16, ఫిబ్రవరి 2022, బుధవారం

కుబేరుడు శివునితో స్నేహం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి ,తరువాత అతను పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించడం, అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టడం, అతను దిక్పాలకత్వం పొందడం,  ఆ తరువాత అతనే కుబేరునిగా మారడం గురించి కూడా తెలుసుకున్నాం! అయితే ఆ కుబేరుడు పరమ శివునికి మిత్రుడు అని చెప్తారు. అతనికి పరమ శివునికి స్నేహం ఎలా కుదిరింది?

పార్వతిదేవి శాపానికి గురి అయిన తరువాత కుబేరుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. ఆ పశ్చాత్తాపంతో సుదీర్ఘకాలం మౌనవ్రతం చేసాడు. అతని మౌనవ్రతాన్ని చూసి ప్రసన్నుడయిన ప్రమ శివుడు కుబేరిని వద్దకు వచ్చి, అటువంటి కఠినమయిన వ్రతమును పూర్వకాలంలో తాను స్వయంగా చేసానని, మళ్ళీ ఇంతకాలం తరువాత కుబేరుడు చేసాడు కనుక అతనికి తనతో సమానంగా, అతని స్నేహితుని స్థానం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఏకాక్షి అని పింగళి అని పేరు ఇచ్చాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి