ఆశ్చర్యరామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆశ్చర్యరామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2022, సోమవారం

అయోధ్య - సరయు నది పుట్టుక

 సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం  చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!

వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక  యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు. 

ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.

29, మే 2020, శుక్రవారం

ఉడుతా భక్తి - ఆ భక్తికి కారణం పూర్వజన్మ!!

ఉడుతా భక్తి అనే మాట మన తెలుగు వారు సహజంగా మనం చేసి పని ఎదుటివారికి  అంత ముఖ్యమయినది కాకపోయినా మనం వారిమీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని  ఎదో ఉడుతా భక్తి గా చేసాం అని చెబుతూ ఉంటారు.  
శ్రీ రాముని కరుణకు సంబందించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతు బంధన సమయంలో ఉడుత చేసిన చిన్న సహాయమునకు శ్రీరాముడు దానిని తన చేతులలోకి తీసుకుని దానిని నిమురుట, ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ళ గుర్తులు ఇప్పటికీ ఆ ఉడుతల వీపుపైన ఉన్నాయి అని చెప్తారు కదా! 
మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడుత ఏమి అయ్యింది? ఆ ఉడుతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది?  
దానికి కారణం ఆ ఉడుత పూర్వజన్మ.  ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. ఆ కథను ఇప్పుడు మన చూద్దాం!

పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీ నగరమునకు వెళ్లి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలువలేక పోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతనితో పాటుగా అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న అతని తండ్రి ఆ పొగడ్తలను చాలా మర్యాదగా మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లవాడు వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని చెప్పే వాడు. ఆ మాటలు ఆ కుమారునికి రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్న పిల్లవానిగానే వీచుస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. 
అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపెయ్యాలి అని అనుకున్నాడు. ఒక రోజు తన తండ్రి ఇంటిలోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురిచూసి విసిరాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి, కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా, జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమయిన కార్యం చేసాడు కనుక , క్రూరమృగంగా జన్మించమని శపించాడు. కొడుకు తన తరువాతి జన్మలో ఒక పెద్దపులిగా అడవిలో జన్మించాడు 
ఒకసారి తండ్రి బ్రాహ్మణుడు వేరే ఉరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవిమార్గంలో వెళుతూ ఉండగా, పులిగా జన్మించిన కుమారుడు అతనిమీద దాడి చేయబోయాడు. మృగ జన్మలో ఉండికూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నవు కనుక ఎవ్వరికీ హాని చేయని ఉడుత జన్మ ఎత్తు అని మరలా తండ్రి ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి గత జన్మ, ఆ జన్మలో సంపాదించుకున్న జ్ఞానము జ్ఞాపకము వచ్చి, తన తండ్రి పాదములపై పడి క్షమాపణ కోరి, ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారునిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమి ఉపకారామ్ జరుగక పోయినా నీవు ఏనాడయితే పక్క వారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నిన్ను స్పర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. 
ఆ రోజు నుండి ఆ ఉడుత అలా సముద్రతీరంలో గడుపుతూ ఉంది. 
తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రామునికి అందించింది. ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడుతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాపవిమోచనం కలిగింది. 

26, మే 2020, మంగళవారం

సుమిత్ర, కైక విష్ణు అంశలకు తల్లులు ఎలా కా గలిగారు?

మనం ఇంతకు ముందు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుట్టాడు అని  చెప్పుకున్నాం  కదా! అయితే ఇంతకూ ముందు చెప్పినట్లు కొన్ని కధలలో అవి చెప్పిన గ్రంధం/పురాణం ను బట్టి ఆ సంఘటనలలో కొంత మేరకు మార్పులు ఉంటాయి.
ఒక జన్మలో ఆ కశ్యపుడు, అదితి లు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు దశరధునిగా మరియు కౌసల్య గా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీమహావిష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖ , చక్రములు కూడా లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా జన్మించారు. వీరికి తండ్రి దశరధ మహారాజు కాగా లక్ష్మణ, శత్రుజ్ఞులకు తల్లి సుమిత్ర, భరతుని కి తల్లి కైకేయి.
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు, అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయి ఏమి చేశారు? వారికి శంఖం - భరతునిగా, ఆదిశేషుడు - లక్ష్మణుడిగా, చక్రం - శత్రుజ్ఞుడుగా ఎలా జన్మించారు? దానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది?

మనం ఇంతకూ ముందు అసూయ గురించి, మదం మరియు క్రోధం గురించి చెప్పుకున్నప్పుడు కశ్యపుని భార్యలు అయిన వినత, కద్రువల మధ్య మాత్సర్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం కదా!
కశ్యపునికి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. ఆ 13 మందిలో అదితి, వినత కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయమును కేటాయిస్తూ, ఎవరి సమయమునకు వారి వద్ద ఉండేలా ప్రణాళిక ప్రకారం నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువ కోపంగా వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చుకోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్పము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తికలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించగా తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయినా కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవ జన్మ ఎత్తవలసినది అని శపించింది.
అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత కద్రువతు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీమహా విష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే కౌసల్య (అదితి) కి రాముని(విష్ణువు)గా, సుమిత్ర (వినత) కు లక్ష్మణుడు (సర్పం-ఆదిశేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని-చక్రం - సుదర్శనం) గా, కైక (కద్రువ) కు భరతుని (శంఖం) గా జన్మించాడు.  కైక, రాముని వనవారం పంపుట వలన తనకు అనంత కాలంవరకు  తరగని అపకీర్తి ప్రాప్తించింది. 

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు.