15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సూర్యుడు సంధ్యాదేవి కలయిక - అశ్వినీ దేవతలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని, సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని ఉపాయోగించి దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు అనేకా రకములయిన ఆయుధాలను తయారు చేసాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సూర్యుడు సంధ్యాదేవి వద్దకు ఎలా వెళ్ళాడు? అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుందాం!

తన భార్య ఎక్కడ ఉన్నదో ముందే తెలుసుకున్న సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించుకున్న తరువాత ఆమె వద్దకు ఉత్తరకురుదేశమునకు బయలుదేరాడు. ఆమె ఆడగుర్రం రూపంలో ఉన్నది కనుక అతనుకూడా మగ గుర్రం రూపాన్ని ధరించి అమె వద్దకు వెళ్ళాడు. అలా తన వద్దకు వచ్చిన భర్తతో అమె ఇద్దరు కుమారులను (కవల పిల్లలు) కన్నది. అయితే వారు గుర్రం రూపంలో ఉండగా వారికి సంతానం కలిగింది కనుక ఆ ఇద్దరిని అశ్వినులు అని పిలిచారు. వారే దేవవైద్యులుగా ప్రసిద్ది పొందారు. ఆ తరువాత సూర్యునికి, సంధ్యాదేవికి రేవతుడు అని ఒక కుమారుడు జన్మించాడు. అతను సకల శస్త్రాస్త్రకోవిదుడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి