తుమ్ము వచ్చి నప్పుడు చదవవలసిన శ్లోకం
ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యాన కేళికలకంఠీం
ఆగమనవిపినమయూరీ మార్యా మంతర్విభావయే గౌరీమ్
Deepika's neerajanam is discussing about the ideas of hindu mythology concepts and its inner meanings, puranams, itihasams, historical concepts, prabaandhamulu, sanskrit, telugu kavyams, telugu padyamulu, neeti kadhalu, intresting concepts and their symbolisms, predictions, interpretations aand many more knowledge filled posts.
తుమ్ము వచ్చి నప్పుడు చదవవలసిన శ్లోకం
ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యాన కేళికలకంఠీం
ఆగమనవిపినమయూరీ మార్యా మంతర్విభావయే గౌరీమ్
ఈరోజు మనం కుమార సంభవం లో చెప్పిన సూర్య ప్రార్ధన చుద్దాం!
అనుపమ దివ్యమూర్తి యను నమ్తియకాదు భవాష్టమూర్తులం
దును పరమూర్తి దాన, ప్రభతోడ జగజ్జన రాజి కెల్ల నిం
దనయము దాన దృష్టి యను నంతియకాదు త్రిలోచనాదిలో
చనమును దానయైన రవి చారు నిజ ప్రభ మాకు నీవుతన్
ఆర్ధముః
అనుపమ దివ్యమూర్తి = సాటి లేని అమానుష మైన ఆకారము గల, అనినంతియకాదు = అనినంత మాత్రమే కాదు భవ= శివుని అష్ట=ఎనిమిది మూర్తులందు=మూర్తులలో, తాను=తనే, పర= గొప్ప, మూర్తి=మూర్తి, ప్రభ= కాంతి, తోడన్=తో, జగత్=లోకమునందలి, జనరాజి= జనుల యొక్క సమూహం, ఎల్ల= అందరికి, ఇందున్= ఇందులో, అనయమున్= ఎల్లప్పుడు దాన= తన, దృష్టి= చూపు, యను నంతియకాదు త్రిలోచన= మూడు కన్నులలో,ఆది= మొదటి, లోచనము= కన్ను, యైన= అయిన, రవి= సూర్యుడు, చారు= అందమైన, నిజ ప్రభ = తనదైన మెరుగును మాకు= మాకు, నీవుతన్= ఇచ్చు గాక.
తాత్పర్యంః నిరుపమానం, అమానుషమయిన ఆకరము గల వాడనునంతమాత్రమే కాదు, శివుని ఎనిమిది మూర్తులలోను దానే శ్రేష్టమైన మూర్తి, తన వెలుగుతో లోకమునందలి ప్రాణికోటి కంతకును దానే యెల్లప్పుడును దృష్టి యనునంత మాత్రమే కాదు. ముక్కంటియైన శివునకు గల మూడుకన్నులలో మొదటి కన్నయిన సూర్యుడు మాకుతనదైన వెలుగును ఇచ్చును గాక!
సృష్టికర్త బ్రహ్మగారికి 32 గుణములు శివుని రూపమైన ఈశానుని ద్వారా, ఆదిశక్తి అనే మూలప్రకృతి ద్వారా సంక్రమించాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం!
మనకు పురాణాలలో నవదుర్గలు అని తొమ్మిది మంది దుర్గల అవతారాలు గురించి చెప్తారు. అయితే ఈ తొమ్మిది మంది నవదుర్గలు నిత్యజీవితంలో స్త్రీ మూర్తికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అంటే ఆ నవదుర్గలు దైనందిని జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మూర్తికి వారి వారి నిగూఢమైన శక్తికి ప్రతిరూపాలన్నమాట.
ఈ తొమ్మిది మంది నవదుర్గలు అలాగే ఆ తొమ్మిది మందిని నవదుర్గలతో పాటుగా ప్రతి నిత్యం జీవితంలో ఉన్న శ్రీమూర్తులకు ఉన్న సంబంధం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ రోజు బ్లాగులో మనం నేర్చుకుందాం!
నవదుర్గలకు సంబంధించిన స్పష్టమైన శ్లోకం ఈ కింద ఇచ్చాను చూడండి.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ
సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్
నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తితాః
ఉకక్తాన్యేత్యాని నామాని బ్రాహ్మణైవ మహాత్మనా
మన తెలుగు సామెతలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అని నానుడి కదా ! మరి ఇంతకూ ఆ మాట ఎక్కడనుండి తీసుకున్నారో చూద్దామా!
అక్కర పాటు వచ్చుఁ సమయంబున జుట్టములొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడలబండ్లును బండ్లనోడలున్
దక్కకవచ్చుఁచుండుట నిదానముగా దెలంప భాస్కరా!
అర్ధం: భాస్కరా = ఓ సూర్యాదేవా !, అక్కర = తగిన, పాటు = అవసరము, వచ్చుఁ = వచ్చిన , సమయంబునన్ = సమయంలో, చుట్టములు = బంధువులు, ఒక్కరొకరి = ఒకరు మరొకరి , మక్కువన్ = ఇష్టంగా , ఉద్ధరించుట = కాపాడుట , చూడగా = ఆలోచిస్తే , మైత్రికి = స్నేహమయునకు , యుక్తము= సరియైనది , ఏ =అవును, సుమీ = సుమా! ఒక్కటన్ = ఒకవేళ , నీటిలో = నీటిలోపల , ఓడలన్ = పడవలమీద , బండ్లును = బండ్లు , మెరకన్ = భూమిమీద , బండ్లన్ = బండ్ల మీద , ఓడలున్ = పడవలు , తక్కక = ఆగకుండా , వచ్చుఁచుండుట = రావడం, తలంపన్ = ఆలోచించగా , నిదానం= నిదర్శనము, కాదె= కదా !
తాత్పర్యం : ఈ ప్రపంచంలో చుట్టములు, బంధువులు ఒకరికి అవసరమయినప్పుడు మరొకరు చక్కగా సహాయం చేసుకుంటారు అది ఎంత సహజం అంటే నీటిపైన ఉన్నప్పుడు బండ్లు పడవలమీద , భూమిమీద ఉన్నప్పుడు అవే పడవలు బండ్లమీద ప్రయాణం చేస్తాయి కదా!
తెలుగులో అనేక నీతి శతకములు ఉన్నాయి. వానిలో మనం ఈ టపాలో భాస్కర శతకము లోని ఒక పధ్యము నెర్చుకుందాం!
శ్రీగలభాగ్యశాలి గడు జేరగవత్తురు తారుదారె దూ
రాగమున ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను
ద్యోగముచేసి రత్ననిల యుండనికాదె సమస్తవాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురు మూర్తిభాస్కరా
అర్ధంః మునిసన్నుత = మునిలచే మన్ననలు పొందే, మత్ = నాకు, గురుమూర్తి = గురురూపుడు అయినట్టి, భాస్కరా = ఓ సూర్య భగవానుడా! దూర = దూరము నుండి, ఆగమన= వచ్చుట వలన కలిగిన, ప్రయాసమునన్ = శ్రమకు, ఓర్చియున్= భరించి, నిల్వన్= నిలుచుటకు, ఉద్యోగము = ప్రయత్నము , చేసి , తారుదారె= తమకుతమే, అదటన్ = అనురాగంతో, శ్రీ = సంపదలు, గల =కలిగిన, భాగ్యశాలి = అదృష్టవంతుని, కడు= చాలా/ ఎక్కువగా, చేరగవత్తురు = దగ్గరకు చేరుతారు. సమస్త = సకలమైన, వాహినుల్ = నదులు, సాగరున్= సముద్రమును, రత్న= రత్నముల కోసం, ఎల్లన్ = సమీపించునది
తాత్పర్యం : ఎక్కడెక్కడో పుట్టిన అనేక నదులు రత్నములు కలిగి ఉన్నాడు అనే ఆశతో సముద్రమును చేరినట్లు ప్రజలుకూడా అనేక వ్యయ ప్రయాశలకు ఓర్చుకుని తమంతట తామే ధనవంతుల ఇంటికి వస్తూ ఉంటారు.
శ్రీనాధుడు రచించిన భీమఖండం లో గణపతిని స్తుతిస్తూ చెప్పిన పద్యం చాలా బాగుంది.
ఏనికమోముతార్పెలుక నెక్కినరావుతురాజు సౌరసే
నానియనుంగుబెద్దన వినాయకదేవుడు కర్ణతాళఝం
ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం
తానమహాఘనాఘన కదంబములన్ విదళించు గావుతన్
తాత్పర్యం: ఏనుగు ముఖం కలిగి, తన వాహనము ఎలుకను ఎక్కిన కుమారస్వామికి స్వయాన పెద్ద అన్న అయిన వినాయకుడు, తన పెద్ద పెద్ద చెవులను విసురుతూ ఎల్లప్పుడూ అత్యంత దట్టంగా అలుముకుంటున్న విఘ్నములు అనే కారు మబ్బులను చెల్లా చెదురుగా పోగొట్టును గాక.