15, మే 2020, శుక్రవారం

అఙాతవాసం - పాండవుల పేర్లు

మహాభారతం లోని ముఖ్య మయిన ఘట్టములలో ఒకటి పాండవుల వనవాసం, వారి అఙాతవాసం. మరి పాండవులు వారి అఙాతవాసంను విరాటరాజు కొలువులో గడిపారు. మరి అక్కడ వారు ఏ పేర్లతో, ఏమి పని చేస్తూ గడిపారు? ఇప్పుడు తెలుసుకుందాం!

ధర్మరాజు - కంకుభట్టు అనే పేరుతో రాజా ఆస్థానంలోని ప్రవేశించాడు. రాజు కు మానసిక ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయటం, స్నేహపూర్వకమయిన జూదం ఆడటం అతను చేస్తూ ఉంటాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు  జయుడు.
భీముడు- వలలుడు అనే పేరుతో ఒక వంటవానిగా విరాట రాజు వద్ద చేరాడు. ఇతని వంట అద్భుతం.  వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు.  అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.
అర్జునుడు- బృహన్నల అంటే పేడి వానిగా విరాటుని ఆశ్రయించాడు. ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇలా వాడుకున్నాడు. అంతే కాక స్వర్గంలో ఉన్న సమయంలో నేర్చుకున్న సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయుడు.
నకులుడు - దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడుగా అక్కడ చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయత్సేనుడు
సహదేవుడు - తంత్రీపాలుడు అనే పేరు తో గోసంరక్షకుడుగా చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయద్బలుడు.
ద్రౌపది -  మాలిని అనే పేరుతో విరాటుని అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ వద్ద సైరంద్రి గా ఉన్నది. అయితే పాండవులకు మరొక పేరూరు ఉన్నట్లు, వారు ద్రౌపదికి మరో పేరు సంకేతనామం గా పెట్టుకొనలేదు.  

3 కామెంట్‌లు: