12, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి - 6

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఐదు  భాగములు చెప్పుకున్నాం కదా! ఐదవ భాగంలో విదురుడు ధర్మారాజు గుణములను వివరించాడు. ఇప్పుడు అతను తమ రాజ్యంలో పరిస్థితిని వివరిస్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

దుర్యోధనే సౌబలే చ కర్ణే దుఃశాసనే తథా

ఏతేష్వైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్ఛసి


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

శకునిరాధాత్మజాత దుశ్శాసనాగ్ర, జాతుదుర్యోధనాది శీర్షంబులందు

రాజ్యమిడిసిరిగోర గౌరవమహీశ తలచితివి కాని చెల్లదధర్మలగుట


భావం: దుర్యోధనుడు, సౌబల రాజయిన శకుని, కర్ణుడు, దుశ్శాసనులపై రాజ్యభారమును ఉంచి, ఇంకా మంచి జరగాలని నీవు ఏవిధంగా అనుకొంటున్నావు?

విశ్లేషణః

ఇంతకుముందు భాగంలో విదురుడు ధర్మరాజు మంచితనం, ఉదారత, అతను పెదతండ్రి స్థానంలో ఉన్న దృతరాష్టునికి ఇచ్చే గౌరవం, అటువంటి ధర్మరాజును దృతరాష్టుడు వివక్షతతో చూడడం చెప్పి, ఇక్కడ అతను ఎవరికోసం అలా చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు స్వభావరిత్యా ఎలాంటి వాడయినా అతని చుట్టూ ఉన్నవారు అతనిని మంచి మార్గంలో నడిపేవారు కాదు. అతని మీద శకుని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్ణుని చూసుకుని అతని అహంకారం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇక తమ్ముడయిన దుశ్శాసనుడు అన్నగారు ఏమి చెప్తే అది తప్పకుండా పాటిస్తాడు. ఇలా అతని చుట్టూ ఉన్న ఈ ముగ్గురివల్ల అతని పొగరు, అహంకారం మరింత గా పెరుగుతూ ఉన్నప్పుడు, వీరి సంరక్షణలో రాజ్యం సుఖంగా ఉండే అవకాశం లేదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి