద్రుడు 
  104. ఈశానుడు 
  105. వరదుడు 
  106. నిత్యుడు 
  107. శివుడు 
  108. శంకరుడు 

22, జులై 2014, మంగళవారం

వజ్రాంగుడు

కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి పుత్రులు దైత్యదేవతలు. వారిరువురి మద్య ఉన్న విభేదాల కారణoగా ఎల్లప్పుడూ దితిపుత్రులైన దైత్యులు మృత్యువాత పడుతూ ఉన్నారు.

ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు దితి తన భర్త ఐన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్లి తన భాదలు చెప్పుకోసాగింది. ప్రాణనాద! నా పుత్రులైన హిరణ్యకశిపుడను, హిరణ్యాక్షుడను శ్రీహరి నరసింహ, వరాహావతారములు ధరించి చంపాడు. ఇంద్రుని చంపే పుత్రుని కోసం నేను నిష్టగా వ్రతం చేస్తూ ఉన్న సమయం లో ఒకనాటి మద్యాహ్నం జరిగిన కించిత్ అపచారానికి ఇంద్రుడు నా గర్భం లో ప్రవేశించి ఆ పిండాన్ని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు మరుత్తులుగా ఉన్నారు. నాకు ఇప్పుడు మరొక సంతానం కలిగించవలసినది అని కోరినది. 

అప్పుడు కశ్యపుడు ఆమెను బ్రహ్మ దేవుని గురించి తపస్సు చేయమని చెప్పారు. అప్పుడు ఆమె ఒక పది వేల సంవత్సరములు తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగగా, ఆమె అన్ని లోకములను గెలువగలిగిన పుత్రుడు కావలి అని కోరింది. బ్రహందేవుడు వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం తో ఆమె గర్భం దాల్చి ఒక బిడ్డను ప్రసవించినది. అతనికి వజ్రాంగుడు అని నామకరణం చేసారు.  

వజ్రాంగుడు పుట్టిన నాటి నుండి ఆమె అతనికి ఇంద్రుని గురించి, ఇతర దేవతలగురించి మనోవైకల్యం కలిగేటట్లు చెప్తూ ఉండేది. ఇలా పెరిగి పెద్దవాడయిన వజ్రాంగుడు దేవతలను గెలిచి, అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సర్వదేవతలను బంధించి తన కారాగారం లో ఉంచాడు. 

అది గమనించిన బ్రహ్మదేవుడు, కశ్యపుడు వజ్రాంగుని వద్దకు వచ్చారు. వచ్చినవారిని చూసిన వజ్రాంగుడు వారికి అతిధి మర్యాదలు చేసాడు. వజ్రాంగుడు చేసిన అతిధి మర్యాదలను చూసి సంతోషించిన బ్రహ్మదేవుడు ఇంద్రుడిని, ఇతర దేవతలను వజ్రాంగుడు భందించటానికి గల కారణం తెలుపమని, వారిని కారాగారం నుండి విడుదల చేయమని కోరాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న మరుక్షణం వజ్రాంగుడు వారిని విడుదల చేసాడు. తాను ఇంద్రాది దేవతలను భందిస్తే తనకు మనఃశాంతి కలుగుతుందని తన తల్లి ఐన దితి కోరిక మేర వారిని భందించాను అని చెప్పాడు. 
స్వతహాగా మంచివాడయిన వజ్రాంగుడిని చూసి బ్రహ్మదేవుడు అతనికి సత్వగుణమే ప్రమాణంగా ఇకముందు జీవించు అని చెప్పి, వరాంగి అనే ఒక కన్యను సృష్టించి అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 

అలా వరాంగితో కలసి దైవచింతనతో, సత్వగుణం తో జీవనం సాగిస్తూ ఉండగా, ఒకరోజు వజ్రాంగుడు తనభార్య వద్దకు వచ్చి ఆమెకు పుత్రసంతానం కలిగేలా దేవిoచటానికి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది కనుక ఆమెకు ఎటువంటి పుత్రుడు కావాలో కోరుకొమ్మని అడిగాడు. దానికి వరాంగి తనకు వజ్రాంగుడి తో సమానమైన బలపరాక్రమములు కలిగి, సర్వలోకములను తన అధినం లో ఉంచుకోగలిగిన పుత్రుడు కావలి అనికోరింది. ఇట్టి వరం ఆమె కోరుతుందని ఊహించని వజ్రాంగుడు నివ్వెరపోయి తన అంతఃపురానికి వెళ్లి బాగా అలోచించి, బ్రహ్మగురించి తపస్సు చేయ సాగాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఇట్టి తపస్సుకు కారణం ఏమని అడుగగా బ్రహ్మదేవునిచే సృష్టించబడిన తన భార్య వరాంగి కోరికని వివరించి ఆమెకు అట్టి పుత్రుడిని ప్రసాదించవలసినది అని కోరుకున్నాడు. తధాస్తు అని బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. 

ఆ వర ప్రాభవం వల్ల వరంగి కొంతకాలానికి ఒక మగబిడ్డను ప్రసవించినది. ఆ బిడ్డకు కశ్యపుడు తారకుడు అని నామకరణం చేసాడు. కాలాంతరంలో అతనే తారకాసురుడు అని లోకం చేత పిలిపించుకున్నాడు.  

15, జులై 2014, మంగళవారం

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?

వెనుక నుండి వాలిని బాణం తో కొట్టిన రాముడు ధర్మాత్ముడేనా?
నూటికి నూరు శాతం రాముడు ధర్మాత్ముడే అని తన చివరి క్షణంలో వాలే అంగీకరించాడు. అది ఎలానో చూద్దాం!
తన తమ్ముడు సుగ్రీవునితో యుధం చేస్తున్న తనమీద ఎవరో బాణ ప్రయోగం చేసారు అని ధ్వని విన్న వాలి వెనుకకు తిరిగేంతలో రామబాణం వాలి గుండెలో గుచ్చుకుంది. ఆ బాణం వేగానికి తట్టుకోలేకపొయిన వాలి కుప్పకూలిపోయాడు.
అప్పుడు వెనుక నుండి వస్తున్న రామలక్ష్మణులను చూసి,  వాలి రాముడిని కొన్ని ప్రశ్నలను అడిగాడు.

రామా! నువ్వు చాలా గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమం ఉన్నవాడివి అంటారు. నా భార్య తార నీగురించి చెప్పింది, నీవు నాతమ్ముడైన సుగ్రీవునితో స్నేహం చేస్తున్నావ్ అని కుడా చెప్పి నన్ను ఈ యుద్దానికి వెళ్ళద్దు అని వారించింది. అవి అన్నీ విన్న నేను నీవు నిజంగా ధర్మాత్ముడవే అని నమ్మాను. నేను సుగ్రీవునితో యుధం చేస్తుండగా నీవు నన్ను ఎదిరిస్తావు అని అనుకున్నాను కాని నీవు నా వెనుక నుండి బాణ ప్రయోగం చేసావు. నేను చనిపోయాక నా తమ్ముడు రాజ్యం తీసుకోవటం సబబు గానే ఉంది కాని నీవు నన్ను చంపుట లో ధర్మం లేదు.  కనుక నీవు ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. కాదు అని నీవు చెప్పగలవా! ఐతే నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.
  1. నీతో కాకుండా నేను ఇంకొకరితో అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే నువ్వు చెట్టు చాటు నుండి నా మీద బాణం ఎందుకు వేసావు?
  2. యుద్ధం అంటూ వస్తే, బంగారం వల్ల, వెండి వల్ల, భూమి వల్ల రావాలి కానీ, నీకు నాకు ఈ విషయాల్లో తగాదా  లేదు. నేను నీ రాజ్యానికి కాని నీ పట్టణానికి కాని ఈ విధమైన విఘాతం కలిగించలేదు. 
  3. క్షత్రియులలొ పుట్టిన నీకు మంచి చెడు ఏదో తెలుసుకున్న తర్వాతనే శిక్ష విధించాలి అని తెలియదా? నీవు మా మద్య జరిగిన ఏ విషయాల మీద ఆధారపడి నేను దోషిని అని నిర్ణయించావు?
  4. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖాహార మృుగాన్ని. నా చర్మం వలిచి వేసుకోవటానికి, మాంసం తినటానికి, నాగోర్లు మరొక ప్రయోజనానికి పనికిరావు కనుక నన్ను చంపుట లో  న్యాయం లేదు! దీనికి నీ సమాధానం?
  5. నీ భార్య కోసం అడవిలో వెతుక్కుంటున్నావు కదా! నీ భార్యని ఎత్తుకుపోయిన రావణాసురుడు నా కింకరుడు. నువ్వు నాతో స్నేహం చేసి ఉంటే, అసలు రక్తపాతం లేకుండా ఆ రావణాసురుడిని ఒక్క రోజులో నీముందు పడేసేవాడిని. అటువంటిది నాముందే నిలువలేని సుగ్రీవుడిని ఆశ్రయించి, నువ్వు సీతని ఎలా సాధించుకోగలవు? బలవంతుడిని వదిలి బలహీనునితో స్నేహం ఎందుకు చేసావు?
అప్పుడు రాముడు వాలికి సమాధానం చెప్పాడు

ఓ వాలి! నీకు అసలు ధర్మం గురించి కానీ, అర్ధం గురించి కానీ, కామం గురించి కానీ తెలుసా. నువ్వు అజ్ఞానివి. బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి. నీకు ఏమీ తెలుసని నా మీద ఇన్ని ఆరోపణలు చేశావు. నువ్వు అజ్ఞానీవి కావటం వల్ల నీకు ఏమి తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైన వారిని ఆశ్రయించి తెలుసుకోవలసినది.
నువ్వు ఈ వానరములకు ప్రభువువి. మంత్రుల చేత సేవింపబడుతున్న వాడివి. సంధ్యావందనం చేస్తున్నవాడివి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనుక ఉన్నవారు కూడా ధర్మం తప్పుతారు. నేను క్షత్రియుడిని కనుక నిన్ను శిక్షించవలసిన అవసరం నాకు ఉంది. క్షత్రియ ధర్మం ప్రకారం ఒకడు చేసిన తప్పు ప్రభువైన వాడికి తెలిసి వాడిని శిక్షిస్తే, వాడి పాపం పోతుంది. కానీ ప్రభువు అలా శిక్షించకపోతే, ఆ పాపం రాజుకి వెళుతుంది.  ఇక్ష్వాకుల రాజ్యం లోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశం వారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది.
ఇక నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను!
  1. నేను మానవుడిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి, వల వేసి,పాశం వేసి,అప్రమత్తంగా ఉన్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు,నిలబడి ఉన్నప్పుడు,  పారిపోతున్నప్పుడు ఎప్పుడైనా కొట్టొచ్చు. కానీ ఆ మృగo మరో మృగం తో సంగమిస్తున్నప్పుడు కొట్టకూడదు. నువ్వు మిధున లక్షణంలో లేవు కనుక నిన్ను కొట్టాను.
  2. తప్పు చేసినవానిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది. నేను నిన్ను ఛంపటం వల్ల నువ్వు ఏ పాపం లేని స్థితి కి చేరుకున్నావు. నీ పాపం ఇక్కడితో పోయింది. అందుకని నువ్వు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతావు. 
  3. తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు కుమారులతో సమానం. నీ తండ్రి మరణించటం చేత, నువ్వు పెద్దవాడివి అవటం చేత నువ్వు సుగ్రీవునకు తండ్రి తో సమానము. నీ తమ్ముడు భార్య అయిన రూమ నీకు కోడలితో సమానము. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమతో, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు.అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రం లో దీనికి మరణ శిక్ష తప్ప వేరోక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది. (దీనిలో పైన వాలి అడిగిన 2,3,4 ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది) 
  4. నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను. 
రాముడు మాటలు విన్న వాలి తన రెండు చేతులతో రాముడికి నమస్కారం చేస్తూ  "మహానుభావా! ధర్మాత్మా! రామచంద్రా! నువ్వు చెప్పినది యదార్ధం. దోషం నాయందే ఉన్నది. నీవు చేసిన ఈ పని నిజం గా నాయందు దయతో చేసావు అని నేను నమ్ముతున్నాను. శ్రీరాముడు ధర్మాత్ముడు అని నేను ఒప్పుకుంటున్నాను. ఇటువంటి నీ చేతిలో మరణమైనా నాకు స్వర్గమే రామా" ఆనాడు.


ఆనంద రామాయణం ప్రకారం శ్రీకృష్ణావతార సమాప్తసమయం లో శ్రీకృష్ణుడిని బాణం తో కొట్టినది ఆ కాలం లో కిరాతునిగా పుట్టిన ఈ వాలి. 

13, జులై 2014, ఆదివారం

విరాధుడు

విరాధుడు

సీతారామలక్ష్మణులు అరణ్య వాసం చేస్తుండగా వారు అనేక ఋషి ఆశ్రమాలను దర్శించారు. అలాగే ఒక ఆశ్రమాన్ని దర్శిస్తున్న సమయం లో ఆ ఆశ్రమం లోని ఋషులు ఆ చుట్టుప్రక్కల ఉన్న రాక్షసుల వాల్ల తమకు ఇబ్బంది కలుగుతోoది అని చెప్పి, రామ చంద్రుడే వారిని ఈ భాధనుండి తప్పించాలని కోరారు.  రాముడు అంగీకరించి, వారు ఇచ్చిన ఆతిధ్యాన్ని స్వీకరించి సీతాలక్ష్మణ సమేతుడై బయలుదేరారు.
అలా కొంతదూరం వెళ్ళాక, ఒక చోట చీకూరువాయువులు పులిసిపోయిన రక్తాన్ని తినే ఈగలు కనపడ్డాయి. దానిని బట్టి అక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోతయిన కళ్ళతో, భయంకరమైన పెద్ద కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తొలు నెత్తురోడుతుండగా తన వంటికి చుట్టుకుని,ఓ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్లు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు గుచ్చుకుని, వొంటి నిండా మాంసం అంటుకున్న ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి, అమాంతం సీతమ్మని తన వోళ్ళో కూర్చోబెట్టుకుని, రామ లక్ష్మణులతో ఇలా అన్నాడు.

"మీరు అధర్ములు, పాపమైన జీవితం కలవాళ్ళు. ముని వేషాలు వేసుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు. అందుకే మీ భార్యని నేను తీసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినటం చాలా ఇష్ట మైన పని" అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో " చూసావా లక్ష్మణా  ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతుందో! నాకు ఎంత కష్టం వచ్చిందో చూసావా. నా కళ్ళ ముందే పరాయివాడు నా భార్యని ఎత్తుకుని తీసుకెళ్ళి, తన వొళ్లో కూర్చోపెట్టుకున్నాడు. నాకు చాలా భాదగా ఉంది" అని. ఆ విరాధుడి వైపు చూసి "మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా. మేము దశరధ మహారాజు పుత్రులము. మేము రామ లక్ష్మణులం. మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు?" అని రాముడు అడిగాడు.
అప్పుడా విరాధుడు " నేను జావుడు అనే ఆయన కుమారుడను.మా అమ్మ పేరు శతహ్రద.  నేను అరణ్యాలలో తిరుగుతూ అన్ని తింటూ ఉంటాను" అని చెప్పి, సీతమ్మని తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగించారు. అప్పుడా విరాధుడు కేవలం ఆవులించేసరికి, ఆ బాణములు కింద పడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన వీరాదుడు రాముడి మీదకి తన శూలo తో దాడి చేసాడు. అప్పుడు రాముడు తన బాణముల చేత ఆ శూలాన్ని గాలిలో ముక్కలు చేశాడు.

అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి, రామ లక్ష్మణుల ఇద్దరిని పట్టుకుని, తన భుజం మీద వేసుకుని అరణ్యం లోకి పరుగెత్తాడు. ఆది చూసిన సీతమ్మ కు ఏమి చెయ్యాలో తెలియక గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేసాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు క్రిందపడ్డాడు. క్రిందపడ్డ వీరాదుడిని రామ లక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. పైకి కిందకి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మ ణుడితో, ఏనుగుని పట్టటానికి తవ్వే లాంటి  ఒక పెద్ద గొయ్యి తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపాటికి  లక్ష్మణుడు గోతిని తవ్వేశాడు.

అప్పుడా విరాధుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఓ రఘునందనా! నేను తపస్సు చేసి బ్రహ్మ గారి వరం పొందాను కనుక నన్ను ఏ అస్త్ర శస్త్రములు ఏమీ చెయ్యలేవు. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గాంధర్వుడిని. నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకి వెళ్లలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శాపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు  దశరధుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడవు అవుతావో ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్లీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు చెప్పాడు. కాబట్టి, నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి అని అడిగాడు. తరువాత రామ లక్ష్మణులు ఆ విరాధూడిని ఆ గోతిలో వేసి, మట్టితో పూడ్చేసి, శరభంగ ముని ఆశ్రమమానికి వెళ్లారు.

ఈ విరాదునికి కర్కటి అనే భార్య ఉంది. విరాధుడు చనిపోయిన తర్వాత ఆమెను కుంభకర్ణుడు బలాత్కారం చేయగా ఆమెకు ఒక పుత్రుడు కలిగాడు అతనిని భీమ అని ఆమె పిలిచింది. ఆ భీముని వల్లనే భీమశంకర జ్యోతిర్లింగం వచ్చినది. 

8, జులై 2014, మంగళవారం

కబందుడు

కబందుడు

కబంద హస్తములు అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కాని ఎవరీ కబందుడు? అతని హస్తముల విశిస్టత ఏమిటి?

కబందుని గురించి మనకు రామాయణం లో వాల్మీకి మహర్షి చెప్పారు.

రామలక్ష్మణులు సీతాదేవి ని ఎవరో రాక్షసుడు  అపహరించాడు అని జఠాయువు ద్వారా  తెలుసుకుని ఆమె కోసం వెతుకుతూ తిరుగుతున్న సమయం లో లక్ష్మణ స్వామికి ఎడమ భుజం అదిరింది. అది అశుభ సూచన. మనసు అకారణం గా చంచలం గా ఉంది. జరగకూడనిది  ఏదో జరగబోతున్నది అని మనస్సు చెప్పుతున్నది. కాని ఆ జరగబోయే అశుభం నుండి మనం తప్పించుకోగలo అని ఆ వంచులకం అనే పక్షి కూత చెపుతోంది. ఆ పక్షికూత విన వస్తే ఆ శబ్దం విన్నవారు త్వరలో యుధం చేయబోతున్నారు, కాని ఆ యుధం లో వారికి విజయం లభిస్తుంది, అని లక్ష్మనుడు రామునకు చెపుతూ ఉన్న ఆ సమయం లో వారికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. అది ఏమి శబ్దమో వారు తెలుసు కోవాలని ప్రయత్నించే లోగా ఒక విచిత్రమైన,వికృతమైన ఆకారం వారికి ఎదురుగా కనిపించింది.
ఆ ఆకారానికి తల లేదు, కాళ్ళు లేవు. నుదురు వంటి భాగం చాతి లోనూ, ముఖం వంటి ఒక భాగం పొట్ట వద్ద, అక్కడే ఒక కన్ను వంటి ఆకారం ఆ కంటికి ఒక పెద్ద రెప్ప, ఆ రెప్పకు పచ్చటి పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. ఆ కన్ను అగ్నిజ్వాల లాగ ఎర్రగా ఉంది. ఆ ఆకారం యొక్క చేతులు ఒక యోజనం (సుమారు గా 12 కిలోమీటర్లు) పొడవుగా ఉన్నాయి. ఆ ఆకారాన్ని చూస్తె అది ఆ చేతులతో జంతువులను ఈడ్చి లాగుతుంది అని అర్ధం అవుతుంది. వారు ఇలా ఆలోచిస్తున్నoతలోనే ఆ ఆకారం తన రెండు చేతులతో వారిని పట్టుకుంది. ఆ ఆకారం తన చేతికి దొరికిన ప్రతిదాన్ని తన ఆహారం లానే భావిస్తుంది కనుక వారిని కూడా తినుటకు సంసిధం అయింది. ఆ పరిస్తితిలో లక్ష్మనుడు రామునితో "అన్నయ్యా!  ఈ విచిత్రమైన ఆకారం కదలలేదు కనుక మనం ఇతనిని మనం చంపకూడదు, ఇది ఇప్పుడు మనకు అపకారం చేయబోతోంది కనుక శిక్షించాలి. కనుక వీనికి కల ఈ చేతులను మనం త్రుంచివేయాలి" అని అన్నాడు. వెంటనే రాముడు ఆ ఆకారం యొక్క కుడి చేతిని, లక్ష్మనుడు ఎడమ చేతిని ఖండించి వేసారు.  చేతులు ఖండించగానే ఆ ఆకారం పరమానందం పొందింది.
ఆహా మహానుభావులారా! ఇంతకాలంగా  నా ఈ చేతులు ఖండించే వారికోసమే ఇటు వచ్చిన వారిని పట్టుకుంటూ ఉన్నాను. ఇంతకాలానికి మీరు ఈ కార్యానికి వచ్చారు. దయచేసి మీరు ఎవరు?ఇక్కడకి  ఎలా వచ్చారో  చెప్పండి? అని అడిగాడు.

దానికి లక్ష్మనుడు " ఈ యన మా అన్నగారయిన శ్రీరాముడు, నేను వారి తమ్ముడు లక్ష్మనుడిని. మేము ఇక్ష్వాకు వంశమునకు చెందిన వారము. మా అన్నగారి ధర్మపత్ని ఐన మాతల్లి సీతమ్మను ఎవరో రాక్షసుడు అపహరించాడు అని తెలిసి ఆమెను వెతుకుతూ ఇటు వచ్చాము. తమరు ఎవరు?" అని అడిగాడు.
దానికి ఆ వింత ఆకారం సమాధానం చెప్తూ "నేను శ్రీ అనే వాని యొక్క మద్యముడైన పుత్రుడను, నా పేరు దనువు.నేను చంద్రునివలె, ఇంద్రునివలె అత్యంత సుందరమైన, ఆహ్లాదకరమైన శరీరం కలిగిన వాడిని. ఆ అందం వల్ల అతిశయించిన గర్వంతో నావద్ద ఉన్న కామరూప శక్తి చేత విచిత్రమైన, భయంకరమైన రూపములు ధరించి అనేక ప్రాంతములలో ఉన్న ఋషులను, మునులను భయకంపితులను చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు కoద మూలములు ఏరుకుంటున్న స్థూలసిరస్కుడు అనే ఒక ఋషికి ఈరోజు నేను ఉన్నఈ రూపం తో ఒక్కసారిగా కనిపించాను. నన్ను చుసిన ఆ ఋషి ఉలిక్కిపడి, నిజమును గ్రహించి నీకు ఇటువంటి  భయంకరమైన, జుబుక్త్సాకరమైన రూపం ఇష్టం లా అనిపిస్తున్నది కనుక నువ్వు ఈరూపం తోనే ఉందువు గాక అని నాకు శాపవాక్కు విడచాడు.అప్పుడు సిగ్గు పడిన నేను శాపవిమోచనం చెప్పమని కోరగా, ఆ ఋషి కొంతకాలం అరణ్యంలో నేను ఈ రూపం తో పడిఉండగా రామచంద్రుడు వచ్చి నా చేతులు ఖండించి నన్ను అగ్నిలో దాహిoచిన  తర్వాత నాకు నిజరూపం వస్తుంది అని సెలవిచ్చారు.
ఆ ఋషి  శాపం కార్యరూపం నాకు సంక్రమించేలోపు బ్రహ్మగురింఛి ఘోర తపస్సు చేస్తే, ఆయన నన్ను దీర్ఘాయుష్మాన్భవ అని దీవించి వెళ్ళిపోయాడు. అప్పుడు మరలా గర్వం అతిశయించిన నేను ఇంద్రుని మీదకు యుధానికి వెళ్ళాను. ఐతే ఇంద్రుడు తన వజ్రాయుధం తో నా తలను ఖండించి, తలను, కాళ్ళను పొట్టలోకి తోచి వేసాడు. దీర్ఘయుషు ఉన్ననేను ఈ రూపం తో ఎలా ఉండగలను బ్రతకటానికి ఆహారం కావలి కదా అని నేను ఇంద్రుని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు కన్ను కనిపించేలాచేసి, యోజనం ప్రమాణం లో చేతులను ఇచ్చి వాటితో తడుముకొని దొరికినవి తినమని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీరామా అప్పటినుండి నేను మీకోసం ఎదురు చుస్తూ ఉన్నాను. మీరు నా శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తే, నాకు నిజరూపం వచ్చిన తర్వాత నాకు గల శక్తి చేత మీరు సీతమ్మను వెతకుటకు నేను మార్గం చెప్పగలను అని అన్నాడు.
సూర్యాస్తమయం సమీపిస్తున్నది కావున లక్ష్మనుడు ఒక పెద్ద గొయ్యి తీసాడు. అతనిని ఆ గోతిలోకి నెట్టి వేసారు. ఎనుగులచేత విరచి, ఎండినటివంటి కర్రలను వేసి అగ్ని సంస్కారం చేసారు. ఇంతకాలం గా కదలకుండా తినుటవల్ల బాగా కొవ్వుపట్టిన శరీరం అవుటవల్ల మెల్లగా కాలింది. ఆ శరీరం పూర్తిగా కాలిన తర్వాత ఒక సుందరమైన ఆకారం కల దివ్యపురుషుడు రధంలోకనిపించాడు. ముగ్ధమనోహరమైన, కృతజ్ఞతతో కూడిన  చిరునవ్వుతో వారికి నమస్కరించి, ఒక్క క్షణం కన్నులు మూసుకుని, తర్వాత ఇలామాట్లాడాడు.
" రామా! మీరు దుర్ధశాఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కనుక భార్యావియోగం కలిగింది. మీరు ఈ విధంగా వెతికితే మీకు కలిగే ప్రయోజనం చాల తక్కువ. ఈ సమయం లో ఈ భూమండలం అంతా తిరిగిన మిత్రుని వల్ల  మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీకు ఇప్పుడు అటువంటి ఒక మిత్రుడు అవసరం.అటువంటి ఒక వానరరాజు ఉన్నాడు. అతని పేరు సుగ్రీవుడు. ఆతను సూర్యుని ఔరస పుత్రుడు. కొన్ని కారణముల వాళ్ళ తన అన్నగారయిన వాలితో విభేదించి తన నలుగురు మంత్రులతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నారు. సుగ్రీవుడు అత్యంత బలవంతుడు, ఈ భూమిమీద ఎక్కడ ఏమి ఉన్నదో తెలిసిన వాడు. కావున నీవు అతనితో అగ్ని సాక్షిగా స్నేహం చేసుకో మని చెప్పాడు. అక్కడికి ఎలావేళ్ళాలో కుడా చెప్పి రాముని అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు.

5, జులై 2014, శనివారం

గధ

గధ 

పూర్వం గధ అనే ఒక రాక్షసుడు ఉండే వాడు. అతడు దైవ, మానవుల కు భయం కలిగిస్తూ ఉండే వాడు. ఐతే అతనిలో కల మంచి సుగుణం సత్యవాక్య పరిపాలన. తన వద్దకు వచ్చి ఎవరు ఏది అడిగినా వెంటనే ఇచ్చే వాడు. 

దేవ, మానవుల కష్టాలు గమనించిన ఆ శ్రీ మహా విష్ణువు గధ వద్దకు వెళ్లి తన ఎముకలు కావలసినది గా కోరారు. అప్పుడు ఆ గధ తన ఎముకలు తానే విరచి ఆ శ్రీమహావిష్ణువు చేతిలో పెట్టారు. ఆ ఎముకలను తీసుకున్న విష్ణువు పరమ దయతో ఆ ఎముకలకు ఒక ఆకారాన్ని ఇచ్చి ఎల్లప్పుడూ తనతో నే ఉంచుకున్నరు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ ఎముకలకు ప్రసాదించిన ఆకారాన్ని మనం ఈ నాటికీ గధ అనే పిలుస్తున్నాం. 

ఒక వ్యక్తి  ఎంత రాక్షసుడైన తనలో ఉన్న ఏదో ఒక చిన్న మంచి తనం తో, చేసిన త్యాగం తో అంతకు ఎన్నో రెట్ల భగవత్ అనుగ్రహాన్ని పొందగలడు అనటానికి ఇది ఒక ఉదాహరణ. 

17, జూన్ 2014, మంగళవారం

రాక్షస వధ (నిగ్రహం) : రహస్యం

మనకు మన పురాణాలలో కనిపించే చాలా సామాన్య విషయం రాక్షస వధలు (నిగ్రహం). ఐతే అన్ని వధలు (నిగ్రహం) ఒకేలా ఉండవు, వాటికి గల కారణాలు, ఆ వధ వెనుక ఉన్న రహస్యాలు, తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ శీర్శికలో.


  1. వృత్రాసురుడు  
  2. రావణాసురుడు 
  3. కుంభకర్ణుడు 
  4. భస్మాసురుడు 
  5. హిరణ్యకశిపుడు 
  6. హిరణ్యక్షుడు
  7.  బలి చక్రవర్తి 
  8. నరకాసురుడు 
  9. బాణాసురుడు 
  10. శిశుపాలుడు 
  11. దంతావక్రుడు 
  12. గధ