వినాయకుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వినాయకుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2025, శుక్రవారం

సూర్య ప్రార్ధన - కుమార సంభవం

ఈరోజు మనం కుమార సంభవం లో చెప్పిన సూర్య ప్రార్ధన చుద్దాం!

                అనుపమ దివ్యమూర్తి యను నమ్తియకాదు భవాష్టమూర్తులం

                దును పరమూర్తి దాన, ప్రభతోడ జగజ్జన రాజి కెల్ల నిం

                దనయము దాన దృష్టి యను నంతియకాదు త్రిలోచనాదిలో

                   చనమును దానయైన రవి చారు నిజ ప్రభ మాకు నీవుతన్

ఆర్ధముః 

అనుపమ దివ్యమూర్తి = సాటి లేని అమానుష మైన ఆకారము గల, అనినంతియకాదు =  అనినంత మాత్రమే కాదు భవ= శివుని అష్ట=ఎనిమిది మూర్తులందు=మూర్తులలో, తాను=తనే, పర= గొప్ప, మూర్తి=మూర్తి, ప్రభ= కాంతి, తోడన్=తో, జగత్=లోకమునందలి,  జనరాజి= జనుల యొక్క సమూహం, ఎల్ల= అందరికి, ఇందున్= ఇందులో, అనయమున్= ఎల్లప్పుడు  దాన= తన,  దృష్టి= చూపు, యను నంతియకాదు త్రిలోచన= మూడు కన్నులలో,ఆది= మొదటి, లోచనము= కన్ను, యైన=  అయిన, రవి= సూర్యుడు,  చారు= అందమైన,  నిజ ప్రభ = తనదైన మెరుగును  మాకు= మాకు, నీవుతన్= ఇచ్చు గాక.

తాత్పర్యంః నిరుపమానం, అమానుషమయిన ఆకరము గల వాడనునంతమాత్రమే కాదు, శివుని ఎనిమిది మూర్తులలోను దానే శ్రేష్టమైన మూర్తి, తన వెలుగుతో లోకమునందలి ప్రాణికోటి కంతకును దానే యెల్లప్పుడును దృష్టి యనునంత మాత్రమే కాదు. ముక్కంటియైన శివునకు గల మూడుకన్నులలో మొదటి కన్నయిన సూర్యుడు మాకుతనదైన వెలుగును ఇచ్చును గాక!

21, ఆగస్టు 2020, శుక్రవారం

గణేషునికి ఒక చిన్న ఎలుక ఎలా వాహనం అయ్యింది?

మనం ఇంతకుముందు వినాయకుని గురించి చాలా విషయములు చెప్పుకున్నాం. అయితే అలా చెప్పుకున్నప్పుడు వినాయకుని వాహనం మూషికం అని చెప్పుకున్నాం!
వినాయకుని ఆహార్యం గురించి మనకు  తెలుసు. అటువంటి భారీకాయునికి ఒక చిన్న చిట్టి ఎలుక వాహనం ఎలా అయ్యింది? అని తెలుసుకోవటానికి ఒక చిన్న కధ ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఒకానొక సమయంలో పరాశర మహర్షి ఆశ్రమంలోకి ఒక పెద్దదయిన ఎలుక వచ్చింది. అలా వచ్చిన ఆ ఎలుక ఆ ఆశ్రమంలో ఉన్న అందరిని ఇబ్బంది పెట్టసాగింది. ఆశ్రమంలోని సకల వస్తువులను పాడు చేయసాగింది.  మొక్కలను, వాటి పాదులను పాడు చేసింది. చివరకు మహర్షుల వస్త్రములను కూడా కొరికేయటం మొదలుపెట్టింది. వారు ఆశ్రమవాసులు అవ్వటంవలన వారు జీవ హింస చేయరు. కానీ ఆ ఎలుకను ఎలా వదిలించుకోవాలో వారికీ తెలియలేదు.
ఆ సమయంలో పరాశర మహర్షి శ్రీ మహాగణపతి  ని తమకు  సహాయం చేయమని కోరారు.వారి భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీ మహాగణపతి వారిని ఇబ్బంది పెడుతున్న ఆ భయంకరమైన ఎలుకను పట్టుకోవడానికి తమ చేతిలో ఉన్న పాశమును  విసిరారు. ఆ పాశము ఆ మూషికము యొక్క వెనుక తరిమి తరిమి పాతాళ లోకం వరకు వెళ్ళి మూషికమును బంధించి, దానిని తీసుకుని గణేషుని వద్దకు చేరింది. 
 అలా గణేషుని దగ్గరకు చేరిన మూషికం శ్రీ  గణేశుని స్తుతించటం ప్రారంభించింది. అప్పుడు గణేశుడు ఆ మూషికం పరాశరమహర్షిని, అతని ఆశ్రమవాసులను విసిగించినా ఇప్పుడు అతని శరణు కోరినది కనుక వరము కోరుకొమ్మన్నాడు.  గణేశుని ఆ మాటలు విన్న మూషికము భక్తిశ్రద్ధలతో, కొంత అహంభావంతో తనకు ఏ విధమైన వరమూ అవసరం లేదు అని అతనికి ఏమయినా వరం కావాలంటే కోరుకొమ్మని చెప్పినది. అలా గణేషునితో చెప్పిన మూషికమును తనకు వాహనంగా ఉండమని గణేశుడు అడిగాడు. తన అహంకారము తో ఆ మూషికం గణేశునికి వాహనంగా ఉండటానికి అంగీకరించింది. అయితే గణేశుడు ఒక్కసారి తనమీద కూర్చోగానే, దానికి తాను చేసిన తప్పు తెలిసిరాలేదు. అప్పుడు పశ్చాత్తాపం పొంది తిరిగి గణేశుని ప్రార్ధించింది. తనకి గణేశుని భారం వహించే శక్తిని ఇవ్వమని కోరుకున్నది. అప్పుడు గణేశుడు ఆ మూషికమునకు ఆ శక్తిని ఇచ్చాడు. అప్పటి నుండి అతను మూషిక వాహనుడు అయ్యాడు.
మన హిందూ ధర్మం లో ఉండే ప్రతీకాత్మకతను మనం గణేశుని ఆహార్యం లో చక్కగా చూడ వచ్చు. ఆ ప్రతీకాత్మకత తెలుసుకోవటం కోసం ఇక్కడ నొక్కండి.



7, ఏప్రిల్ 2015, మంగళవారం

మలేషియా లోని గణపతి దేవాలయం

మలేషియాలోని మొదటి గణపతి దేవాలయం పెటలింగ్ జయ లో ఉన్నది మలేషియా లోని ఇతర గణపతి దేవాలయములకంటే ఇదే పెద్దది. ఇక్కడి శిల్పకళ నిజంగా మన భారతదేశం లోని దేవాలయముల వలెనే ద్రావిడ శైలిలో ఉంటుంది.  గోపురమే కాదు ఆ గోడలమీది శిల్పములు కూడా మనస్సును మరియు కళ్ళను కూడా ఆకర్షిస్తాయి. ఈ  నిర్వహణ భాద్యత పెటలింగ్ జయ  హిందూ అసోసియేషన్ వారు వహిస్తున్నారు.









ఈ దేవాలయంలో వినాయక చతుర్ధి ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం అత్యంత మనోహరంగా ఉంటుంది. 
ఈ దేవాలయంలో శివాలయం, మారియమ్మ దేవాలయం ఉన్నాయి. 

 ఈ దేవాలయం లో గణపతి ఉరెరిగింపు కోసం రధం ఉన్నది. ఆ రధమునకు పంచిన గుఱ్ఱములు, ఆ రధ చోధకునిగా సక్షాత్తు బ్రహ్మదేవుడు ఆశీనులయి ఉంటారు.
 గణేశునికి మూషిక వాహనం కూడా ఉన్నది.

 ఆ దేవాలయంలో హారతి ఇచ్చే ఆ సన్నివేశం  మీకోసం క్రింద ఇచ్చాను.



28, ఆగస్టు 2014, గురువారం

వినాయక ఆకారం - విశ్లేషణ

వినాయక ఆకారం చూడగానే మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఐతే ప్రతి విషయానికి ఎంతో విశేషార్ధం ఉండేలా మన పూర్వికులు వినాయకునికి ఈ ఆకారాన్ని సూచించారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా!

  1. అతి పెద్దదయిన తల - పెద్దగా ఆలోచించమని చెపుతుంది 
  2. అతి పెద్ద చెవులు - ఎదుటివారు చెప్పేది కూలంకషంగా వినమని 
  3. అతి చిన్న కన్నులు - దృష్టి నిశితం గా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి 
  4. నోటిని కప్పుతూ ఉన్న తొండం - నీ మాటలను అదుపులో ఉంచుకో 
  5. ఒక విరిగిన దంతం, ఏకదంతం - సర్వదా మంచిని నీతో ఉంచుకుని చెడును విరిచి పడేసే ప్రయత్నం చేయి 
  6. వంపుతిరిగిన తొండం - పరిస్థితులను తట్టుకునేవిధంగా తనను తాను మలచుకొంటూ, తనదైన వ్యక్తిత్వాన్ని వదలకుండా చూసుకో మని చెపుతుంది 
  7. యజ్ఞోపవీతంగా సర్పం - సర్పం కుండలిని శక్తికి ప్రతీక, ప్రతి ఒక్కరు తమ కుండలిని శక్తిని వృద్ధి చేసుకోవటం కోసం ప్రయత్నించాలి అని 
  8. లంబోదరం - జీవితం లో ఎదురయ్యే మంచిని చెడుని సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగమని, (వినాయకుని ఉదరంలో సమస్త లోకములు ఉన్నాయి అని మరో అర్ధం చెప్పుకోవచ్చు) 
  9. అభయ ముద్ర - భక్తులకు భయపడనవసరం లేదని చెప్పుట 
  10. వరద ముద్ర - కోరిన కోరికలు తీర్చగలను అని చెప్పుట 
  11. పాశం (పై ఎడమ చేతిలో) -  భక్తులను ఆధ్యాత్మిక విషయముల వైపునకు లాగుతాను అని 
  12. గొడ్డలి (పై కుడి చేతిలో) - కర్మబంధములనుండి విముక్తిని కలిగించగలను అని 
  13. మోదకము/ కుడుము - సాధన ద్వారామత్రమే అతి మధురమైన మోక్షం లభిస్తుంది అని 
  14. పాదముల వద్ద ఉన్న ఫలములు - ఈ ప్రపంచములో కావలసినవి అన్ని ఉన్నాయి, కేవలం నీవు శ్రమించి వాటిని సాధించుకోవాలి 
  15. ఎలుక - ఎక్కడి, ఏమూలకు అయిన చేరగలిగిన, తనకు అడ్డంగా ఉన్నదానిని దేనిని అయిన నాశనం చేయగలిగిన సామర్ధ్యం ఉండాలి, కాని అది మన ఆధీనంలో ఉండాలి 
  16. ఇద్దరు భార్యలు  సిద్ధి ,బుద్ధి వారి పుత్రులు శుభము, లాభము మరియు పుత్రిక సంతోషి - మన బుద్ధి (మనస్సు) మన ఆదీనం లో ఉంటే మనం కోరుకున్న కోరికలు సిద్ధిస్తాయి. దానితో పాటుగా మనకు మంచి జరుగుతుంది, లాభము కూడా లభిస్తుంది 
  17. మరి సంతోషి ని కుమార్తె అని ఎందుకు చెప్పారు?  మనకు జరిగిన మంచిని కాని శుభమును కాని మరొకరికి పంచటానికి మనం ఆలోచించ వచ్చు కాని వాని వల్ల కలిగిన ఆనందాన్ని అందరికి పంచుతాము. కనుకనే సంతోషి ని కుమార్తెగా చెప్పారు. 

వినాయక ఆవిర్భావం - రహస్యం

మన శాస్త్ర, పురాణములలో మన పూర్వికులు, ఋషులు, మునులు చెప్పిన కధలు, సంఘటనలు మనస్సుకు హత్తుకునే విధంగా, ఆలోచింప చేసే విధంగా ఉంటాయి. వారు చెప్పిన ప్రతి విషయం లో ఎంతో ఖటినమైన, జటిలమైన విషయాన్ని క్రోడీకరించి చిన్న కధగా చెప్తారు, మనం అలోచించి తెలుసుకో గలిగితే, మన జన్మ ధన్యం అవుతుంది. ఇటువంటి ఒక అధ్బుతమైన విషయాన్ని వినాయక ఆవిర్భావం లో కూడా చెప్పారు.

పార్వతీదేవి శక్తి స్వరూపిణి.

  1. ఆమె నలుగుపెట్టుకున్న తరువాత వచ్చిన నలుగు పిండితో ఆమె ఒక రూపాన్ని చేసింది. అంటే ఆమె శరీరంలోనుండి వచ్చిన మలినములు (కేవలం శక్తి వల్ల వచ్చే అతిశయం) ఒక రూపాన్ని తీసుకున్నది. 
  2. అతనికి వినాయకుడు అని పేరు పెట్టారు. - నాయకుడు : తండ్రి , వినా: సంభందం లేని వాడు (తండ్రితో నిమిత్తం లేకుండా జన్మించిన వాడు) అంటే శివుని నిమిత్తం లేకుండా జన్మించినవాడు. 
  3. మహాదేవుడు తిరిగి వచ్చినపుడు ఆ బాలుడు శివుని గుర్తించలేదు. - అంటే కేవలం అతిశయించిన శక్తి సామర్ద్యములు ఉండుటవల్ల రజోగుణం ప్రజ్వరిల్లి, జ్ఞానమును లోనికి రానివ్వకుండా అడ్డుకుంటారు. 
  4. శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి ప్రవేశించారు - అంటే రజోగుణ అతిశయమును ఖండించి జ్ఞానము లోనికి ప్రవేశించినది. 
  5. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి తల్లి తన పుత్రునిలో లోపములను, దోషములను కూడా ప్రేమించగలదు, కానీ తండ్రి అతని పుత్రుల లోని అజ్ఞానాన్ని చూసి ఊరుకోలేడు, ఊరుకోకూడదు కూడా. అది అతని ధర్మం. కనుకనే పుత్రుని దండించవలసిన అవసరం ఆదిపిత అయిన శివుని భాద్యత. 
  6. ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్న జీవి తల - మనకు శాస్త్రముల ప్రకారం, చనిపోయిన లేదా తాము మరణమును ఆహ్వానిస్తున్నాము అనే వారు తప్ప ఎవరూ ఉత్తర దిశకు తలపెట్టి పడుకోరు. కాబట్టి తామంత తాము శిరస్సు ఇవ్వటానికి సిధమైన వారి నుండి శిరస్సుని తీసుకురమ్మని ఆజ్ఞ. 
  7. ఏనుగు తల - ఏనుగు తల మనకు జ్ఞాన శక్తి, క్రియాశక్తి (కర్మశక్తి) కి ప్రతీక, 
  8. ఆ తలను బాలుని శరీరమునకు అతికించే పని స్వయంగా శివుడు చేసాడు కనుక ఇప్పుడు వినాయకుని జననం లో శివునికి కూడా భాగం కలిగినది. అంటే శక్తితో పాటు జ్ఞానం కూడా వినాయకునికి ప్రాప్తించినది. 
  9. ఇప్పుడూ అతనిని వినాయకుడు అనే పిలిచారు. వినాయకుడు : విచిత్రమైన నాయకుడు 


  

27, ఆగస్టు 2014, బుధవారం

వినాయక ఆవిర్భావం

వినాయక జననం గురించి అనేక పురాణములలో అనేక విధములుగా చెప్పబడినది.

లింగపురాణం :
రాక్షసులు సర్వత్రా మహాదేవుని గురించి తపస్సు చేసి అమితమైన బల, పరాక్రమములను పొంది, సర్వదేవతలను కష్టముల పాలుచేయసాగారు. వారి భాదలు తట్టుకోలేక ఆ దేవతాగణములు దేవదేవుని వారి కష్టములను తొలగించే ఉపాయం చెప్పమని ప్రార్ధించారు. అప్పుడు మహాదేవుడు తన మనోబలంచేత వినాయకుని సృష్టించి ఆ రాక్షసులకు అన్ని రకముల విఘ్నములు కలిగించేవిధంగా ఆజ్ఞ ఇచ్చి పంపారు.

సుప్రభేదాగమము :
ఈ ఆగమము ప్రకారం, పార్వతీ పరమేశ్వరులు ఒకసారి హిమాలయములో విహరిస్తూ ఉండగా, వారికి సృష్టికార్యములో నిమగ్నమైన ఒక గజద్వయం కనిపించినది. ఆ దృశ్యమును చూసిన పార్వతీదేవి సిగ్గుతో పరమశివుని  చూసినది, ఆమె ఆంతర్యమును గ్రహించిన శివుడు, పార్వతీదేవి కూడా గజరూపం ధరించారు. అప్పుడు వారి ఆనందమునకు ప్రతిగా గజముఖం కలిగిన వినాయకుడు జన్మించాడు.

శివ పురాణం: 
ఇక మనం సర్వదా వినాయక చవితి రోజు అనుసంధానం చేసే వినాయక సంభవ కధ శివపురాణంలోనిది. 

విష్ణుదేవుని ద్వారపాలకులు ఒకసారి శివపార్వతుల దర్శనార్ధం కైలాసానికి వచ్చారు. దేవిని దర్శించుకునే సమయంలో వారు పార్వతీదేవికి ఒక విజ్ఞాపన చేసారు. 
" దేవీ! పార్వతీమాతా! మహాదేవునకు నంది, భ్రుంగి వంటి ద్వారపాలకులు ఉన్నారు. జగన్మాతవైన నీకు కనీసం ఒక్కరైనా ఉండాలికదా, అలా ఉండుట ఎంతయినా అవసరం" అని చెప్పారు. 
వారి మాటలు విన్న పార్వతీ దేవి చిరునవ్వుతో ఆ కార్యం త్వరలోనే నెరవేరుతుంది అని వారికి చెప్పినది. 

గజాసురుని కోరికమీద, అతని పొట్టలో నివాసముంటున్న మహాదేవుని, శ్రీహరి ఒక గంగిరెద్దులవాని రూపంలో వెళ్లి తీసుకువస్తున్నాడని తెలిసిన పార్వతీదేవి అమిత సంతోషాన్ని పొందినది. మహాదేవుడు తిరిగి వచ్చేలోపు ఆమె సర్వాంగసుందరంగా ఎదురు వెళ్ళాలి అని భావించినది. ఆమె నలుగుపెట్టుకున్న పిండిని ముద్దగా చేసి సంతోషంతో ఆ ముద్దకు ఒక బాలుని ఆకారం ఇచ్చినది. ఆ మూర్తిని చుసిన ఆమె లో మాతృత్వపు భావన కలిగినది. వెంటనే ఆ మూర్తికి ప్రాణం పోసినది. ఆ బాలునికి వినాయకుడు అని పేరు పెట్టినది. ఆ బాలుని ద్వారపాలకునిగా ఉంచి ఎవరినీ లోనికి రానివ్వవద్దని చెప్పి స్నానాధికములు చేయుటకు లోపలకు వెళ్ళినది.
అప్పుడు ఎంతో కాలం తరువాత కైలాసానికి వచ్చిన శివుడు ఉమను చూడాలన్న కోరికతో ఆతృతగా వచ్చాడు. కాని శివుడే తన తండ్రి అని తెలియని వినాయకుడు అతనిని అడ్డగించాడు. వారి మధ్య వాదోపవాదములు జరిగిన తరువాత శివుడు స్వయంగా తన త్రిశూలంతో ఆ బాలుని కంఠమును ఉత్తరింఛి లోనికి ప్రవేశించారు.
ఎంతో కాలంతరువాట తనపతిదేవుని చుసిన పార్వతి ఎంతో సంతోషించినది. కొంతసమయం తరువాత వారి మాటలలో ద్వారపాలకునిగా ఉన్న బాలుని ప్రస్తావన వచ్చినది. శివుడు తానూ బాలుని శిరచ్చేదంచేసిన విధంవిన్న పార్వతీదేవి శోకితురాలయినది.
అప్పుడు మహాదేవుడు తన గణములను ఉత్తరాదిశగా తలను ఉంచి పడుకుని కనిపించిన మొదటి ప్రాణి యొక్క శిరస్సును తెమ్మని ఆదేశించారు. అన్ని గణములు వెళ్లి వెతుకగా వారికి ఒక ఏనుగు కనిపించినది. వారు ఆ ఏనుగు యొక్క తలను తెచ్చి శివునకు ఇచ్చారు. అప్పుడు మహాదేవుడు ఆ బాలునకు ఏనుగు తలను ఉంచి బ్రతికించారు. అప్పటినుండి వినాయకునకు గజముఖుడు అని నామాంతరం వచ్చినది.

కాని ఇక్కడ మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

  1. శివునికి ఒక బాలుడిని శిరచ్చేదం చేసి సంహరించేంత కోపం ఉంటుందా?
  2. సర్వాంతర్యామి ఐన మహాదేవునికి తన పుత్రుని గురించి తెలియదా? 
  3. ఒక ఏనుగు తల నిర్ధక్షిణ్యం గా ఒక చిన్న బాలునకు ఎందుకు అమర్చవలసి వచ్చినది?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చుడండి. 

26, ఆగస్టు 2014, మంగళవారం

వినాయకుడు - గోకర్ణం

గోకర్ణం లో ని శివలింగమును అక్కడ ప్రతిష్టించినది బాలగణపతి అని చెప్తారు. ఐతే అక్కడే ఎందుకు ప్రతిష్టించారు?

ఒకానొక సమయంలో రావణాసురుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి తనముందు ప్రత్యక్షమైన శివుని తనతో తన పురమైన లంకకు రమ్మని అడిగాడు. దానికి శివుడు ప్రతిగా తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తనకు, తన ఆత్మలింగమునకు అభేదం అని చెప్పారు. ఐతే ఆ లింగమును ఎక్కడ భూమిమీద పెడితే అది అక్కడే ప్రతిష్టితమైనట్లు, దానిని మరలా కదిలించుట అసాధ్యం అని కూడా చెప్పారు.
రావణాసురుడు ఆనందంగా ఆ ఆత్మలింగమును స్వీకరించి తన లంకాపురమునకు దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు.
అల కొంత దూరం  వెళ్ళాక (గోకర్ణం వద్ద) సంధ్యా సమయం అయినది. ఆటను స్వయంగా బ్రాహ్మణుడు కావటం వల్ల ఆటను సంధ్యావందనం చేసి తీరాలి. కనుక ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటే ఆటను సంధ్యావందనం చెయ్యొచ్చు అని చూడసాగాడు.
ఈ సమయం కోసం ఎదురుచూస్తున్న గణపతి అక్కడకు ఒక బ్రాహ్మణ యువకుని రూపంలో అక్కడకు వచ్చాడు. ఆ బాలకుని చూసిన రావణాసురుడు ఆ ఆత్మలింగమును ఆ బాలకునికి ఇచ్చి దానిని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు. ఒకవేళ ఆ బాలుడు దానిని పట్టుకోలేకపోతే తనను పిలువమని, ఆ బాలుడు 3సార్లు పిలచేలోపు ఆటను వచ్చి స్వయంగా ఆ లింగమును తీసుకుంటాను అని చెప్పాడు. బాలకుని రూపంలో ఉన్న వినాయకుడు అలాగే అని ఒప్పుకున్నాడు. రావణాసురుడు సంధ్యావందనం చేసుకోనుతకోసం కొంచెం దూరంగా వెళ్ళాడు. ఆటను అలా వెళ్ళగానే బాలుడు వెంటవెంటనే 3సార్లు రావణాసురుని పిలిచాడు. రావణాసురుడు అతని పిలుపు విని అక్కడకు వచ్చేంతలో ఆ బాలుడు ఆ ఆత్మలింగాన్ని అక్కడ ఉంచేశాడు. ఆ తరువాత రావణాసురుడు ప్రతిష్టించబడిన ఆ లింగమును కదిలించే ప్రయత్నం చేసాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైనది. చేసేది ఏమిలేక రావణాసురుడు మరలి వెళ్ళిపోయాడు.   

ఈ కధను మరోవిధంగా కూడా చెప్తారు.
గణపతి అక్కడ గోపాలకుని వేషంలో అక్కడ ఉన్నారని, రావణాసురుడు లఘుశంక కు వెళ్ళవలసి వచ్చినందున అతనికి ఆత్మలింగమును ఇచ్చారని, అప్పుడు ఆ బాఉదు లింగమును కింద ఉంచారని.

25, ఆగస్టు 2014, సోమవారం

వినాయకుడు - మహాభారతం

మహాభారతం మనకుగల అన్ని పురాణములలో, ఇతిహాసములలో అతి పెద్దదయిన గ్రంధము. మహాభారతములో ఒక లక్ష శ్లోకములు ఉన్నాయి. మహాభారతమును రచించినది వేదవ్యాసుడు అని మనకు తెలుసు. ఐతే అతను స్వయంగా ఘంటం పట్టుకుని వ్రాయలేదు. మరి ఎవరు రాసారు? ఎందుకు?
మహాభారత కధ వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగిన తరువాత కొంతకాలానికి రాసాడు. వేదవ్యాసుడు మహాభారతంలో అనేక సందర్భములలో కనిపిస్తాడు. కనుక ఆ సంఘటనలు జరిగినప్పుడు అవి వ్యాసునికి బాగా తెలేసే అవకాశం ఉన్నది.  ఆయన స్వయంగా వేదవ్యాసుడు. కాని జరిగిన సంఘటనలను యధాతధంగా ఒక దృశ్యకావ్యంగా రూపొందించాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయం. కనుక అతనికి ఎవరైనా అనుచరుని (లేఖకుని) సహాయంతో రచన ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో ఒకనాడు బ్రహ్మదేవుని దర్శన భాగ్యం కలిగినది.
అప్పుడు వ్యాసభగవానుడు తనమనస్సులోని భావనను చెప్పి తాను చెప్పినది చెప్పినట్లు రాయగలిగిన లేఖకుని గురించి సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
" వ్యాసా! నీవు తలపెట్టిన ఈ బృహత్ కార్యమునకు విఘ్ననాయకుడైన గణపతి సరిఅయినవాడు. వెళ్లి అతనిని అర్ధించు." అని చెప్పారు. ఆ ప్రస్తావన విన్న వేదవ్యాసుడు అమిత అనందం పొందాడు.
వెంటనే కైలాసానికి వెళ్లి వినాయకునికి తన ప్రతిపాదన వివరించాడు. వినాయకునికి మహాభారత కధను వ్రాయుట సమ్మతమే అని చెప్పారు కాని ఒక షరతు విధించారు.
"ఒకసారి చెప్పటం మొదలుపెడితే, రాయటానికి ఒకసారి కదిలిన తన ఘంటం ఆగకూడదు, ఒకవేళ అలా ఆగినట్లయితే, తానూ ఇంక ఆ రచనకు సహాయం చేయడు."
ఆ షరతు విని వ్యాసుడు అంగీకరించాడు, మరో ప్రతిషరత్తు విధించాడు.
"తానూ చెప్పిన ప్రతి వాక్యాన్ని వినాయకుడు అర్ధంచేసుకున్న తరువాతనే రాయాలి."
ఆ షరతు విన్న విధ్యాదిపతి గణపతి ఆనందంగా ఒప్పుకున్నాడు.
పరశురామునితో జరిగిన యుద్ధంలో  విరిగిన తన దంతమును ఘంటముగా ధరించాడు. మహాభారత ఇతిహాసం వ్రాయటం మొదలుపెట్టారు. ఐతే వ్యాసభగవానునికి తరువాత చెప్పవలసిన శ్లోకం/ఘట్టం/సంఘటన గురించి కించిత్ ఆలోచించవలసి వచ్చినా సమయం తీసుకునే అవకాశం లేదు కనుక తనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు క్లిష్టమైన ఒక శ్లోకం చెప్పేవాడు. గణపతి ఆ శ్లోకం అర్ధంచేసుకుని రాసేలోపు తాను తరువాతి కధను మనసులోనే సిద్ధంచేసుకునే వాడు. అలా చెప్పిన క్లిష్టమైన శ్లోకములను గ్రంధులు అంటారు. మహాభారం మొత్తం మీద ఇటువంటి గ్రంధులు 8800 ఉన్నాయి. అంటే అన్ని సార్లు వ్యాసునికి ఆలోచించవలసిన అవసరం వచ్చింది, వినాయకునికి చెప్పినది ఒక్కక్షణం అలోచించవలసిన అవసరం వచ్చినది. 

ఏకదంతుడు

విఘ్నరాజు వినాయకునికి ఏకదంతుడు అనే పేరుకూడా ఉన్నది. ఆ పేరు అతనికి ఎలావచ్చింది అనేవిషయం గురించి పురాణములలో అనేకవిధాలుగా చెప్పబడింది. 

1. బ్రహ్మాండ పురాణం:
వేయిచేతులు కలిగిన కార్త్యవీర్యార్జునుని సంహరించిన తరువాత పరశురాముడు ఆదిదంపతులైన శివపార్వతుల ను దర్శించుకొనుటకు కైలాసపర్వతానికి వచ్చాడు. ఆ సమయంలో ఏకాంతంలో ఉన్న పర్వతిపరమేస్వరులు తమ ఏకాంతమునకు ఎటువంటి భంగం కలుగకుండా చూడమని బాలగణపతిని నియమించారు. 

పరశురాముని రాకనుగమనించిన వినాయకుడు అతనికి నమస్కరించి ఈ సమయంలో ఆదిదంపతుల దర్శనం కుదరదు అని చెప్పారు. మహర్షి పరశురాముడు అప్పటికే భూమండలం అంతా 21సార్లు తిరిగి క్షత్రియుల నాశం చేసి ఉన్నారు. అతనిలో కొంత గర్వంప్రవేసించి ఉన్నది. ఆ సమయలో అతనికి వినాయకుని మాటలు నచ్చలేదు. ఈ బాలకుడు తనను ఎదిరిస్తున్నాడు అని భావించారు. మహాదేవునకు భక్తుడనైన నన్ను ఇలా ఆపివేసే అధికారం నీకు ఏడూ అని వినాయకుడిని ఎదిరించాడు. అతనిలోని గర్వమును గమనించిన వినాయకుడు ఆ గర్వమును తొలగించాలని భావించాడు. ఎట్టి పరిస్థితులలోనూ పరశురాముని లోపలకు అనుమతించలేనని స్పష్టంచేసాడు. కోపగించిన పరశురాముడు పరమశివప్రసాదమైన తన పరశువును వినాయకుని మీద ప్రయోగించాడు. అతనికి వినాయకుడు కూడా అతనికి ఆయుధములతో సమాధానం చెప్పటం ప్రారంభించారు. వారిద్దరి మద్య జరిగిన యుద్ధంలో పరశురాముడు తన పరశువుతో వినాయకుని ఎడమవైపు దవడమీద చేసిన దాడి వల్ల అతని ఎడమ దంతం విరిగిపోయినది. 
బయట జరుగుతున్న ఈ కోలాహలం విన్న శివపార్వతులు బయటకు వచ్చారు. తన పుత్రుని విరిగిన దంతమును చూసిన పార్వతీదేవి ఆగ్రహించి పరశురాముని శపించదలచినది. ఆ ఆపదను ముందే గమనించిన నారద మహాముని పార్వతిమాతను వారించారు. ఈ పొరపాటు జరుగుటకు కారణం పరశురామునికి వినాయకుడు ఆదిదంపతుల పుత్రుడు అని తెలియక పోవుట  అని, విరిగిన ఈ వినాయక దంతం మునుముందు కాలంలో ఎన్నో తరములకు, సకల మానవకోటికి ఉపయోగపడుతుంది అని చెప్పి పార్వతిదేవిని సంతోషపరచారు. 

కాలాంతరంలో ఆ దంతంతోనే విఘ్నేశ్వరుడు వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా మహాభారత ఇతిహాసాన్ని రచించారు. 
      
2. వేరే పురాణములలో వినాయకుడు యుధం చేసినది శనిదేవుడు అని చెప్పబడినది.

3. వినాయకుడు ముషికాసురుని నియంత్రించే సమయంలో తన దంతమును వినియోగించారు అని మరొక కధ  ప్రచారంలో ఉన్నది.