కేరళ జానపద కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కేరళ జానపద కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2021, శుక్రవారం

వరరుచి, కేరళ జానపద కథ

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో విధిని తప్పించలేక పంచమకన్యతో  అతనికి జరిగిన వివాహం గురించి, వివాహానంతరం  పొందిన సంతానాన్ని వరరుచి వదలిపెట్టటం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం!  

తనకు కలిగిన 11 మంది కుమారులను నిర్దాక్షిణ్యంగా అడవిలో పొత్తిళ్లలోనే వదిలిన వరరుచి భార్య, తనకు ఒక బిడ్డను పెంచుకోవాలని కోరిక బలంగా కలిగింది. అందుకే తనకు 12 వ సారి ప్రసవవేదన మొదలవగానే అడవిలోని పొదల చాటుకువెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పటి వలెనే వరరుచి "ఆ బిడ్డకు నోరు ఉందా" అని అడిగాడు. పిల్లవాడిని తానే పెంచుకోవాలి అనే కోరిక ఉన్న ఆమె వెంటనే ఆ బిడ్డకు నోరులేదు అని చెప్పింది. ఆ తరువాత బిడ్డను చూస్తే నిజంగానే అప్పుడు పుట్టిన ఆ బిడ్డకు నోరులేదు. 

అప్పుడు వరరుచి ఆ నోరులేని పిల్లవాడిని ఒక కొండమీద దేవతలా ప్రతిష్టించి తన భార్యతో కలసి దారిన అతను యాత్రలలో వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతను కాలధర్మం చేసాడు. 

మరి అడవిలో వదిలిన ఆ 11 మంది పిల్లలు ఎం అయ్యారు?

వారిని వివిధజాతులకు చెందిన కుటుంబాలు పెంచుకుని వారి వారి కుటుంబ సంప్రదాయాలను వారి ద్వారా కొనసాగేలా చేసుకున్నారు. కేరళలో ప్రసిద్ధమయిన జానపద కధలలో ఈ వరరుచి కధ ఒకటి. వారికి కలిగిన సంతానం, వారు పెరిగిన కులం/జాతి/వృత్తి ఇప్పుడు తెలుసుకుందాం!

  1. మేళత్తూళ్ అగ్నిహోత్రి : నిత్యఅగ్నిహోత్రులు 
  2. పాక్కనార్ : పంచమజాతి 
  3. రజకుడు :: చాకలి 
  4. నారణతు  బ్రాహ్మణ :నాయి బ్రాహ్మణ 
  5. కారెక్కాల్ మాత :: వరరుచి సంతానంలో ఒకేఒక ఆడపిల్ల 
  6. అకవూర్ చాటన్ :: వైశ్య
  7. వడుతల నాయర్ : సైనిక 
  8. తిరువళ్ళువర్: తమిళనాట ప్రముఖ కవి , కన్యాకుమారిలో సముద్రములో పెద్ద విగ్రహం ఉంటుంది 
  9. ఉప్పుకొట్టం : ముస్లిం 
  10. పాణనర్ : సంగీత కారుడు 
  11. పేరుంథచ్చం :: వడ్రంగి 
  12. వాయిళ్ళకుణ్ణిల్ అప్పన్ : నోరులేని కొండమీది దేవత
మనం చెప్పుకున్న ఈ కథ కేరళలో ఒక ప్రముఖమైన జానపద కథ. ఆ కథపేరు పరాయి పెట్ట పంతిరుక్కులం ఈ పేరుకు అర్ధం "నిమ్నజాతి స్త్రీ ముంది జన్మించిన 12 కులములు".  పైన చెప్పుకున్న వారి సంతతి ఇప్పటికి ఉన్నారు అనై వారు ఇప్పటికి కూడా కలుస్తూ ఉంటారు అని కేరళలో కధనాలు ఉన్నాయి.  

16, డిసెంబర్ 2021, గురువారం

వరరుచి విధి

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో అతనికి జరిగిన వివాహం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం! 

వివాహం జరిగిన  వరరుచి భార్యతో కాలంగడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఉద్యానవనంలో వరరుచి తన భార్యతలను తన ఒడిలో ఉంచుకుని ఆమె జుట్టును చేతితో సరిచేస్తుండగా ఒక నల్లని మచ్చ ఆమె తలపైన గమనించాడు.  అని ఎలా వచ్చింది అని  తన భార్యను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె  ఆ బ్రాహ్మణునకు సొంత కుమార్తె కానని, చిన్నప్పుడు ఒక అరటి బోదెలో తలపైన దీపంతో నదిలో కొట్టుకు వస్తున్న ఆమెను ఆ బ్రాహ్మణుడు కాపాడి తన కుమార్తెగా పెంచాడు అని చెప్తుంది. ఆ వివరం విన్న వరరుచికి ఆశ్చర్యం వేసి, విధిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు. ఆమె జన్మ వృత్తాంతం అంతా ఆమెకు వివరించి చెప్తాడు. కానీ బ్రాహ్మణునిగా పెరిగినా ఆమె ఒక పంచమజాతి కన్య కనుక, ఆమెను వివాహం చేసుకున్నందుకు అతనుకూడా బ్రాహ్మణ్యం వదలి తీర్ధ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు ఆమెకు చెప్తాడు. ఆ తీర్ధయాత్రలు ఆజన్మాంతం చేయాలి అనుకుంటున్నట్లుగా కూడా చెప్తాడు. ఆమె కూడా అతని వెంట తీర్థయాత్రలకు వెళుతుంది. 

ఆ తీర్ధయాత్రలు చేసే క్రమంలో ఆమె పదకొండుసార్లు గర్భవతి అయ్యి పదకొండుమంది మగశిశువుకు జన్మఇచ్చింది. అయితే  ఆమె ప్రసవవేదన పడుతూ అడవులలో గుట్టల ప్రక్కన బిడ్డలకు జన్మ ఇచ్చినప్పుడు వరరుచి ఆ పొదల బయట నిలబడి ఒక ప్రశ్న అడిగేవాడు. పుట్టిన ఆ పసివానికి నోరు ఉందా అని. ఆమె బిడ్డను చూసి ఉంది అని చెప్పగానే "నోరు ఇచ్చిన దేవుడు వానికి ఆహారంకూడా సమకూరుస్తాడు కనుక ఆ బిడ్డను అక్కడే వదలి రా" అని చెప్పేవాడు. ఆమె భర్తమాట విని అలాగే తన 11 మంది పిల్లలను అడవిలో పొదల మద్యవదలి తన భర్తతో తీర్థయాత్రలకు సాగిపోతూ ఉండేది. 

అలా వదిలివేయబడిన 11మంది పిల్లలు ఏమి అయ్యారు? ఆమె తనకంటూ ఒక కుమారుని పెంచుకోవాలి అని ఎందుకు అనుకోలేదు? అలా పెంచుకునేందుకు ప్రయత్నించిందా? తరువాత ఏం  జరిగింది ? తరువాతి టపాలో చూద్దాం!