17, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 7

  మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఆరు  భాగములు చెప్పుకున్నాం కదా! ఈ భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా

యమర్థాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

తనుదా నెఱుగుటయోరిమి, యునుబేదలకిడుట వేగ మొందమియునులే

నినరులు తగరీపదవికి, వినుజ్ఞానము లేమిదాని విధమెట్లన్నన్


భావం: ఆత్మజ్ఞానము, ప్రయత్నము, దుఃఖములను ఓర్చుకొనగలిగిన శక్తి, ధర్మానికే ఎల్లవేళలా కట్టుబడి ఉండడం అనేవి ఎవరికి తన మార్గంలో ఆటంకములు కావో వారినే పండితులు అంటారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి