14, ఫిబ్రవరి 2022, సోమవారం

భారత సాహిత్యం - కొన్ని చిత్రమయిన ప్రక్రియలు

 భారతదేశంలో సాహిత్యానికి, సాంప్రదాయాలకు ఉన్న ప్రాముఖ్యత మనకు అందరికి చాలా బాగా తెలుసు. మన దేశంలోని అనేక బాషలలో మన పురాణ ఇతిహాసములు అనువదించబడినా అందరూ ముక్తకంఠంతో నమ్మే విషయం ఆ పురాణములు, ఇతిహాసములు మొదటగా చెప్పబడినది దేవ బాష అయిన సంస్కృతంలోనే. మన దేశంలో ఉన్న అనేక  బాషలలో అనేక ప్రక్రియలపై ప్రయోగములు చేస్తూ, మన పండితులు కీర్తిని గడిస్తూ ఉండడం మనం చూశాం. ఇటీవలి కాలంలోనే మన తెలుగు బాషకు ప్రత్యెకమయిన అవధానంలో పేరెన్నిక గన్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని పద్మశ్రీ వరించడం మనం చూశాం.  

అటువంటి సాహిత్య ప్రక్రియలు మనకు ఎన్నో ఉన్నాయి. వానిలో కొన్ని

  1. అనులోమ విలోమ కావ్యములు - ఇటువంటి కావ్యములలో ఒక శ్లోకమును ముందు నుండి చివరి వరకు చదివితే ఒక అర్ధం వస్తుంది, చివరి నుండి మొదటికి చదివితే మరొక అర్ధం వస్తుంది. ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా రాఘవయాదవీయం చెప్తారు. 
  2. ద్వర్ధి కావ్యములు- ఇటువంటి కావ్యములలోఒక శ్లోకమునకు రెండు రకముల అర్ధము చెప్తూ, ఆ రెండు అర్ధములతో రెండు విభిన్నములయిన కధలను చెప్పడం.  ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా హరిశ్చంద్రనలోపాఖ్యానం, రాఘవపాండవీయం చెప్తారు. 
  3. ఏకాక్షరి శ్లోకములు ః ఒక శ్లోకములో, లేదా పద్యములో ఒకేఒక్క అక్షరం మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు మనం త్వరలోనే చూద్దాం!
  4. కేవలం రెండు అక్షరములు మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు కూడా మనం త్వరలోనే చూద్దాం!
సాహిత్యంలో ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే. ఇంకా ఎన్నెన్నో ఉన్నయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి