పురాణములలో విషయములు - శాస్త్రీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పురాణములలో విషయములు - శాస్త్రీయత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2020, శుక్రవారం

పంచ భూతములు - States of matter

హైందవ సంప్రదాయ ప్రకారం ఈ సకల సృష్టి పంచభూతములనుండి ఉద్భవించింది. ఈ సృష్టి లో  ఏ పదార్ధం తీసుకున్న అది ఈ పంచభూతముల అనుసంధానమే అయ్యి ఉంటుంది. ఆ పంచభూతములుగా వారు చెప్పినవి 

 1. ఆకాశం 

2. వాయువు 

3. అగ్ని 

4. జలం

5. భూమి  

ఈ నాటి శాస్త్రవేత్తలు మొత్తం మీద ఉన్న పదార్ధములను వాని భౌతిక ధర్మాలను అనుసరించి ముఖ్యంగా మూడు రకాలుగానూ, విపులంగా సిచూసినప్పులేదు ఐదు రకాలుగాను చెప్పారు. వారి ప్రకారం ఏ పదార్ధమయిన ఈ ఐదు రకములలో ఒకటిగా  లేక, వాని మిశ్రమంగా  ఉంటుంది. అవి 

1. ఘనములు 

2. ద్రవములు 

3. వాయువులు 

4. ప్లాస్మా 

5. బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ 

ఇప్పుడు మనం పైన చెప్పుకున్న రెండు రకముల ను పోల్చి చూద్దాం!

1. ఘనములు - భూమి :  ఘనం-భూమి ఒకే లక్షణములు కలిగి ఉంటాయి. ఈ రెడింటికి నిర్దిష్టమయిన ఆకారం, ఘనపరిమాణం ఉంటాయి. వాని అణువు లు చాలా దగ్గరగా ఉంటాయి. 

2. ద్రవములు - జలం: ఈ రెండు నిర్దిష్టమయిన ఘనపరిమాణం కలిగి ఉంటాయి కానీ నిర్దిష్టమయిన ఆకారం కలిగి ఉండవు. వాని అణువులు ఘనముల అణువులతో పోల్చిచూసినప్పుడు దూరంగాను, వాయువుల అణువులతో పోల్చి చూసినప్పుడు దగ్గరగాను ఉంటాయి. 

3. వాయువులు - వాయువు : వీనికి నిర్దిష్టమయిన ఆకారం కానీ ఘనపరిమాణం కానీ ఉండవు. వీని అణువులు ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. 

4. ప్లాస్మా - అగ్ని : సూర్యునిలో ఉండే మండి పోయే వాయువులను ప్లాస్మా గా గుర్తించ వచ్చు. అవి నిరంతరం శక్తిని, కాంతిని విలువరిస్తూ ఉంటాయి. వీనికి అత్యంత శక్తి ఉంటుంది. నిరంతరం చలిస్తూనే ఉంటాయి.అందుకే దీనిని మనం అగ్నితో పోల్చ వచ్చు. 

5. ఆకాశం - బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్ : గాలికంటే లక్ష రెట్లు  తేలికయిన పదార్ధాన్ని బోస్ ఐన్స్టెయిన్ కండెన్సేట్  అంటారు. అంటే ఆ పరిస్థితిలో ఉన్న ఏ పదార్ధమయిన దానికి ఉండవలసిన  పరిమాణం కంటే చాలా తక్కువ పరిమాణమును కలిగి ఉంటుంది కనుక దీనిని మనం  ఆకాశం తో పోల్చవచ్చు. ఇవి అత్యంత తక్కువ శక్తిని కలిగి ఉంటాయి.  

కాబట్టి ఈ కాలంలో  మనం చెప్పుకుంటున్న అనేక విషయాముల గురించి మనకంటే ఎన్నో వేల  సంవత్సరముల ముందే మన ఋషులు అత్యంత సహజంగా సామాన్య మానవునకు అర్ధమయ్యే భాషలో చెప్పారు. 

16, మార్చి 2016, బుధవారం

మత్స్యగంధి - చేపల వాసన రహస్యం

మనం ఇంతకుముందు వేద వ్యాస జననం గురించి చెప్పుకునే సమయంలో సత్యవతి గురించి, ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన (ఆ కారణంగానే ఆమెను మత్స్యగంధి అనే వారు) గురించి చెప్పుకున్నాం.
మనకు సహజంగా వచ్చే అనుమానం ఆమెకు చేపల వాసన ఎందుకు వచ్చింది? అసలు అలా ఎవరికయినా ఉంటుందా? అది కవి గారి కల్పనే గానీ? చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు.
కానీ మన పురాణములలో చెప్పిన విషయములు మన విజ్ఞాన శాస్త్రములకు అందవు కనుక అవి అన్ని అధ్బుతకల్పనలు అని అందరూ కొట్టి పారేస్తూ ఉంటారు. 18వ శతాబ్దం వరకు మన పురాణములలో తప్ప భౌతికంగా విమానం అంటే ఎవరికీ తెలియదు. తరువాత మన విజ్ఞాన శాస్త్రం అభివృధి చెందింది. విమానములు తయారు చేయబడ్డాయి. అలాగే ఇంకా చాలా విషయములు మన విజ్ఞానమునకు ఇంకా అర్ధం కావు.

ఈ మత్స్యగంధం గురించి ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు కొంత సమాచారం సాధించారు. ఈ వాసన రావటం అనే ఈ  వైద్య పరిస్థితి కి "ఫిష్ ఓడర్ సిండ్రోమ్" అని పిలుస్తారట. అంటే మన తెలుగులో చేపల వాసన వచ్చే పరిస్తితి అని అర్ధం. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే మానవుల చర్మ గ్రంధులలో ఉత్పత్తి అయ్యే "ట్రై మిథైల్ అమీన్యూరియ" అనే రసాయనం అట. సహజంగా ఈ రసాయనం అందరిలో కొంత మొత్తంలో ఉత్పత్తి అయినా దాన్ని  తటస్థీకరించే వ్యవస్తను చర్మం కలిగి ఉంటుందట. ఒకవేళ ఈ రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అయిన సందర్భంలో ఆ వ్యవస్థ దెబ్బతిని అప్పుడు ఆ మనిషి నుండి చేపల వాసన వస్తుందట.
అదండీ సంగతి. ఇక ముందు మన శాస్త్రవేత్తలు ఈ మత్స్యగంధం పోయి అందరూ యోజనగంధులుగా మారే శాస్త్రీయతను నిరూపించగలిగితే బాగుంటుంది కదా!