5, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి- 5

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో నాలుగు భాగములు చెప్పుకున్నాం కదా! నాలుగవ భాగంలో దృతరాష్ట్రుడు చెప్పిన సమాధానం చూశాం కదా! ఇప్పుడు ఆ తరువాత విదురుడు చెప్పిన మాటలు తెలుసుకుందాం!


సంస్కృత శ్లోకం:

రాజా లక్షణసంపన్నస్త్రైలోక్యస్యాధిపో భవేత్

ప్రేష్యస్తే ప్రేషితశ్చైవ దృతరాష్ట్ర యుధిష్టిరః

విపరీత తరశ్చ త్వం భాగధేయే న సమ్మతః

అర్చిషాం ప్రక్షయాచ్ఛైవ ధర్మాత్మాధర్మకోవిదః

ఆనృశంస్యాదనుక్రోశాద్ధర్మాసత్యా త్పరాక్రమాత్

గురుత్వాత్త్వయి సంప్రేక్ష్య బహూన్ల్కేశాంస్థితిక్షతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిదురుండుపల్కెసకలావనినాధుడు ధర్మకోవిదుం

డును శుభమూర్తి స్వచ్ఛయశుడు జితసత్యుడు ధర్మరాజుగా

నని నిను రాజ్యమూనుటకనర్హుని గా మదిదా నెఱింగిస

త్యనయదయానృశంస్యపరుడై భువినీకిడి గాసి నొందడే

భావం: దృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విన్న విదురుడు "ఓ రాజా! ఎంతో గొప్ప లక్షణములు ఉన్న యుధిష్టరుడు సకల లోకములకు ప్రభువు కాగలిగిన వాడు, నీ మాటలను శ్రద్ధగా విని ఆచరించే వాడు. కానీ అతనిని నీవు అడవులకు పాంపావు. నీవు ధర్మం తెలిసిన వాడవు, కానీ కంటిచూపు లేని నీవు అతని విషయంలో నిజంగానే గుడ్డివానిలా ప్రవర్తించి, అతని రాజ్యమును తిరిగి ఇవ్వడానికి నిరాకరించావు. అజాతశత్రువయిన అతను దయ, ధర్మ,సత్య,పరాక్రమములు కలిగి ఉన్నప్పటికీ నీ పైన ఉన్న గౌరవ మర్యాదల కారంణం గా అన్నింటినీ భరిస్తున్నాడు "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి