8, డిసెంబర్ 2021, బుధవారం

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభ లో ఉన్నా పండితుల అందరినీ పిలిచి రామాయణం లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఆ వెయ్యి వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు. అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానంమే దొరికింది. 40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ సంభాషణ విన్నవరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్
అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్

ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు. అతను

చెప్పిన 18రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి

1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఏందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు? ఆ వనదేవతలు ఆ చెట్టుమీద ఏం మట్లాడుకున్నారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం! 

2 కామెంట్‌లు:

  1. చాలా సంతోషం. మంచి విషయాలు చెభబుతున్నారు. శ్లోకం నిండా ఆక్షరదోషాలే. దయచేసి సరిచేయండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పును ఎత్తి చూపినందుకు ధన్యవాదములు. సరిచేసాను. దయచేసి గమనించండి.

      తొలగించండి