10, ఫిబ్రవరి 2022, గురువారం

నలుడు -- హంస

 మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన చూశాం! మరి ఆ నలుడు ఎవరు? అతనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది? అని ఇప్పుడు తెలుసుకుందాం!

నిషాద రాజ్యమునకు రాజు వీరసేనుడు. అతని కుమారుడు నలుడు. నలునికి విదర్భ రాజ పుత్రిక అయిన దమయంతి గురించి అనేక విషయములు తెలుస్తూ ఉండుటవలన ఆమె అంటే అతనికి ప్రేమ కలిగింది. 
ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆకాశంలో తిరుగుతున్న హంసల గుంపు కనిపించింది. వానిని వెంబడిస్తూ వెళ్ళిన అతను ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు అక్కడి నుండి ఎగిరి పోయాయి కానీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. 
నలునికి పట్టుబడిన హంస అతని మనస్సులో ఉన్న దమయంతి పై ప్రేమను గమనించి, నలుడు ఇప్పుడు తనను వదిలితే తను వెళ్ళి దమయంతికి అతని గురించి గొప్పగా చెప్తానని మాట ఇచ్చింది. దమయంతి పేరు విన్న నలునికి తిరిగి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఆ హంసను వదలి పెట్టాడు. ఆ తరువాత ఆ హంస నిజంగా దమయంతి దగ్గరకు వెళ్ళిందా లేదా? వెళితే ఏమి చెప్పింది? దమయంతికి నలుని పైన ప్రేమ కలిగిందా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి