24, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 9

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఎనిమిది  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న జానన్తి మన్త్రం మస్త్రితం పరే

కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పరధనలోలుపుండు భయవంతుడు వృధ్య సమృధివిఘ్న సం

భరితుడు గాక యెవ్వడు స్వమంత్రితమంత్రణ కార్యసంతతిన్

బరుల కఱుంగనీక తనపాలిటికార్యము జక్కజేయునా

నరుడిలబండితుండని జనంబులు మెత్తురు కౌరవేశ్వరా

భావం:

ఇతరుల ధనమును పొందాలని లేని, భయములేని వాడు అయ్యి, తను చేయాలనుకున్న పనులకు చెందిన అలోచనలను ఇతరులకు తెలియకుండా చేస్తూ, కేవలం తన పనుల ద్వారా అతని ఆలోచనలను తెలియ పరుస్తూ ఉంటారో అటువంటి వారినే పండితులు అంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి