2, ఫిబ్రవరి 2022, బుధవారం

విదుర నీతి - 4

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో మూడు భాగములు చెప్పుకున్నాం కదా! మూడవ భాగంలో విదురుడు దృతరాష్టృని అదిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ ప్రశ్నలకు దృతరాష్టృడు సమాధానం ఇచ్చాడా లేదా? అని తెలుసుకుందాం!

సంస్కృత శ్లోకం:

శ్రోతుమిచ్ఛామి తే ధర్మ్యం పరం నైఃశ్రేయసం వచః

అస్మిన్రాజర్షివంశే హి త్వమేకః ప్రాజ్ఞసంమతః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిని ధృతరాష్టృండనె, విను కౌంతేయాగృజోక్తివినకునికంజిం

తనుజెంది ధర్మమునీ,లిని రాజర్షికులవర్య తెలియంజెపుమా

భావంః

విదురుని మాటలు విన్న దృతరాష్టృడు, కౌంతేయ పుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు మాటలు (సమాధానం) సంజయుడు చెప్పనందువల్ల కలిగిన ఆలోచన కారణంగా, ఈ రాజర్షికులములో పుట్టిన నీ నోటి నుండి ధర్మబద్దమయిన గొప్ప  శుభములను కలిగించే మాటలను వినాలి అనుకుంటున్నాను. 

విశ్లేషణః

ఇక్కడ దృతరాష్టృడు విదురునికి సమాధానం ఇచ్చాడా లేదా? అబద్దం అయితే చెప్పలేదు. అలాగని నిజము పూర్తిగా చెప్పలేదు. ఈ సందర్భంలో మనకు దృతరాష్టృని లౌక్యం తెలుస్తుంది. అతనికి  మంచి చెడుల మద్య వ్యత్యాసం బాగా తెలుసు. కానీ ఆమాటలు బయట పెట్టని లౌక్యం ఉంది. మంచి మాటలు వినాలని ఉంది తప్ప ఆ మాటలలోని మంచిని స్వీకరించే మనస్తత్వం మాత్రం లేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి