స్వయంభు మనువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్వయంభు మనువు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2014, ఆదివారం

కర్దమ ప్రజాపతి - దేవహుతి

కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.
మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.
ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.
స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.
అప్పటి నుండి  పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది.  కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.
ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి,  కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.
కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.
వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు

  1. కళ - మరీచి  
  2. అనసూయ - అత్రి 
  3. ఊర్జ - వసిష్టుడు 
  4. శ్రద్ధ  - అంగిరసుడు 
  5. హవిర్భవు - పులస్త్యుడు 
  6. గతి - పులహుడు 
  7. క్రియ - క్రతువు 
  8. ఖ్యాతి - భృగువు 
  9. చిత్తి  - అదర్వుడు 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆకూతి వంశం

స్వయంభు మనువు కు గల ముగ్గురు పుత్రికలలో వారికి ఆకుతి అనే పుత్రిక యందు అమితమైన ప్రేమ కలిగి ఉండుట చేత ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసే సమయంలో వారికి జన్మించిన పుత్రుని తనకు వంశోభివృద్ధి కొరకు అడిగాడు. దానికి ఆకూతి, రుచి ప్రజాపతుల ఇద్దరి అంగీకారం తీసుకుని వారి వివాహం జరిపించాడు.
వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు గా జన్మించాడు. స్వామివారిని విడచి ఎన్నటికీ ఉండలేని శ్రీమహాలక్ష్మి కూడా దక్షిణ గా జన్మించినది. ముందుగా స్వయంభువమనువుకు ఇచ్చిన మాట ప్రకారం రుచి, ఆకూతిలు యజ్ఞుని అతనికి ఇచ్చారు. కానీ దక్షిణని తామే పెంచారు. వారికి యుక్తవయస్సు రాగా వారికి వివాహం చేశారు.
యజ్ఞుడు, దక్షిణలకు 12 మంది పుత్రులు కలిగారు.
వారు
  1. తోషుడు 
  2. ప్రతోషుడు 
  3. సంతోషుడు 
  4. భద్రుడు 
  5. శాంతి 
  6. ఇడస్పతి 
  7. ఇధ్ముడు 
  8. కవి 
  9. విభుడు 
  10. వహ్ని/ అగ్ని 
  11. సుదేవుడు 
  12. రోచనుడు 
వీరు స్వయంభు మన్వంతరము సమయంలో తుష్టికారకులు అనే దేవతా గణములుగా ఉన్నారు.  

21, ఆగస్టు 2014, గురువారం

స్వయంభు మనువు

స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు  అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.
అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.

శతరూప, స్వయంభు మనువులకు
పుత్రికలు
  1. ఆకూతి 
  2. దేవహూతి 
  3. ప్రసూతి 
పుత్రులు 
  1. ఉత్తానపాదుడు 
  2. ప్రియవ్రతుడు