సూర్య వంశo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సూర్య వంశo లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2022, సోమవారం

అయోధ్య - సరయు నది పుట్టుక

 సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం  చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!

వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక  యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు. 

ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.

2, మార్చి 2015, సోమవారం

సత్యవ్రతుడు

సూర్య వంశం లో  జన్మించిన అనేక రాజులలో ఒకరు అరుణుడు.  అరుణుని పుత్రుడే సత్యవ్రతుడు. కాలాంతరంలో ఈ సత్యవ్రతుడే త్రిశంకు అనే నామాంతరం పొందాడు. ఇతని కారణంగా తండ్రి అయిన అరుణుని రాజ్యంలో 12 సంవత్సరముల  వర్షము కురవక, ప్రజలు అనేక కష్టములను అనుభవించారు.  దానికి కారణం?
సత్యవ్రతుడు సూర్య వంశ రాజకుమారుడు. చిన్న తనం నుండి లభించిన గారాబంతో పాపాత్ముడుగా ప్రవర్తించ సాగాడు. కామమునకు కూడా వశుడయ్యి జీవించసాగాడు. ఒకనాడు వివాహం జరగ బోవుచున్న ఒక బ్రాహ్మణ కన్యను పెళ్లి పీతల మీద నుండి అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం బ్రాహ్మణులూ అంటా కలిసి తమ రాజయిన అరుణునికి తెలియచేసారు. ఇన్ని రోజులు కొడుకు చేస్తున్న తప్పులు తెలిసీ తెలియనట్లు ఊరుకున్న అరుణుడు సత్యవ్రతుడ్ని తీవ్రంగా శిక్షించ తలచాడు. కొడుకుకి దేశ బహిష్కారం విధించాడు. అడవులలోకి వెళ్లి నాగరికత తెలియని ఆటవిక జనంతో కలిసి బ్రతకమని వెలివేసాడు.
తండ్రి మీద కోపంతో రాజమును వదిలి వెళ్ళే సమయంలో తమ కుల గురువు గారయిన వశిష్టుడు చెపితే తన తండ్రి ఏమయినా తన శిక్షను తగ్గించే అవకాసం ఉండొచ్చు అని, వెంటనే గ్ఫురువు గారి వద్దకు వెళ్ళాడు. అప్పుడు సత్యవ్రతుడిని చూసిన వశిష్టుడు అప్రియంగా మొహం పెట్టి, సత్యవ్రతుడు చేసిన అన్యాయానికి అరుణుడు సరి అయిన శిక్షనే విధించి మంచి పని చేసాడు అని సత్యవ్రతుని దేశ బహిష్కారమును సమర్ధించాడు.
అప్పుడు సత్యవ్రతుడు అడవులలో ధనుర్భాణములు ధరించి వేట ద్వారా తన కడుపు నింపుకుంటూ బ్రతక సాగాడు.
కుమారుడు చేసిన పనికి కుమిలిపొతూ అరుణుడు రాజ్యమును వదలి తపస్సుకోసం వెళ్ళాడు. అప్పుడు  12 సంవత్సరముల  పాటు తీవ్రమయిన కరువు, అనావృష్టి సంభవించాయి.

నా ఆలోచన:
ఇక్కడ సూర్యవంశం లో ఒక రాజు అతని కుమారుని గురించి చెప్పారు. మనం ఇక్కడ గుర్తించ వలసిన విషయములు
  1.  ఒక రాజ కుమారుడు తప్పు చేస్తే భాదితులు ఆ రాకుమారుని తండ్రికే పిర్యాదు చేసారు. అంటే ఆ కాలంలో ప్రజలు రాజుతమకు న్యాయం చేస్తారు అని నమ్మారు. 
  2. రాజుగారు తప్పు చేసినది తన కొడుకు కనుక పక్షపాత దృష్టితో తప్పుకు తగిన శిక్ష విధించకుండా ఉండలేదు. తప్పు తన వారు చేసినా కూడా న్యాయం చేయటం తమ కర్తవ్యంగా భావించే వారు అని మనకు అర్ధం అవుతుంది. 
  3. గురువు తనకు వత్తాసు పలుకుతాడేమో అని ఆశ పడిన శిక్షార్హుని గురించి గురువు ఎంత మాత్రం జాలి చూపించలేదు సరి కదా తగిన న్యాయం జరిగినది అని రాజును ప్రసంశించాడు. ఆ రోజులలో గురువులు సత్యం తరపున నిలబడే వారు అని తెలుస్తుంది. 
  4.  రాజు కొడుకు రాజ్యం వదలి వెళ్ళిన తరువాత తను కూడా ఉండలేక  తపస్సు సాగాడు. అంటే రాజ్యమును వదిలి వేశాడు. అతని కర్త్యవం నిర్వర్తిన్చాకునాడ కొడుకు పై ప్రేమతో రాజమును అనాధలా వదలి వెళ్లి పోయాడు. కనుక రాజ్యం లో అరాచకం నెలకొన్నది కనుక ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి ఉంటారు, కనుక అధర్మం తాండవం చేసి ఉండాలి. కనుకనే ఆ రాజ్యం కరువుతో భాద పడవలై వచ్చి ఉండాలి. సరి అయిన రాజు (నాయకుడు) లేక పొతే ప్రజలు ఎన్ని కష్టములు పడవలసి వస్తుందో మనకు తెలుసు కదా!!

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాభాగుడు

నాభాగుడు నభగుని పుత్రుడు. సూర్య వంశమునకు చెందినవాడు.
ఇతను మెతకగా ఉండుట చూసి, ఆ అవకాశమును వినియోగించుకుంటూ అతని సోదరులు అతనికి ధనమును ఇవ్వకుండా ఉండిరి. తనకు తన భాగమును ఇప్పించ వలసినదిగా అన్నలను కోరగా, అప్పుడు అన్నలు తమ తండ్రి అయిన నభగుడు చెప్పినట్లయితే అతనికి అతని వాటా ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివద్దకు వెళ్లి, ఈ వృత్తాంతం చెప్పి, ఏమి చేయవలసినది అని తండ్రిని అడిగాడు.
అప్పుడు నభగుడు,  ఆ సమయంలోఅత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, ఆ యాగంలో వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు కనుక నాభాగుని అక్కడ వెళ్లి వారికి ఆ సూక్తులను గుర్తు చేయమని చెప్పాడు. అలా గుర్తు చేసినందువలన బ్రహ్మజ్ఞాని అని లోకం నాభాగుని కీర్తిస్తుంది అని,అలా చేయుట వలన ఆ యాగం చివర మిగిలిన ధనమును నాభాగునకు ఇస్తారు అని కూడా చెప్పి నాభాగుడిని అక్కడకు పంపించాడు.
నాభాగుడు తండ్రికి నమస్కరించి ఆ యాగామునకు వెళ్లి తన తండ్రి చెపిన విధంగా అంగిరసులకు వారు మరచిపోయిన సూక్తులను గుర్తు చేసాడు.అప్పుడు  ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన ధనమును అతనికి ఇచ్చాం అని చెప్పి వారు స్వర్గమునకు వెళ్ళిపోయారు. అతనికి అలా లభించిన ఆ ధనమును తీసుకొనుటకు నాభాగుడు వెళుతుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ ధనమును తన  చేసుకొనెను.
అప్పుడు నాభాగుడు తనకు అంగిరసులు ఆ ధనమును ఇచ్చినారు కనుక ఆ ధనమును తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతను ఒకవేళ నీ తండ్రి అయిన నభగుడు ఈ ధనమును నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను కనుక నీవు వెళ్లి నీ తండ్రిని అడిగిరా! అని చెప్పి పంపెను.
నాభాగుడు నభగుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా, నభగుడు జరిగిన విషయమును తన మనోనేత్రంతో చూసి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగమును మహాదేవుడయిన శివునకు ఇస్తాం అని సంకల్పించారు కనుక ఆ భాగం శివునకు మాత్రమే చెందుతుంది అని తీర్పు చెప్పి నాబాగుని పంపించాడు.
తిరిగి వచ్చిన నాభాగుడు తన తండ్రి చెప్పిన విషయమును యధాతధంగా చెప్పి, ఆ భాగం మీద తనకు ఏవిధమైన హక్కులేదని చెప్పాడు.
నాభాగుని సత్య సంధతకు సంతోషించిన శివుడు ఆ యజ్ఞ భాగమును నాభాగునకు ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి  వెనుతిరిగి వెళ్ళాడు. కాలాంతరంలో నాబాగునకు అంబరీషుడు జన్మించాడు.
వ్యాసమహర్షి నాబాగుని ఈ చరిత్రకు ఫలశృతి కూడా చెప్పారు.
ఎవరైతే శ్రద్దగా ఈ నాభాగుని వృత్తాంతం ప్రతిరోజూ చదువుతారో/ వింటారో/ పారాయణం చేస్తారో వారు జ్ఞానమును పొందుతారు, మరణానంతరం ముక్తిని పొందుతారు.

నా ఆలోచన:
మన పూర్వులు ఇటువంటి కధలను చాలా చెప్పారు. కొన్ని కధలకు ఫలశృతి కూడా చెప్పారు. అయితే  ఆ ఫల శృతి  ఆ కధను మరలా మరలా చదివేలా చేయాలి అని చెప్పి ఉన్నారు. అలా ఎందుకు? మరి ఈ కధకు ఈ ఫలశృతి ఎందుకు చెప్పారు?

  1. నాభాగుడు తన సోదరులు తన సొమ్మును బలవంతముగా తీసుకున్నపుడు ఏమి ఎదురు చెప్పలేదు, పైగా వెళ్లి వారిని మెల్లిగా అడిగాడు. మనం సహజంగా మన సంపదను ఎవరైనా తీసుకున్తరేమో అనే అనుమానం వస్తేనే వారి మీద గొడవకు దిగుతాం. 
  2. నాభాగుని అతని సోదరులు తండ్రిని అడిగి రమ్మనగానే, తన ఆస్తి మీరు తీసుకుని నన్ను తండ్రిని అడుగమంటారేమిటి అని విసుగును ప్రదర్శించలేదు. 
  3. తీరా తండ్రి వద్దకు వెళ్లి అడిగితే  అన్నలకు చెప్పి నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని చెప్పకుండా, యాగమునకు వెళ్లి దానం తేసుకో అని చెప్పాడు. మరి ఒక తండ్రిగా అది తప్పుకాదా! ఒకసారి ఆలోచించండి, అన్యాయం చేసిన వారు, పొందినవారు కూడా తన పుత్రులే. కానీ కొందరు అన్యాయ మార్గంలో ఉన్నపుడు వారి తప్పును అలా ఒకేసారి చూపిస్తే వారు మరింత అన్యాయులుగా మరే అవకాశం ఉంటుంది. కనుక అన్యాయమునకు గురి అయిన నాభాగుని అతని విద్యాను ఉపయోగించి అతని ధనమును స్వయంగా సంపాదించుకునే మార్గం చెప్పి, కేవలం ధనమే కాకుండా బ్రహ్మజ్ఞాని అనే బిరుదు కూడా పొందగలవు అని చెప్పి పంపాడు.  
  4. మరి అంగిరసులు నాభాగునకు ఇచ్చిన అదే భాగమును ఋత్విక్కులు శివునకు ఎందుకు ఇచ్చారు? ఆ భాగమును ఎవరికైనా ఇవ్వటానికి ఎవరికి అధికారం ఉంటుంది? మనం ఒక బ్రాహ్మణుని యాగామునకు పిలిచి ఆ యాగమునకు కావలసినవి అన్నీ  సమకూర్చి వారికి అప్పగిస్తాం. అంటే ఆక్షణం నుండి ఆ వస్తు,ధనముల మీద ఆ బ్రాహ్మణులకే అధికారం ఉంటుంది. కనుక ఆ భాగమును దానం చేసే అధికారంకూడా ఋత్విక్కులకే ఉంటుంది. 
  5. శివుడు ఈ భాగం నాదే నీకు చెందదు అని స్వయంగా చెప్పకుండా నభగుని అడిగిరమ్మని ఎందుకు చెప్పాడు? ఒక కొడుకు తప్పు చేసే సమయం అని తెలిసినప్పుడు అతనిని సరిదిద్దే మొదటి అవసరం, భాద్యత తండ్రికి ఉండాలి. పైగా అక్కడ వచ్చే ధనమును తెచ్చుకోమని సలహా ఇచ్చిన వాడు నభగుడే. కనుక నభగుడు జరిగిన సంగతి తెలుసుకుని నాభాగునకు చెప్తేనే అది బాగుంటుంది. 
  6. అసలు ఏమిటి ఈ కధ? మనం మన మనస్సునందు ఈవిధమైన దురాలోచనలు లేకుండా, పెద్దలు చెప్పిన పనిని చేస్తూ ఉంటే మనకు చెందవలసిన సొమ్ము, పేరు, ప్రతిష్టలు మనను చేరి తీరుతాయి. ఒక్కసారి దానం మీది ఆశతో నాభాగుడు అబద్దం చెప్తే పరమశివుడు  అతనికి ఆ ధనమును తిరిగి ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా!
  7. మరి ఆ ఫలశృతి? ఈ కధను ప్రతిరోజూ చదవటం/ వినటం అంటే ప్రతిరోజూ గుర్తు చేసుకోవటం. అంటే మన మనస్సులలో ఈ కద నిలచిపోతుంది. ఒకవేళ మనకు ఎవరితో అయినా గొడవ పడవలసిన సందర్భం ఎదురయినప్పుడు మన మనస్సు ఆ గొడవ పడకుండా ఆపుతుంది. అప్పుడు మన మనస్సు మన ఆదీనంలో ఉండి విచక్షణా శక్తి ని కోల్పోకుండా ఉంటుంది. మరి అదేకదా జ్ఞానం అంటే. 
  8. జీవితాంతం మనం ఈ కధను స్మరిస్తూ ఉంటే జీవితంలో మనం చేసే తప్పులు గణనీయంగా తగ్గుతాయి కనుక మోక్షం కూడా లభించవచ్చు. 

29, సెప్టెంబర్ 2014, సోమవారం

పృషద్ధ్రుడు

పృషద్ధ్రుడు వైవస్వత మనువు యొక్క పుత్రుడు. అంటే సూర్య వంశస్థుడు.
విద్యాభ్యాసం చేస్తున్న సమయలో ఒకరోజు పృషద్ధ్రుడు ఆవుల మందను తీసుకుని అడవులకు వెళ్ళగా, పెద్ద వర్షం ప్రారంభం అయినది. అప్పుడు అతను ఆ ఆవులను అన్నింటిని ఒకచోటికి చేర్చి వాటిని అన్ని వైపుల నుండి కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక పులి ఆ మందలో ఉన్న ఆవులపై దాడి చేసినది. ఐతే విపరీతమైన చీకటిగా ఉండుటవలన అతనికి ఆ ఆవుల మంద మధ్యలో పులి ఎక్కడ ఉన్నదో తెలియలేదు. కానీ సాహసవంతుడై తన కత్తిని తీసి తను పులిగా భావిస్తున్న జంతువును మెడమీద ఒక్క దెబ్బ వేసాడు. అయినా పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉండుట విని రెండవసారి తన కత్తిని బలంగా ప్రయోగించాడు. ఈసారి ఆ జంతువు తల త్రెగి ప్రక్కన పడినది.
వర్షం తగ్గగానే తను  నరికిన తల ఒక ఆవుది  అని తెలుసుకుని తమ కుల గురువయిన వసిష్టుని వద్దకు వెళ్లి జరిగినది చెప్పాడు. గోహత్యా పాపం అత్యంత ఘోరమైనది కనుక పృషద్ధ్రుడు క్షత్రీయత్వమునకు అనర్హుడని, చండాలునిగా ఉండమని శపించాడు. 
అలా శాపం పొందిన పృషద్ధ్రుడు గురువుగారి అజ్ఞ తీసుకుని అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ అన్ని జీవులయందు సమదృష్టి కలిగి, పిచ్చి వాని వలే  ఈ విధమైన కోరికలు లేకుండా, ఏది దొరికితే అది తిని కాలం గడిపి చివరకు అరణ్యములో పుట్టిన దావానలం లో చిక్కుకుని తన ప్రాణములను వదిలాడు. 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఇల/సుద్యుమ్నుడు విచిత్రం

సూర్యవంశం లో జన్మించిన ఇల, వసిష్టుని కారణం గా సుద్యుమ్నునిగా(పురుషునిగా) మారినది. సుద్యుమ్నుడు తన తండ్రి అయిన వైవస్వతమనువు రాజ్యమును చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు.
ఒకసారి సుద్యుమ్నుడు తన సైన్యంతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. అతిశయించిన ఉత్సాహంతో ఉత్తర దిశగా క్రూరమృగములను తరుముతూ వెళ్లారు. అలా వెళ్లి వెళ్లి చివరకు స్త్రీవనములో ప్రవేశించారు. వెంటనే పరమేశ్వరుని అజ్ఞానుసారం సుద్యుమ్నుడు మరలా స్త్రీగా (ఇలగా)మారి పోయాడు. అతనితో పాటుగా అక్కడకు వచ్చిన అతని సైన్యంకూడా స్త్రీలుగా మారిపోయారు.
ఈవిధముగా అనుకోని పరిస్థితులలో స్త్రీలుగా మారిన వారు ఆ అడవుల్లోనే నివసించసాగారు. ఇల రాకుమార్తె వలే నివసించుచుండగా, సైనికులు ఆమెకు చెలికత్తెలై ఉన్నారు. వారు ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒకరోజు చంద్రుని కుమారుడయిన బుధుని (నవ గ్రహములలో ఒకరు) ఆశ్రమం చేరారు.
బుధుడు ఇలను చూసి మోహించాడు, వారు వివాహం చేసుకున్నారు. వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈవిధంగా చంద్రవంశం వృద్ధి ప్రారంభం అయినది.
వీరిని గురించి తెలిసిన వైవస్వతమనువు విచారం మరింతగా పెరిగినది. సూర్యవంశ వృద్ధికి కారకుడు కావలసిన తన పుత్రుడు, పుత్రిక రూపంలో చంద్రవంశ వృద్ధికి పునాదులు వేసాడు. తన మనో విచారమును తన గురువైన వసిష్టునకు విన్నవించగా, వసిష్టుడు పరమేశ్వరుని గురించి ప్రార్ధన చేసాడు.
వసిష్టుని ప్రార్ధనలు విన్న పరమేశ్వరుడు ఇలను పురుషునిగా మార్చినట్లయితే అతని శాపం తప్పినట్లు అవుతుంది, అలా కాకుండా ఆమెను స్త్రీగానే ఉంచేస్తే, వసిష్టుని సంకల్పం తప్పినట్లు అవుతుంది కనుక మధ్యే మార్గంగా ఆమెను ఒక నెల రోజుల పాటు పురుషునిగా, మరో నెల రోజులు స్త్రీ గా ఉండే ఏర్పాట్లు చేసారు.
అప్పటినుండి పురుషునిగా ఉన్న నెలరోజులు రాజ్యపాలన చేస్తూ, స్త్రీగా ఉన్న నెలరోజులు ఇలగా అంతఃపురంలో జీవనం సాగిస్తూ ఉన్నాడు.
సుద్యుమ్నునకు అతని భార్య వలన ముగ్గురు కుమారులు జన్మించారు. వారు ఉత్కళుడు, గయుడు మరియు విమలుడు. వీరు ముగ్గురు అత్యంత ధర్మ పారాయణులు, వీరు ఉత్తర దిశలో గల రాజ్యమును పరిపాలించారు.
సుద్యుమ్నుడు వృద్ధాప్యం వచ్చేవరకు రాజ్యపాలన చేసి, అవసాన దశలో తన పుత్రుడయిన పురూరవునకు ప్రతిష్టానపురము అనే రాజ్యమును ఇచ్చి వనములకు వెళ్ళాడు.

నా ఆలోచన:
ఇంతకు ముందు చెప్పినట్లు మన పూర్వీకులకు లింగమార్పిడి గురించిన అద్వితీయమైన జ్ఞానం ఉన్నది. నిస్సంకోచముగా! ఎందుకంటే (నాకు తెలిసినంత వరకు) ఈ రోజులలో జరుగుతున్న లింగ మార్పిడి కేవలం శారీరక మైనది. అలా లింగ మార్పిడి జరిగిన ఎవరూ మార్పు చెందిన లింగమునకు సంబందించిన జీవ ప్రక్రియలు చేయలేరు. ఒక పురుషుడు స్త్రీగా మారితే అతను మిగిలిన స్త్రీలవలే గర్భధారణ చేసే అవకాశం ఉండదు. ఒక స్త్రీ పురుషునిగా మారితే ఆమె మరొక స్త్రీ ద్వారా పుత్రులను పొందుట అసంభవం.
కాని పూర్వకాలం లో ఇల/సుద్యుమ్నుని విషయంలో వారు తప్పని సరిగా విజయం సాధించారు. స్త్రీగా ఉన్న ఇల పురూరవునికి జన్మను ఇచ్చినది. పురుషునిగా ఉన్నపుడు తన భార్య ద్వారా మ్రుగ్గురు పుత్రులను పొందటంజరిగింది. 

ఇల జననం

వైవస్వతమనువు మనకు గల 14 మంది మనువులలో ఏడవ వాడు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరమునకు అధిపతి.
ఇతను సూర్య భగవానుని కుమారుడు కనుక సూర్య వంశస్తుడు. శ్రద్దాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వివాహం అయిన చాలాకాలం వరకు వారికి సంతానం కలుగ లేదు. కనుక వసిష్ఠ మహామునిని వారి పుత్ర ప్రాప్తి కోసం ఒక యజ్ఞం చేయమని కోరారు.
ఐతే శ్రద్ధాదేవికి పుత్రిక పై మమకారం కలుగుట  వల్ల ఆమె వసిష్టునకు చెప్పే సాహసం చేయలేక ఆ యజ్ఞములో హోతగా ఉండే వ్యక్తి వద్దకు వెళ్లి అతను యజ్ఞములో పుత్రికను కాంక్షిస్తూ ఆజ్యమును విడువమని కోరినది. దానికి అంగీకరించిన హోట అలాగే చేసెను.
ఆ యజ్ఞం చేసిన కొంతకాలమునకు శ్రద్దాదేవి గర్భందాల్చెను. తరువాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చెను. ఆ ఆడపిల్లకు ఇల అని నామకరం చేసారు.
కొంతకాలం తరువాత వైవస్వతమనువు వసిష్టుని వద్దకు వెళ్లి, " తమవంటి అత్యంత నిష్టా గరిష్టులు చేసిన యజ్ఞం, తమరు చేసిన సంకల్పమునకు విరుద్దంగా ఎలా ఫలితమును ఇచ్చినది?" అని అడిగెను.
జరిగిన విషయమును తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న వసిష్టుడు వైవస్వతమనువునకు విషయం చెప్పి, తనకు ఉన్న శక్తిచేత ఇలను పురుషునిగా మార్చగలను అని ఆమెను పురుషునిగా మార్చారు. పురుషునిగా మారిన ఇలను సుద్యుమ్నుడు అని పిలిచారు.


నా ఆలోచన:
మనకు ఈ కాలంలో ఉన్నట్లుగా బాలికల పట్ల వివక్షత ఆ రోజులలో ఉన్నట్లు కనిపించుట లేదు. పుట్టినది బాలిక అని తెలిసినా ఆమెకు నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు గానీ పుట్టగానే పుత్రుని బదులుగా పుత్రిక జన్మించినది అని గురు వసిష్టుల వద్దకు పరుగులు పెట్టలేదు.

మరి ఒక బాలికను బాలునిగా ఎందుకు మార్చారు?

ఇక్కడ తప్పు శ్రద్దాదేవిది. ఆమెకు ఆడపిల్ల కావాలని కోరిక ఉన్నపుడు ఆమె తన భర్తకు చెప్పి ఉండాలి. కనీసం ఆ యజ్ఞ భాద్యతను నిర్వహిస్తున్న వసిష్టునకు కూడా చెప్పలేదు. హోత  అంటే మన ఈకాలంలో వాడుక భాషలో చెప్పాలంటే ఒక సహాయకునికి చెప్పినది.
యజ్ఞ సంకల్పం చేయబడినది ఒక పుత్రుని కోసం, కనుక పుట్టిన వాడు పుత్రుడే అయి తీరాలి. కాని తల్లి కోరిక మీద పుత్రిక జన్మించినది. ఈ సమస్యకు పరిష్కారం లింగమార్పిడి.
మనకు ఇప్పుడు తెలిసిన లింగమార్పిడి విధానం మన కన్నా విపులంగా మన పూర్వులకు బాగా తెలుసు.