కొన్నిముఖ్య పాత్రలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కొన్నిముఖ్య పాత్రలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2017, శనివారం

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే మనం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు సృష్టిలోని ప్రతి చరాచరములలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు ధరించిన అవతారములలో ముఖ్యమయినవి 21.  21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!

  1.  సనత్కుమారుడు 
  2. వరాహ 
  3. నారదుడు 
  4. నర నారాయణులు (ఇద్దరు)
  5. కపిల మహర్షి 
  6. దత్తాత్రేయుడు 
  7. యజ్ఞుడు 
  8. ఋషభ దేవుడు 
  9. పృధు మహారాజు 
  10. మత్స్యం 
  11. ధన్వOతరి 
  12. కూర్మం 
  13. మోహిని 
  14. నృసింహ 
  15. వామన 
  16. పరశురామ 
  17. వ్యాస మహర్షి 
  18. శ్రీరామ 
  19. శ్రీ కృష్ణ 
  20. బుద్ధ 
  21. కల్కి 
వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఉత్తానపాదుడు

స్వయంభుమనువునకు శతరూప యందు జన్మించిన పుత్రుడు ఉత్తానపాదుడు(పాదములు ఎత్తిన వాడు, సర్వ సిద్దంగా ఉన్నవాడు).
ఉతానపాదునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. వారి ఇరువురి యందు ఇద్దరు పుత్రులు కలిగారు. పెద్ద భార్య అయిన సునీతికి దృవుడు పెద్దవాడు, రెండవ భార్య కుమారుడు ఉత్తముడు చిన్నవాడు. ఉత్తనపాదునకు తన రెండవ భార్య అంటే ఉన్న అమితమైన ప్రేమ కారణంగా అతను సర్వదా మొదటి భార్య అయిన సునీతిని నిరాదరిస్తూ వచ్చాడు. ఆమె పుత్రుడయిన కారణంగా దృవునికి కూడా తండ్రి ప్రేమ దొరకలేదు.
ఒకనాడు ఉత్తానపాదుడు తన విశ్రామ సమయంలో చిన్న భార్య కుమారుడయిన ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా, తండ్రి ప్రేమను పొందాలన్న కోరికతో బాలుడయిన దృవుడు తండ్రి వద్దకు పరుగెత్తాడు. ఐతే తన చిన్న భార్య చూస్తున్నది అని భావించిన ఉత్తానపాదుడు దృవుని దగ్గరకు తీసుకోలేదు. అది సురుచి అహంకారమును పెంచినది. ఆమె చిన్న పిల్లవానితో ఏమి మాట్లాడుతున్నదో కూడా తెలియని భావోద్వేగములకు లోనయినది.
"నీ తండ్రి ఒడిలో కూర్చోటానికి వచ్చావా? నీకు ఆ అర్హత లేదు, ఒకవేళ ఉన్నట్లయితే నీవు నా కడుపున నా పుత్రునిగా జన్మించేవానివి. ఇప్పుడయినా మార్గం ఒకటి ఉన్నది. నీవు ఆ మహావిష్ణువుని ప్రార్ధించి, అతని వరములను పొంది నా గర్భంలో జన్మించు, అప్పుడు తప్పకుండా నీ తండ్రి ఒడిలో కూర్చునే అధికారం పొందగలవు"

సురుచి అంటున్న ఈ మాటలను విన్న తరువాత కూడా ఉత్తానపాదుడు ఏమి మాట్లాడలేదు. తన పుత్రుడిని అతని భార్య అవమానిస్తూ మాట్లాడినా, ఆ పిల్లవానికి ఆమె చెప్తున్న విషయం అర్ధంకాదు అని తెలిసినా, ఆమె అతని ప్రేమ వలెనే ఆమె ఇంతగా అతిశయించినది అని తెలిసినా ఆమెను ఏమీ  అనలేదు.
సవతి తల్లి అనిన మాటలు, ఆ మాటలు వింటూ కూడా బదులు చెప్పని తన తండ్రి వలన అవమానంగా భావించి, తన తల్లి అయిన సునీతి ఆ తరువాత నారదుని ఉపదేశం మీద అడవులకు వెళ్లి తపస్సు చేయసాగాడు.
అప్పుడు ఉత్తానపాదునికి అతని తప్పు తెలిసివచ్చినది. అడవుల పాలయిన తన పుత్రుని కోసం ఎదురు చూడసాగాడు. తపస్సు ముగించుకుని రాజ్యమునకు తిరిగి వచ్చిన దృవునకు రాజ్యాభిషేకం చేసాడు. 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఇల జననం

వైవస్వతమనువు మనకు గల 14 మంది మనువులలో ఏడవ వాడు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరమునకు అధిపతి.
ఇతను సూర్య భగవానుని కుమారుడు కనుక సూర్య వంశస్తుడు. శ్రద్దాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వివాహం అయిన చాలాకాలం వరకు వారికి సంతానం కలుగ లేదు. కనుక వసిష్ఠ మహామునిని వారి పుత్ర ప్రాప్తి కోసం ఒక యజ్ఞం చేయమని కోరారు.
ఐతే శ్రద్ధాదేవికి పుత్రిక పై మమకారం కలుగుట  వల్ల ఆమె వసిష్టునకు చెప్పే సాహసం చేయలేక ఆ యజ్ఞములో హోతగా ఉండే వ్యక్తి వద్దకు వెళ్లి అతను యజ్ఞములో పుత్రికను కాంక్షిస్తూ ఆజ్యమును విడువమని కోరినది. దానికి అంగీకరించిన హోట అలాగే చేసెను.
ఆ యజ్ఞం చేసిన కొంతకాలమునకు శ్రద్దాదేవి గర్భందాల్చెను. తరువాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చెను. ఆ ఆడపిల్లకు ఇల అని నామకరం చేసారు.
కొంతకాలం తరువాత వైవస్వతమనువు వసిష్టుని వద్దకు వెళ్లి, " తమవంటి అత్యంత నిష్టా గరిష్టులు చేసిన యజ్ఞం, తమరు చేసిన సంకల్పమునకు విరుద్దంగా ఎలా ఫలితమును ఇచ్చినది?" అని అడిగెను.
జరిగిన విషయమును తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న వసిష్టుడు వైవస్వతమనువునకు విషయం చెప్పి, తనకు ఉన్న శక్తిచేత ఇలను పురుషునిగా మార్చగలను అని ఆమెను పురుషునిగా మార్చారు. పురుషునిగా మారిన ఇలను సుద్యుమ్నుడు అని పిలిచారు.


నా ఆలోచన:
మనకు ఈ కాలంలో ఉన్నట్లుగా బాలికల పట్ల వివక్షత ఆ రోజులలో ఉన్నట్లు కనిపించుట లేదు. పుట్టినది బాలిక అని తెలిసినా ఆమెకు నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు గానీ పుట్టగానే పుత్రుని బదులుగా పుత్రిక జన్మించినది అని గురు వసిష్టుల వద్దకు పరుగులు పెట్టలేదు.

మరి ఒక బాలికను బాలునిగా ఎందుకు మార్చారు?

ఇక్కడ తప్పు శ్రద్దాదేవిది. ఆమెకు ఆడపిల్ల కావాలని కోరిక ఉన్నపుడు ఆమె తన భర్తకు చెప్పి ఉండాలి. కనీసం ఆ యజ్ఞ భాద్యతను నిర్వహిస్తున్న వసిష్టునకు కూడా చెప్పలేదు. హోత  అంటే మన ఈకాలంలో వాడుక భాషలో చెప్పాలంటే ఒక సహాయకునికి చెప్పినది.
యజ్ఞ సంకల్పం చేయబడినది ఒక పుత్రుని కోసం, కనుక పుట్టిన వాడు పుత్రుడే అయి తీరాలి. కాని తల్లి కోరిక మీద పుత్రిక జన్మించినది. ఈ సమస్యకు పరిష్కారం లింగమార్పిడి.
మనకు ఇప్పుడు తెలిసిన లింగమార్పిడి విధానం మన కన్నా విపులంగా మన పూర్వులకు బాగా తెలుసు.




10, సెప్టెంబర్ 2014, బుధవారం

ద్వాదశ సూర్యులు వారి నెలలు , అనుచరులు


మనకు ప్రతి నెలలో ఉండే సూర్యుడు ఒక్కో రకమైన తేజస్సుతో ఉంటాడు కనుక మంకు గల 12 నెలల్లోని 12 సూర్య తెజన్ను ను ఆధారంగా, వాని తీవ్రతల, ప్రభావాల ఆధారంగా వానిని 12మంది సూర్యులుగా భావించి వారి అనుచరులను కూడా విభాగం చేసారు. ఒక్కో సూర్యునికి ఒక రాక్షసుడు, ఒక గంధర్వుడు, ఒక అప్సరస, ఒక ముని మరియు ఒక నాగు లు అనుచరులుగా ఉంటారు.    
             
   
మాసము
సూర్యుడు
ముని
యక్షుడు
గంధర్వుడు
అప్సరస
రాక్షసుడు
నాగ
1
చైత్రం
దాత
పులస్య
రధక్రుత్
తుంబురుడు
కృతస్థలి
హేతి
వాసుకి
2
వైశాఖ
అర్యమ
పులః
అధోజ
నారదుడు
పుంజక స్థలి
ప్రహేతి
కఛనీర
3
జ్యేష్ట
మిత్ర
అత్రి
రధస్వన
హహ
మేనక
పౌరుషేయ
తక్షకుడు
4
ఆషాడ
వరుణ
వసిష్ఠ
చిత్రస్వన
హుహు
రంభ
సహజన్య
శుక్ర
5
శ్రావణ
ఇంద్ర
అంగీరస
శ్రోత
విశ్వవసు
ప్రమ్లోచ
వర్యుడు
ఏలాత పత్ర
6
భాద్రపద
వివస్వ
భృగు
ఆసారణ
ఉగ్రసేన
అనుమ్లోచ
వ్యాగ్ర
శంఖపాల
7
ఆశ్వయుజ
పూష
గౌతమ
సురుచి
సుసేన
ఘృతాచి
వాత
ధనుంజయ
8
కార్తిక
పర్జన్య
భరద్వాజ
రితు
విశ్వ
సేనజిత్
వర్కా
ఐరావత
9
మార్గశిర
అంషుమాన్
కశ్యపుడు
తర్క్స్య
రుతసేన
ఊర్వసి
విధ్యుత్ చత్రు
మహాసంఖ
10
పుష్యం
భగ
అయు:
ఊర్ణ
అరిష్టనేమి
పుర్వచిత్తి
స్పూర్జ
కర్కోటక
11
మాఘం
త్వష్ట
జమదగ్ని
సతాజిత్
ధృతరాష్ట్ర
తిలోత్తమ
బ్రాహ్మాపేత
కంబళా
12
ఫాల్గుణ
విష్ణు
విశ్వామిత్ర
సత్యజిత్
సుర్యావర్క
రంభ
మఖాపేత
అశ్వతర

మనకు గల 12 మంది సూర్యుల ఉహా చిత్రములు

1. దాత 

2. అర్యమ 


3. మిత్ర 

4. వరుణ 

5. ఇంద్ర 

6. వివస్వ 

7. పూష 

8. పర్జన్య 

9. అంషుమాన్ 

10. భగ 

11. త్వష్ట 


12 విష్ణు 







9, సెప్టెంబర్ 2014, మంగళవారం

పల్వలుడు

పల్వలము = చిన్ని నీటి గుంత
పల్వలుడు ఇల్వలుని కుమారుడు. ఇల్వలుడు వాతాపి మహర్షి ఐన అగస్త్యుని కారణం గా మరణించారు. తన తండ్రి పిన తండ్రుల మరణమునకు ఈ మునులే కారణం అని భావించిన పల్వలుడు  నైమిశారణ్యం లోని మునులను ఋషులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అమావాస్య నాడు మునులు పితృ తర్పణలు ఇస్తూ ఉండే కాలం లో ఈ పల్వలుడు ఆ యజ్ఞ వాటికలో సుర, మల, మూత్ర, రక్త మరియు మాంసములతో అపవిత్రం చేస్తూ ఉండేవాడు. ముని స్త్రీ లనుకూడా వేధించే వాడు.
ఒకనాడు బలరాముడు తీర్ధయాత్రలకు బయలు దేరి వెళ్ళాడు. వెళుతూ ఉండాగా, దారిలో ఒకరు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు దానిని స్వీకరించాడు. కొంతదూరం వెళ్ళాక సూతమహాముని చేస్తున్న సత్సంగమునకు వెళ్లారు. సూతుడయిన రోమహర్షనుడు  తప్ప ఆ సభలో ఉన్న అందరు మునులు, ఋషులు అవతార పురుషుడైన బలరామునకు అతిధి సత్కారములు చేసారు. కాని బ్రహ్మ స్థానం లో ఉన్న రోమహర్షణుడు తనను గౌరవించలేదని భావించి, ఇంతకూ ముందు తీసుకున్న కల్లు  ప్రభావం చేత ఆలోచించకుండా అతని తలపై ఒక్క దెబ్బ తన ఆయుధమైన రోకలితో కొట్టాడు. రోమహర్షణుడు అక్కడికి అక్కడే మరణించాడు. తరువాత తన తప్పు తెలుసుకుని పరిష్కారంగా రోమహర్షనుడిని శాశ్వతంగా బ్రహ్మలోకమునకు, అతని తెలివితేటలు, ఆయుషు ను ఆటను పుత్రుదయినా సూతునకు ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెయాల అని ఋషులను అడుగగా వారు పల్వలుని గురించి చెప్పి వానిని వధించమని కోరారు. బలరాముడు రోమహర్షనుని సంహరించినది ఏకాదశి కనుక మరొక నాలుగు రోజులలో అమావాస్య తిధి వస్తుంది అని ఆ నాలుగు రోజులు బలరాముడు అక్కడే ఉన్నాడు.
అమావాస్య రోజు మునులు, ఋషులు యధాప్రకారం తన యజ్ఞమును ప్రారంభించారు. అప్పుడు ఆకాశంలో ఒక నల్లటి ఆకారం కొండలా కనిపించినది. దాని వికటాట్టహాసం భయంకరంగా ఉన్నది. మిడిగుడ్లు, విరబోసిన రాగి రంగు జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన శరీరం తో పల్వలుడు అక్కడకు వచ్చాడు. పల్వలుడిని చూసిన బలరాముడు తన నాగలితో అతని మెడను పట్టి క్రిందికి లాగి ఎడమ చేతిలో ఉన్న రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. అప్పుడు ప్లవలుడు అక్కడికి అక్కడే మరణించాడు.
మహర్షులు ఎంతో సంతోషించి బలరాముని దీవించి తీర్ధయాత్రలకు వెళ్లి, మిగిలిన బ్రహ్మ హత్య పాపమును తొలగించుకోమని అనుజ్ఞ ఇచ్చారు. 

బలరాముడు చేసిన తప్పు

బలరాముడు అవతార పురుషుడు. స్వయంగా ఆదిశేషుని అవతారం. మరి అటువంటి అవతార పురుషుడు ఎలాంటి తప్పు చేసాడు? మరి దాని నుండి ఎలా బయట పడగలిగాడు?
బలరాముడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో తీర్ధయాత్రలకు వెళ్ళాడు.  తనతో పాటు 10,000ల మంది ఉత్తమ బ్రాహ్మణులను వెంట తీసుకుని వెళ్ళాడు. అలా అన్ని తీర్ధములు తిరిగి వస్తూ నైమిశారణ్యం వైపుకు వెళ్లారు. అలా వెళుతూ ఉండగా దారిలో, ఎవరో ఒకరు ఎదురుపడి బలరామునకు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు ఆ కల్లును స్వీకరించారు. నైమిశారణ్యమునకు చేరేసరికి, అక్కడ రోమహర్షనుడు బ్రహ్మ స్థానం లో కూర్చుని పురాణములను అనేక మంది ఋషులకు, మునులకు చెప్తూ ఉన్నాడు. బలరాముడు అక్కడకు వచ్చుట చూసి, పురాణములను వింటూ ఉన్న మునులు, ఋషులు వారికి ఎదురు వెళ్లి వారికి అతిధి మర్యాదలు చేసారు. ఒక్క రోమహర్షణుడు తప్ప మిగిలిన అందరూ తమను గౌరవించుట చుసిన బలరాముని ఆలోచనల మీద ఇంతకు ముందు తీసుకున్న కల్లు  ప్రభావం చేసినది. ఆపలేని కోపంతో రోమహర్షణుడు తనను అవమానించాడని, అతనిని తన నాగలితో బ్రహ్మ స్థానంనుండి క్రిందికి లాగి వేసి, తన రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. మరుక్షణం రోమహర్షణుడు మరణించాడు. అప్పుడు కల్లు ప్రభావం తగ్గటం వల్ల బలరామునికి తను చేసిన తప్పు తెలిసినది. 
అప్పటి వరకు చంద్రుని కాంతి వలే తెల్లగా ప్రకాశించే తెల్లని దేహం కలిగిన బలరాముని దేహం ఆ బ్రహ్మహత్య కారణంగా,. ఒక్కసారిగా అత్యంత నల్లగా మారిపొయినది. అప్పుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అక్కడ ఉన్న ఋషులను, మునులను అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు చనిపోయిన రోమహర్షుని బ్రతికించమని కోరారు. కాని తాను చంపిన వ్యక్తిని మరలా బ్రతికించుట సాధ్యం కాదు. కాని తన ఆత్మబలం చేత అతనికి శాశ్వతంగా బ్రహ్మలోకం ఇప్పించగలను, అతని ఆయుష్షు ను మేధా శక్తి  నీ  అతని కుమారునకు సంక్రమించేలా చేయగలను  అని బలరాముడు రోమహర్షునకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించాడు. మరి ఇక పురాణములు చెప్పే భాద్యతను రోమహర్షుని కుమారుడైన సూతమహామునికి అప్పగించారు. 
ఈ కార్యములు చేయుట వల శరీరం మొత్తం నల్లగా మారిన బలరాముని శరీరం లో కొంత బాగం మాత్రమే (కేవలం నుదురు భాగం) తెల్లాగా మారినది. అంటే తను చేసిన పాపమునకు ఇంకా పారిహారం కాలేదు అని తెలుసుకుని ఇంకా ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఋషులు తమను పల్వలుని బారినుండి కాపాడమని కోరారు. 
బలరాముడు పల్వలుని సంహరించిన తరువాత తాని శరీరం తలవరకూ తెల్లగా మారినది. మరి మిగిలిన శరీర నలుపు ఏవిధంగా పోగొట్టుకోగలను అని అడుగగా, ఋషులు అతనిని తీర్ధయాత్రలు చేయమని చెప్పారు. 
అలా అనేక తీర్ధములు తిరిగి కొంచెం కొంచెం తన శరీరం లోని నలుపును పోగొట్టుకుంటూ చివరకు రామేశ్వరంలో పూర్తిగా తన బ్రహ్మ హత్యా దోషమును పోగొట్టు కున్నాడు. 
అప్పుడు బలరాముడు తీర్ధయాత్రలు చేసే వారు నియమ నిష్టలతో చేయాలి అని నియమం చేసాడు. 

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

స్వరోచి - స్వారోచిషుడు

స్వరోచి, ప్రవరాఖ్యుని మనస్సునందు తలుచుకొంటూ మాయా ప్రవరుని రూపంలో గల కలి అనే గంధర్వుని వల్ల వరూధినికి జన్మించిన వాడు. అతను పుట్టుకతోనే అత్యంత శరీర తేజస్సుతో జన్మించాడు. శుక్లపక్ష చంద్రుని వలే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నాడు. అతను యుక్త వయస్సుకు వచ్చే సమయమునకు సర్వ సద్గుణములు అలవడ్డాయి. వేద, వేదాంగాలు పట్టుబడ్డాయి. సర్వ ఆయుధముల గురించిన విద్యను తెలుసుకున్నాడు. 
ఒకనాడు మంధర పర్వత ప్రాంతం లో తిరుగుతూ ఉండగా ఒక కన్య సహాయంకోసం అరవటం విని అక్కడకు మనోరమ ను రాక్షసుని బారి నుండి కాపాడి,  మనోరమ తండ్రి అయిన ఇందీవరాక్షుడి కి శాపవిమోచనం కలిగించి,  ఇందీవరాక్షుని వద్ద ఉన్న ఆయుర్వేద విద్యను స్వీకరించి, మనోరమతో పాటు శాపగ్రస్తులైన తన స్నేహితురాళ్ళు కళావతి, విభావరిలకు ఆయుర్వేద విద్యద్వారా వారికి గల కుష్టురోగము నుండి విముక్తి కలిగించి, వారి వద్ద నుండి పద్మిని విద్యను,సర్వప్రాణుల భాషలను తెలుసుకొనగలిగిన విద్యను పొందిఇందీవరాక్షుని సమక్షంలో వారు ముగ్గురిని వివాహం చేసుకుని వారితో ఆనందంగా గడప సాగాడు. 
ఒకనాడు స్వరోచి,అతని భార్యల అన్యోన్యత గురించి ఒక కలహంస తన స్నేహితురలయిన చక్రవాకమునకు చెప్పుట స్వరోచి విన్నాడు. 
కలహంస: జగతిలో ఎందరో భార్యాభర్తలు ఉండవచ్చు కానీ వారు ఒకరికి ఇంకొకరు సరి ఐనవారు అయిఉండరు. ఒకరికి మరొకరి పైగల ప్రేమ సమానంగా ఉండదు. కానీ స్వరోచి, అతని ముగ్గురు భార్యలు అందంలో, ప్రేమలో ఒకరికి మరొకరు ఏ మాత్రం తక్కువ కాదు 
చక్రవాకం: స్వరోచి గురించి అంత గొప్పగా చెప్పుకోనుతకు ఏమి లేదు. అతను భార్యలను విద్యను ప్రాప్తించుకొనుటకు మాత్రమే వివాహం చేసుకున్నాడు. ఒక భార్యతో ఉండగా మరొక భార్య గురించి ఆలోచిస్తాడు. 
వీరి మాటలు విన్న స్వరోచికి ఎంతో అవమానంగా అనిపించినది. వారు చెప్పిన మాటలు నిజములు. అలా  కాలం 100 సంవత్సరములు గడచి పోయినది. 
ఒకనాడు స్వరోచి అరణ్యములలో కొన్ని కస్తూరి మృగములను చూసాడు. మగ కస్తూరి మృగం కస్తూరి వాసనను ఒక ఆడ మృగం చూస్తూ ఉన్నది. అది గమనించిన మగ మృగం ఆడమృగం తో " నేను స్వరోచి వంటి వాడిని కాదు, నా భార్యను కనుల ముందు ఉంచుకుని మరొక భార్య గురించి ఆలోచించుటకు, ఒక స్త్రీకి అనేక పురుషులతో సంబంధం ఉంటే ఏ విధంగా ఆమె దారి తప్పినది అంటారో ఒక పురుషుని మనస్సులో అనేక మంది భార్యలు ఉంటే అతనిని కూడా దారి తప్పినా వాని గానే చెప్తారు. నీను నిన్ను దగ్గరకు రానివ్వటానికి నేను ఏమి స్వరోచిని కాను. నీవు దూరంగా వెళ్ళు" అన్నది. ఈ మాటలు విన్న స్వరోచికి వైరాగ్యం వచ్చినట్లు అనిపించసాగినది. కాని ఇంటికి వెళ్లి వారిని చూడగానే మరలా నిత్యనుస్టానము, సర్వ కార్యములు యధావిధిగా సాగుతూనే ఉన్నాయి. 
స్వరోచికి ముగ్గురు భార్యల యందు ముగ్గురు పుత్రులు కలిగారు. 
మనోరమకు విజయుడు, విభావారికి మేరునందనుడు మరియు కళావతికి ప్రభవుడు. స్వరోచి తనకు గల పద్మిని విద్య ద్వారా వారు ముగ్గురి కోసం మూడు నగరములను నిర్మించాడు. తూర్పున కామపుర అనే పర్వతం మీద విజయుని క్కోసం విజయ అనే నగరం, ఉత్తరమున మేరునందుని కోసం నందవతి అనే నగరం, దక్షిణ దిక్కున తల అనే నగరమును ప్రభవునకు నిర్మించి ఇచ్చాడు. 
ఇలా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు స్వరోచి అరణ్యములలో తిరుగుతూ ఉండగా ఒక ఎలుగుబంటి ని చూసి, తన బాణమును బయటకు తీసాడు. కాని ఆ ఎలుగుబంటి కనిపించకుండా పారిపోయినది. అప్పుడు ఒక జింక అతనివద్దకు వచ్చి, తనమీద బాణ ప్రయోగం చేయవలసినది అని అడిగినది. దానికి స్వరోచి, నీకు శరీరంలో ఏమీ అనారోగ్యం ఉన్నట్లు కనిపించుట లేదు, నీకు ఈ విధంగా మరనిమ్చావలెను అనే కోరిక ఎందుకు కలిగినది? అని అడిగాడు. 
జింక : నేను ఒక మానవుని వలచాను కాని అతనికి అతని భార్య పై అమిత మైన ప్రేమ కలదు. మరి నేను బ్రతికి ఉండుట వ్యర్ధం కదా! అందుకనే నన్ను వధించు 
స్వరోచి : ఓ అందమైన జింకా! నీవు ఒక మానవుని ఎలా వరించావు? నీవు మృగానివి. ఇది ఎలా సాధ్యం?
జింక: నేను నిన్నే వారించాను స్వరోచి. అది అసంభవం అని నాకు కూడా తెలుసు కనుకనే నన్ను వధింపమని నిన్నే కోరుకున్నాను 
స్వరోచి: నీవు నన్ను వలచినట్లయితే నేను నిన్ను చంపలేను. కనుక నేను ఎప్పుడు ఏమి చేయాలో చెప్పవలసినది. 
జింక : ఓ స్వరోచి! నీవు ఒకాసారి నన్ను ప్రేమగా దగ్గరకు చేర్చుకో! 
అప్పుడు స్వరోచి ఆ జింకను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు ఆ జింక ఒక అందమైన స్త్రీ రూపును ధరించినది. 
ఆశ్చర్య పోయిన స్వరోచి ఆమె ను నీవు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆమె తను వనదేవతను అని చెప్పినది. కాలంలో రెండవ మనువు జన్మకు కారణం కావలసినది అని దేవతలు తనను ప్రార్ధించగా జింక రూపం లో వచ్చాను అని చెప్పినది. ఆ కలయిక వల్ల  వారికి ఒకపుత్రుడు జన్మించాడు. అత్యంత రమణీయమైన రూపంతో, సర్వశక్తులతో జన్మించిన ఆ బాలునికి ధ్యుతిమంతుడు అని పేరు పెట్టారు. స్వరోచి పుత్రుడు కనుక స్వారోచిషుడు అని కుడా అన్నారు. 
తరువాత స్వరోచి ఒక జలాశయం దగ్గరకు వెళ్లి నప్పుడు రెండు బాతులు వైరాగ్యమును గురించి మాట్లాడుకొనుట విన్న తరువాత అతనికి వైరాగ్యం కలిగి తనభార్యలను పుత్రులకు అప్పగించి, అరణ్యమునకు వెళ్లి తపస్సు చేయుట ప్రారంభించాడు. 

6, సెప్టెంబర్ 2014, శనివారం

ఇందీవరాక్షుడు

ఇందీవరాక్షుడు ఒక విద్యాధరుడు. నలనాభుని పుత్రుడు. అతనికి బ్రహ్మమిత్ర అనే ,ముని శాపం వల్ల బ్రహ్మరాక్షసునిగా మారిపోయాడు. అలా ఎందుకు జరిగినది?
బ్రహ్మమిత్ర ముని వద్ద ఆయుర్వేద విధ్య ఉన్నది అని తెలుసుకుని అతని వద్దకు వెళ్లి ఆ ఆయుర్వేద విద్యను తనకు ప్రసాదించమని అడిగాడు. కాని విధ్యాధరులకు ఆ విద్య ఉపదేశించుట నియమములకు విరుద్దం అని భావించిన బ్రహ్మమిత్రుడు ఇందీవరాక్షునికి ఆ విధ్యన్ను ఇవ్వటానికి ఇష్టపడలేదు. 
అయినా తాను పొందాలనుకున్న విద్యను ఎలాగయినా సాధించాలని అనుకున్న ఇందీవరాక్షుడు అదృశ్యరూపంలో ముని ఆశ్రమం లో నివసించసాగాడు. ఆ ముని తన శిష్యులకు ఉపదేశిస్తున్న సమయం లో అతనుకూడా ఆ విద్యను పొందుతూఉన్నాడు. ఇలా 8 నెలల కాలం గడిచినది. అప్పుడు సంపూర్ణ ఆయుర్వేద జ్ఞానమును పొందిన ఆనందంలో తనను తాను మరచిపోయి నవ్వటం మొదలుపెట్టాడు. ఆ నవ్వును విన్న మునీశ్వరుడు జరిగిన విషయం తెలుసుకుని ఇందీవరాక్షుని బ్రహ్మరాక్షసుడిని కమ్మని శపించాడు. వెంటనే తన కోపమును అదుపు చేసుకుని అతనికి శాపవిమోచనం కూడా చెప్పాడు. ఇందీవరాక్షుడు  7 రోజులలో బ్రహ్మరాక్షసునిగా మారిపోయాడు. 
ఒక రోజు ఇందీవరాక్షుని కుమార్తె మనోరమను ఒక తపస్వి బ్రహ్మరాక్షసునిచే తినబడుగాక అని శపించాడు. స్వయంగా ఇందీవరాక్షుడే తన కుమార్తె ఐన మనోరమను వెంబడించాడు. అలా ఆమె కొన్తదూరం వెళ్ళిన తరువాత ఆమె వరూధిని పుత్రుడైన స్వరోచిని శరణు వేడినది. అప్పుడు అతను అగ్నిబాణమును ప్రయోగించగా ఇందీవరాక్షునికి శాప విమోచనం కలిగినది.  
అతని, అతని కుమార్తె మనోరమ శాప విమోచనం కలిగించిన స్వరోచికి కృతజ్ఞతగా అతనికి తనవద్ద ఉన్న ఆయుర్వేద విద్యను ఇచ్చాడు. తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేసాడు

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వరూధిని

వరూధిని మౌల అనే గంధర్వుని కుమార్తె. ఏంతో సుందరమైన అప్సరస. ఆమెకు గంధర్వలోకం కన్నా హిమాలయ పర్వతప్రాంతం అంటే ఎంతో మక్కువ. అందుకనే ఆమె సర్వదా హిమాలయ పర్వత ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది.
ఒకరోజు ఆమె వద్దకు తను ఇంటికి వెళ్ళే మార్గం చెప్పవాసినది అని ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి అడిగాడు. అతనే ప్రవరాఖ్యుడు. అతని దివ్యసుందర రూపం చుసిన వరూధిని మరుక్షణం అతనిని వరించినది. అప్పటి వరకు ఆమెను వివాహం చేసుకుంటాం అనే ప్రస్తావనతో నాగ, సిద్ధ, గంధర్వ, దేవతలు, అసురులు ఆమెను అడిగారు. కానీ  ఆమె మనస్సు ఎవరినీ వరించలేదు. కాని మొదటిసారి ఒక బ్రాహ్మణ యువకుని ఆమె వరించినది.
ప్రవరాఖ్యుడు తాను  తన స్వగృహమునకు వెళ్ళే మార్గం చెప్పమని అడుగగా, ఆమె అతనిని వరించినది అని చెప్పినది. ఆమె తన హృదయవేదనను అతనిని అర్ధం చేసుకుని ఆమెను వరించి, ఆమె ప్రాణములు నిలుపవలసినది అని ప్రార్ధించినది. ప్రవరాఖ్యుడు అతని నిత్య విధులకు ఆలస్యం అవుతుంది కనుక త్వరగా ఇంటికి వెళ్ళే సంకల్పంలో ఉన్నాడు కనుక ఆమె అతనిని కనీసం ఒక్కసారి ఆమె భాదను తొలగించమని ప్రార్ధించినది. కానీ ప్రవరాఖ్యుడు అమిత నిష్టాగరిష్టుడు. అతను తన నిష్టను వదులుకొనుటకు ఇష్టపడకుండా అగ్ని దేవుని సహకారం తో ఇంటికి వెళ్లి పోయాడు.
కానీ వరూధిని విరహ తాపంతో రోదిస్తూ ఉండిపొయినది. ఆమె శోకమును ఆమెను నిరంతరం ప్రేమిస్తూ, అమెచేత అనేకసార్లు తిరస్కరించబడిన కలి అనే ఒక గంధర్వుడు చూసాడు. వరూధిని శోకం అతనిని మరింత భాదించినది. ఆమె శోక కారణం తెలుసుకుని ఆమెను అనునయించాలి అని భావించాడు. అతనికి గల దివ్యదృష్టి ద్వారా జరిగిన విష్యం తెలుసుకున్నాడు. అతనిముందు రెండు మార్గములు ఉన్నాయి ఆమె విచారమును దూరం చేయుటకు.
  1. బ్రాహ్మణ యువకుని తిరిగి వరూధిని వద్దకు తీసుకు రావటం 
  2. తనే స్వయంగా బ్రాహ్మణ రూపం లో ఆమెకు చేరువ అగుట 
బ్రాహ్మణ యువకుడు ఆమె ప్రతిపాదనను ఒప్పుకునే వాడయితే తిరిగి ఇంటికి వెళ్ళేవాడే కాదు. కనుక రెండోవ మార్గమే సరి ఐనది అని భావించి ఆ యువకుని రూపంలో వరూధిని వద్దకు వెళ్ళాడు. 
మాయా ప్రవరాఖ్యుని చూసిన వరూధిని శోకంనుండి తేరుకున్నది. సంతోషించినది. ఐతే వారి సంగమమునకు మాయా ప్రవరుడు ఒక నిబంధన ఉంచాడు. వారి సంగమ సమయంలో వరూధిని కన్నులు ముసుకోవాలి అని. 
ప్రవరుని చూసిన, ఆటను తిరిగి తనవద్దకు వచ్చిన సంతోషంలో ఆమె ఆ నిబంధనను ఒప్పుకున్నది. 
వారి సంగమ సమయంలో ఆమె తన కన్నులు మూసుకుని ప్రవరుని గురించి అలోచించ సాగినది. వరూధిని గర్భందాల్చినది. 
ప్రవరుని ఆలోచనలు, గంధర్వుని సంగమం వల్ల జన్మించిన ఆ బాలుడు దివ్య తేజస్సు తో జన్మించాడు. అందువల్ల అతనికి స్వరోచి అని నామకరణం చేసారు. 

కాలాంతరంలో ఈ స్వరోచి కళావతి, విభావరి మరియు మనోరమ లను వివాహం చేసుకుని రెండోవ మనువయిన స్వారోచిష అనే మనువు జన్మకు కారణం అయినాడు. 

4, సెప్టెంబర్ 2014, గురువారం

మనోరమ

మనోరమ మరుధన్వ మరియు విద్యాధర ఇందీవరాక్షుని పుత్రిక. ఈమెకు సర్వ ఆయుధములగురించిన, అస్త్రముల జ్ఞానము ఉన్నది. అన్నిటికి మించి హృదయజ్ఞానము తన తండ్రి నుండి లబించినది.
హృదయజ్ఞానము మొదట మహాదేవుడయిన శివుడు స్వయంగా స్వయంభుమనువునకు ఉపదేశించారు. తరువాత స్వయంభుమనువు సిద్దులలో ఉత్తముడయిన వానికి ఆ విద్యను ఉపదేశించారు. ఆ సిద్ధుడు చిత్రాయుధునకు ఉపదేశించాడు. తరువాత చిత్రాయుధుడు తన కుమార్తె కన్యాదాన సమయంలో అల్లుడయిన విద్యాధర ఇందీవరాక్షునికి ఉపదేశించారు. విద్యాధర ఇందీవరాక్షుడు తన పుత్రిక మనోరమకు చిన్నతనంలోనే ఉపదేశించారు.
ఒకసారి ఈమె తన చెలులైన కళావతి, విభావరి లతో కలిసి కైలాస పర్వతమునకు బయలుదేరినది. వారికి మార్గమధ్యంలో తపస్సులో మునిగి ఉన్న, శరీరం శుష్కించి ఉన్న ఒక ముని కనిపించాడు. వారు ఆ మునిని చూసి తన నవ్వును నిగ్రహించుకోలేక పోయారు. వారి నవ్వు వల్ల తపోభంగం కలిగిన ఆ ముని మనోరమను చూసి ఆమెను ఒన బ్రహ్మరాక్షసుడు తరుముతాడు అని శపించాడు. మనోరమ ప్రక్కనే ఉన్న కళావతి, విభావరి లకు కుష్టురోగము కలుగు గాక అని శపించాడు.
ముని శాపం అతని నోటినుండి వెలువడిన మరుక్షణం మనోరమను ఒక బ్రహ్మరాక్షసుడు తరుముతూ వచ్చారు. కళావతి, విభావరి లకు కుష్టురోగము వచ్చినది.
మనోరమ తనను తానూ కాపాడుకొనే ప్రయత్నంలో దిక్కులకు పరుగులు పెట్టసాగినది. అలా మూడు రోజుల నిరంతర ప్రయాణం తరువాత మంధర పర్వత ప్రాంతంలో పరుగెడుతున్న సమయంలో ఆమె స్వరోచిని తనను కాపాడవలసినదిగా ప్రార్ధించినది. ఆ సమయంలో స్వరోచి వద్ద ఏవిధమైన ఆయుధములు లేవు, ఆ విషయం గమనించిన మనోరమ తనవద్ద ఉన్న అస్త్ర జ్ఞానమును స్వరోచికి అందించినది. ఆ అస్త్రముల సహాయంచేత స్వరోచి మనోరమను తరుముతూ వచ్చిన బ్రహ్మరాక్షసుని మీద యుధానికి సంసిద్దుడయాడు.
బ్రహ్మరాక్షసుని మీద మొదటి అస్త్రం ప్రయోగించగానే ఆ బ్రహ్మరాక్షసుడు సుందరరూపం తో కనిపించాడు. అతనే మనోరమ తండ్రి  ఇందీవరాక్షుడు.
ఇందీవరాక్షుడు బ్రహ్మమిత్ర అనే ఒకమునివద్ద ఉన్న ఆయుర్వేద విద్యను తస్కరించుటకు ప్రయత్నించుట వల్ల అతని దుశ్చర్య కు కోపించిన బ్రహ్మమిత్ర ముని ఇందీవరాక్షుని బ్రహ్మరాక్షసునిగా మారమని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్ధించగా బ్రహ్మరాక్షసునిగా ఉన్నప్పుడు తన కుమార్తెను తినాలని ప్రయత్నించినప్పుడు ఒక వీరుని చేతిలో శాపవిమోచనం కలుగుతుంది, దొంగతనంగా పాప్తించుకున్న ఆయుర్వేద విద్యను అతనికి ఉపదేశించమని చెప్పారు.
ఇందీవరాక్షుడు ఆయుర్వేద విద్యను స్వరోచికి ఉపదేశించారు. అప్పుడు మనోరమ శాపకారణంగా అస్వస్థత చెందిన తన స్నేహితులను ఈ ఆయుర్వేద విద్య ద్వారా నయం చేయమని కోరినది. స్వరోచి వారిరువురికీ స్వస్థత చేకూర్చారు.
అప్పుడు కళావతి తన వద్ద ఉన్న పద్మిని విద్యను భోదించినది.
విభావరి తనవద్ద ఉన్న సర్వ జీవుల భాషలను అర్ధంచేసుకోగలిగిన జ్ఞానమును భోదించినది.
మనోరమ, కళావతి మరియు విభావరిలను స్వరోచి వివాహం చేసుకున్నాడు.