15, డిసెంబర్ 2021, బుధవారం

వరరుచి వివాహం

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి కూడా తెలుసుకున్నాం కదా!  తరువాత వరరుచి ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం! 

విక్రమాదిత్యుని ఆస్థానంనుండి బయటకు వచ్చి, దేశాటన చేస్తూ వరరుచి కేరళ చేరుకున్నాడు. అలా గమ్యం లేకుండా తిరుగుతున్న అతనిని ఒక బ్రాహ్మణుడు అతని ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన వరరుచి అతని ఇంట్లో భోజనాన్ని స్వీకరించాలంటే కొన్ని షరతులు పాటించాలని చెప్పాడు. 

  1. అతనికి వడ్డించే భోజనం 1008 రకాల వంటకాలతో ఉండాలి, 
  2. ఆ ఆహారాన్ని తిన్న తరువాత  అతను నమలటానికి నలుగురు  కావాలి 
  3. ఆ భోజనం తిన్నతరువాత అతను నిద్రపోతున్నప్పుడు అతనిని నాలుగురు  తమ భుజాలమీద మోస్తూ ఉండాలి 
ఆ షరతులు విన్న బ్రాహ్మణుడు ఏమి సమాధానం చెప్పలేక పోయాడు. కానీ ఆ బ్రాహ్మణుని కుమార్తె ఆ నియమాలకు ఒప్పుకుని అతిధిని స్నానం చేసి రమ్మని పంపింది. వరరుచి భోజన్నని కి వచ్చినప్పుడు అతనికి ఆ బ్రాహ్మణుని కుమార్తె  భోజనం వడ్డించింది.  
  1. అల్లంవేసిన పెరుగు (కేరళ సంప్రదాయం ప్రకారం ఇది 1008 రకాల ఆహారం తో సమానం) 
  2. భోజనం ఆరగించిన తరువాత అతనికి ఆకు, వక్క, సున్నం, యాలకలు ఇచ్చారు నమలటానికి 
  3. అతను నిద్రపోవటానికి మంచం వేశారు. అతను నిద్రపోతున్నప్పుడు ఆ మంచానికి ఉన్న నాలుగు కాళ్ళు అతనిని మోస్తాయి. 
ఈ ఏర్పాట్లు చూసిన వరరుచి ఆ బ్రాహ్మణుని తెలివికి మెచ్చుకున్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ ఆలోచన తనది కాదు అని తమ కుమార్తెది అని చెప్పగా ఏంతో  జ్ఞానం ఉన్న వరరుచి అడిగిన ఆ షరతులను ఆమె అంత చక్కగా అర్ధంచేసుకున్నందుకు,  ఆమె తెలివితేటలు మెచ్చుకుని ఆమెను వివాహం చేసుకోవాలన్న ప్రస్తావన ఆ బ్రాహ్మణుని ముందు ఉంచాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెను వరరుచికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. 

ఇంతకూ వరరుచి భార్యకావలసిన ఆ పంచమ కన్య ఏమి అయ్యింది? ఆమె వరరుచి భార్య  కాగలిగిందా లేదా? తరువాతి టపా లో చూద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి