1, ఏప్రిల్ 2020, బుధవారం

లంక ఎవరిది?

రామాయణం  ప్రకారం లంకాధిపతి రావణుడు. అతని కంటే ముందు అది ధనాధీశుడు అయిన కుబేరుని ఆధీనంలో ఉండేది. అయితే లంక రక్షా జాతికి సంబందించినది అని కూడా చెప్తారు. మరి ఇంతకీ లంక అని పిలువబడే సువర్ణలంక ఎవరిది?

ఈ ప్రశ్న కు సమాధానం మనకు రామాయణంలోని ఉత్తరకాండ లో దొరుకుతుంది.
ఈ నగరాన్ని సువర్ణ మయంగా నిర్మించిన వాడు దేవతల శిల్పి విశ్వకర్మ. త్రికూటా చల పర్వతం మీద ఇటువంటి ఒక నగరమును నిర్మించమని కోరినవాడు స్వయానా ఇంద్రుడు. కాలాంతరమున ఇంద్రుడు ఆ విషయమును మరచిపోయాడు.
తరువాతి కాలంలో దేవతలమీద యుద్ధం జయించిన తరువాత రాక్షసులయిన మాల్యవంతుడు, మాలి , సుమాలి లు తమ కోసం నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని విశ్వకర్మను అడుగగా వారికి త్రికూటాచల శిఖరాలపై నిర్మించిన లంకను అతను చూపించాడు. ఆ తరువాతి కాలంలో విష్ణు భయం చేత రాక్షసులు లంకను వదలి పాతాళం లో దాక్కున్నారు.  అలా లంక తిరిగి అనాధ అయ్యింది.
తరువాత కొంత కాలానికి విశ్రవసుడు తన పుత్రుడయిన  వైశ్రవునకు  ఆ లంకను నివాస భూమిగా నియమించాడు. అలా ఆ లంక కొంతకాలం యక్షులకు నిలయం అయ్యింది.
ఆ తరువాత అదే విశ్రవసుని పుత్రుడయిన దశకంఠుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు. అలా మరలా లంక రాక్షసుల నిలయం అయ్యింది.  

2 కామెంట్‌లు: