మన సంప్రదాయం : శాస్త్రీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన సంప్రదాయం : శాస్త్రీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2020, శుక్రవారం

పంచ భూతములు - States of matter

హైందవ సంప్రదాయ ప్రకారం ఈ సకల సృష్టి పంచభూతములనుండి ఉద్భవించింది. ఈ సృష్టి లో  ఏ పదార్ధం తీసుకున్న అది ఈ పంచభూతముల అనుసంధానమే అయ్యి ఉంటుంది. ఆ పంచభూతములుగా వారు చెప్పినవి 

 1. ఆకాశం 

2. వాయువు 

3. అగ్ని 

4. జలం

5. భూమి  

ఈ నాటి శాస్త్రవేత్తలు మొత్తం మీద ఉన్న పదార్ధములను వాని భౌతిక ధర్మాలను అనుసరించి ముఖ్యంగా మూడు రకాలుగానూ, విపులంగా సిచూసినప్పులేదు ఐదు రకాలుగాను చెప్పారు. వారి ప్రకారం ఏ పదార్ధమయిన ఈ ఐదు రకములలో ఒకటిగా  లేక, వాని మిశ్రమంగా  ఉంటుంది. అవి 

1. ఘనములు 

2. ద్రవములు 

3. వాయువులు 

4. ప్లాస్మా 

5. బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ 

ఇప్పుడు మనం పైన చెప్పుకున్న రెండు రకముల ను పోల్చి చూద్దాం!

1. ఘనములు - భూమి :  ఘనం-భూమి ఒకే లక్షణములు కలిగి ఉంటాయి. ఈ రెడింటికి నిర్దిష్టమయిన ఆకారం, ఘనపరిమాణం ఉంటాయి. వాని అణువు లు చాలా దగ్గరగా ఉంటాయి. 

2. ద్రవములు - జలం: ఈ రెండు నిర్దిష్టమయిన ఘనపరిమాణం కలిగి ఉంటాయి కానీ నిర్దిష్టమయిన ఆకారం కలిగి ఉండవు. వాని అణువులు ఘనముల అణువులతో పోల్చిచూసినప్పుడు దూరంగాను, వాయువుల అణువులతో పోల్చి చూసినప్పుడు దగ్గరగాను ఉంటాయి. 

3. వాయువులు - వాయువు : వీనికి నిర్దిష్టమయిన ఆకారం కానీ ఘనపరిమాణం కానీ ఉండవు. వీని అణువులు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. 

4. ప్లాస్మా - అగ్ని : సూర్యునిలో ఉండే మండి పోయే వాయువులను ప్లాస్మా గా గుర్తించ వచ్చు. అవి నిరంతరం శక్తిని, కాంతిని విలువరిస్తూ ఉంటాయి. వీనికి అత్యంత శక్తి ఉంటుంది. నిరంతరం చలిస్తూనే ఉంటాయి.అందుకే దీనిని మనం అగ్నితో పోల్చ వచ్చు. 

5. ఆకాశం - బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ : గాలికంటే లక్ష రెట్లు  తేలికయిన పదార్ధాన్ని బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్  అంటారు. అంటే ఆ పరిస్థితిలో ఉన్న ఏ పదార్ధమయిన దానికి ఉండవలసిన  పరిమాణం కంటే చాలా తక్కువ పరిమాణమును కలిగి ఉంటుంది కనుక దీనిని మనం  ఆకాశం తో పోల్చవచ్చు. ఇవి అత్యంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి.  

కాబట్టి ఈ కాలంలో  మనం చెప్పుకుంటున్న అనేక విషయాముల గురించి మనకంటే ఎన్నో వేల  సంవత్సరముల ముందే మన ఋషులు అత్యంత సహజంగా సామాన్య మానవునకు అర్ధమయ్యే భాషలో చెప్పారు. 

27, డిసెంబర్ 2018, గురువారం

సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర

మన సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వకాలంలో దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములుగానేకాక అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా ఉపయోగ పడేవో చుద్దాం!
  1.  వేద విధ్యాలయాలు  :  ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధులు నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక స్థానం అవసరం ఏముంది?
  2.     విధ్యావేత్తల సమావేశములు   :  ఆ రోజులలో శాస్త్ర చర్చలకు, అవధానములకు, పండితుల మద్య వాదములకు దేవాలయములు వేదికలుగా మారేవి
  3.    కళలు  : లలిత కళలకు దేవాలయములు పట్టుకొమ్మలు. నాట్యములు, గానములు, వాద్యములుకు సంబందించిన ప్రతిఒక్కరు దేవాలయములలో తమ ప్రదర్శనలు ఇస్తూండేవారు
  4.    శిలాశాసనములు  : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను, ఆయా దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా దేవాలయములలో శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు మన చరిత్రకు సాక్షులు
  5.   స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం : పైన చెప్పిన శిలాశాసనముల వలెనే ఈ స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం కూడా చరిత్రకు సాక్షములు.. అయితే వీని ప్రముఖ్యం ఆ రాజుల సమయంలో కళల స్వరూపమును మనకు తెలియజేస్తాయి
  6.    గోదాములు : అప్పట్లో దేవాలయముల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రైతులు ఆ ఆవరణను కొంతమేర ధాన్యమును నిల్వచేసుకునే గోదాములుగా వాడుకునేవారు
  7.   చికిత్సా కేంద్రాలు  : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లుగా వైధ్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వైద్య సేవలు అందేవి.
  8.    గ్రామ సమావేశములు : ఆయా గ్రామములకు సంబందించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయములు వేదికగా జరిగేవి.
  9. ఎన్నికల కేంద్రములు : ఆయా గ్రామములలో జరిగే ఏ విధమైన ఎన్నికలయినా దేవాలయ ప్రాంగణాములలో జరిగేవి.
  10.  అర్ధిక కార్యకలాపములు  : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఆర్ధిక పరమైన చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రములయ్యేవి

ఇన్ని ముఖ్యమయిన పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని నిర్ణయించుటకు ముఖ్యమయిన కారణం పైన చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలనే.

16, మార్చి 2015, సోమవారం

ఉత్తరమునకు తల ఉంచి ఎందుకు పడుకో కూడదు?

ఉత్తరమునకు తల ఉంచి పడుకుంటే ఇక ఏమయినా ఉందా! అలా పడుకుంటే దయ్యములు వచ్చి మనల్ని పట్టేసుకుంటాయి, మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. లేదంటే తిన్నగా చావే వస్తుంది అని కొందరు, అబ్బే అవి అన్నీ మూఢనమ్మకములు అని కొందరు, అనేకమయిన సమాధానములు వినిపిస్తాయి కదా! మరి నిజం ఏంటి?
భూమికి కూడా అయస్కాంత శక్తి ఉన్నది(గురుత్వాకర్షణ దీనికి రుజువు).
మనం చిన్నప్పుడు అయస్కాంత తత్త్వం గురించి చదువుకున్నాం కదా! ఒక అయస్కాంతాన్ని వ్రేలాడదీస్తే అది ఉత్తర దక్షిణ ద్రువముల వైపుగా విశ్రాంతి స్థానమునకు చేరుతుంది. అంటే భూమి యొక్క  అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణ దృవములకు ఉంటుంది.
మనకు ఈరోజు ఉన్న అధునాతనమయిన విజ్ఞాన శాస్త్రము ప్రకారం మానవుని దేహం కూడా తనదయిన ఒక అయస్కాంత పరిధిని కలిగి ఉంటుంది. దీనికి కారణం నిరంతరం మన దేహంలో నిర్విరామం గా ప్రవహిస్తూ ఉండే రక్తం అని చెప్తారు. కనుక మనం ఉత్తరం వైపునకు తల పెట్టి పడుకున్నట్లయితే మన శరీరంలోని అయస్కాంత పరిధి భూమి యొక్క అయస్కాంత పరిధితో  సమాంతరంగా ఉంటుంది. అలా ఉండటం వలన మన దేహంలో నిరంతరం ప్రవహించే రక్తం వలన కలిగే రక్తపీడనంలో మార్పులు సంభవిస్తాయి. దాని కారణంగా రక్తమును నిరంతరం మన శరీరంలో పంపు చేసే గుండె ఆ మార్పులను తట్టుకోవటానికి మరింత బలంగా పనిచేయవలసి వస్తుంది.
మరో విషయం ఏంటంటే మన రక్తంలో కొంత ఐరన్ ఉంటుంది. భూమికి ఉన్న అయస్కాంత శక్తి కారణంగా మన దేహంలోని ఇనుము కూడా రక్త ప్రసరణ కార్యక్రమంలో అవరోధంగా ఉంటుంది. దీనివలన తలనొప్పులు, ఆల్జిమర్, పార్కిన్సన్ వ్యాధులతో పాటు మెదడుకు సంబంధించిన రుగ్మతలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
అబ్బో అన్నీ ఇలానే చెప్తారు! మేం ఎప్పటి నుండో ఇలానే పడుకునే అలవాటు ఉంది మాకు ఏమీ తేడా లేదు. అని ఎవరైనా అనుకోవచ్చు. ఇలా ఒకరోజు పడుకుంటేనే ఇవన్నీ  జరుగుతాయని కాదు. ఇలా పడుకోవటం ఒక అలవాటుగా మారితే మన ఆరోగ్యంలో అనేకమయిన మార్పులు వస్తాయి అనే మనకు అటువైపు తల పెట్టి పడుకోవద్దు అని చెప్తారు.