27, జనవరి 2022, గురువారం

చ్యవన మహర్షి - అశ్వినీదేవతలు

మనం ఇంతకు ముందు చ్యవన మహర్షి గురించి, అతని వివాహం సుకన్యతో జరగటం గురించి, సుకన్యకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాం కదా! 
మరి వారు సుకన్య కోరికను మన్నించారా లేదా తెలుసుకుందాం!
సుకన్య మాటలు  విన్న అశ్వినీదేవతలు ముసలివాడయిన చ్యవన మహర్షిని తీసుకుని దగ్గరలోని కొలనులో మునిగారు. కొంతసేపటికి ఆ కొలనులోనుండి  అత్యంత సుందరమయిన, ఒకేరూపం కలిగిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు అశ్వినీ దేవతలుగాను, ఒకరు తన భర్త చ్యవనుని గాను సుకన్య గ్రహించింది. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వారించమని వారు కోరగా, ఆమె తన భర్తనే తిరిగి వరించింది. 
 సహాయమునకు ప్రతిఫలంగా చ్యవన మహర్షి, యజ్ఞములలో దేవతలకు లభించే సురాపానం సేవించే అర్హతను వారికి కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. 
ఇప్పటి వరకు అశ్విని కుమారులను మనం అశ్వినీదేవతలు అని చెప్పుకున్నాం కదా! మరి వారికి దేవతలతో సమానంగా యజ్ఞములలో సురాపానం అర్హత ఎందుకు లేదు? వారి కి అలా అర్హతలేకుండా పోవటానికి వారు చేసారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి