17, జనవరి 2022, సోమవారం

కలికాలంలో మానవుని లక్షణాలు

 మనం ఇంతకుముందు అధర్ముడు గురించి, అతని వంశవృక్షం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు కలికాలంలో మానవుని లక్షణాల  తెలుసుకుందాం!

సన్యాసినో గృహాసక్తా గృహస్థా స్త్వవివేకినః 

గురునిందాపరా ధర్మధ్వజినః సాధువంచకాః 

ప్రతిగృహారతాః శూద్రాహః పరస్వహరణాదరాః 

ద్వయోహ్ స్వీకార ముద్వాహః శఠే మైత్రీ వదాన్యతా 

ప్రతిదానే క్షమాశక్తౌ విరక్తి కరణాక్క్షమే

వాచాలత్వం చ పాండిత్యే యశోర్ధే ధర్మసేవనం 

భావం : కలికాలంలో సన్యాసులకు గృహస్థధర్మమందు కోరిక ఉంటుంది, గృహస్తులు తెలివితక్కువగా వ్యవహరిస్తూ గురువులను నిందిస్తూ, మంచివారిని మోసం చేస్తూ,తాము చేస్తున్న పనే ధర్మమని అనుకుంటారు. తృప్తిలేని శూద్రులు ఇతరుల వద్దనుండి ధనమును దోచుకుంటారు. స్త్రీ పురుషుల పరస్పర అంగీకారం ఉంటే చాలు వివాహములు జరుగుతాయి. కోరి కోరి మోసగాళ్ళతో స్నేహం చేస్తారు. దానములు చేస్తూ వారిని వారే పొగుడుకుంటూ ఉంటారు. బలహీనులను ఈసడించుకుంటూ ఉంటారు. బాగా మాట్లాడకలిగిన వారే పండితులుగా, మేధావులుగా చెలామణి అవుతారు. వారు ఆచరించే అన్ని ధర్మములకు మంచి పేరు పొందటమే పరమావధి. 


విశ్లేషణ: ఇక్కడ మనం కొత్తగా చెప్పుకోవటానికి, విశ్లేషణ చేయటానికి ఏమి ఎక్కువ లేదు కదా! ఈ రోజులలో జరుగుతున్నదే మేధావులయిన మహర్షులు ముందుగానే ఊహించి చెప్పారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి