11, జూన్ 2020, గురువారం

యజ్ఞదత్తుడు - గుణనిధి

మనం ఇంతకు ముందు సప్త వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఆ వ్యసనములు ఉన్న వ్యక్తి తన  కోల్పోతాడు? అతనితో అతని తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు ఒక చిన్న కధ ద్వారా చూద్దాం!

పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ యజ్ఞదత్తుడు సదాచార పరాయణుడు, యాజ్ఞికుడు. అతనికి చాలాకాలమునకు ఒక కుమారుడు కలిగాడు. లేకలేక కలిగిన ఆ కుమారునికి గుణనిధి అని పేరుపెట్టారు. ఐతే విద్యార్థి దశలోనే గుణనిధికి  చెడు స్నేహములు వాని వల్ల చెడు వ్యసనములు కూడా అలవాటు అయ్యాయి. లేకలేక కలిగిన కుమారుడు అవ్వటం వలన అతని తల్లి అతనిని చాలా గారాబంగా చూసుకునేది. అయితే యజ్ఞదత్తుడు తన నిత్య కార్యక్రములలో, యజ్ఞములలో చాలా సమయం గడుపుటవలన అతనికి కుమారుడిని పట్టించుకునే సమయం ఉండేది కాదు. అయినా అతడు తన కుమారుని గురించి తన భార్యను అడిగి తెలుసుకునే వాడు. అయితే కొడుకు మీద ఉన్న మమకారం కారణంగా అతని భార్య అతనికి ఎల్లప్పుడూ వారి కుమారుడు చక్కగా అన్ని శాస్త్రోక్తంగా చదువుకుంటున్నాడు అని చెప్పేది. కానీ నిజానికి గుణనిధి ఎంతోకాలం ముందే సప్తవ్యసనములకు బానిస అయ్యాడు. అవి ఏమి తెలియని యజ్ఞదత్తుడు అతనికి ఒక మంచి కన్యను చూసి వివాహం కూడా జరిపించాడు.
ఒకనాడు యజ్ఞదత్తుడు స్నానమునకు వెళుతూ తన ఉంగరమును బల్లమీద పెట్టి వెళ్ళాడు. అది గమనించిన గుణనిధి ఆ ఉంగరమును తీసుకుని వెళ్ళి తన జూదంలో పందెంగా పెట్టి ఓడిపోయాడు. యజ్ఞదత్తుడు తన ఉంగరం విషయం మరచిపోయాడు. ఒకరోజు యజ్ఞదత్తుడు అనుకోకుండా ఒక వ్యక్తి చేతికి ఆ ఉంగరాన్ని చూసి అది అతనికి ఎలా వచ్చింది అని అడుగగా, ఆటను యజ్ఞదత్తునికి గుణనిధి గురించి చెప్పి, ఇంటిలోని సమన్లు అతను అమ్ముకొనక ముందే అతనికి బుద్ధి చెప్పుకొమ్మని ఎగతాళి చేసాడు. ఆ విషయాన్నివిన్నయజ్ఞదత్తుడు ఇంటికి వచ్చి అతని భార్యను నిలదీయగా ఆమె నిజమును చెప్పింది. 
ఆ వివరం మొత్తం తెలుసుకున్న యజ్ఞదత్తుడు తక్షణం తన కుమారునికి తర్పణములు వదిలేసాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి