గ్రంధములను ముందుగా గణపతిని ప్రార్ధించి తరువాత విషయము లోనికి వెళ్లడం అనేది ఒక సాంప్రదాయం.
అటువంటి అనేక గ్రంధములలోనుండి అనేక గణేశ ప్రార్ధనలను మనం తెలుసుకుందాం !
ఈ రోజు మన తెలుసుకుంటున్న ఈ పద్యం అల్లసాని పెద్దన రచించిన స్వరోచిషమనుసంభవం లోనుండి తీసుకున్నాం!
అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ బా
ల్యాంకవిచేష్ట దొండమున నవ్వలి చన్గబళింప బోయి యా
వంక గుచంబు గాన కహి వల్లభహారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గ జాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ !
అర్ధము:
అంకమున్ = ఒడిలో ; చేరి = కూర్చుని ; శైలతనయ = హిమాలయ పర్వత పుత్రి, పార్వతీ దేవి ; స్తనదుగ్ధములు= చనుబాలు; ఆనువేళ = త్రాగే సమయంలో ; బాల్యంక = బాల్యం వల్ల కలిగే ; విచేష్టన్ = ఆట లాగ ; తొండమున్ = తొండముతో ; అవ్వలి = అటుపక్క ఉన్న ; చన్ = చను భాగాన్ని ; కబళించ బోయి = పట్టుకోవాలని ప్రయత్నించగా ; ఆ వంకన్ = అటు ప్రక్కన ; కుచంబున్ = స్తనమును ; కానక = అందుకోలేక , కనిపించక ; అహివల్లభ = సర్పరాజు ను ; హారమున్ = హారముగా; కాంచి = చూసి ; వే = వేగంగా; మృణాళ= తామర ; అంకుర = లేత కాడలు ; అంటెడు = పట్టుకునే ; గజాస్యునిన్ = గజముఖము కలిగిన వినాయకుని ; అభీష్ట = కోరికలు ; సిద్ధికిన్ = తీరునట్లుగా ; కొల్తున్ = సేవించెదను.
తాత్పర్యం: