30, ఏప్రిల్ 2020, గురువారం

విభావసుడు - సుప్రతీకుడు

మనకు పురాణములలో, ఇతిహాసములలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి చాలా విపులంగా చర్చించాయి.
రామాయణంలో సోదరుల మధ్య నమ్మకం, ప్రేమ ఎలా ఉంటాయో చూపించారు, అలాగే  భారతంలో దాయాదుల మధ్య గొడవలు మొదలయితే అవి ఎంతవరకు వెళతాయో కూడా చెప్పారు. అటువంటి మరోకథ మహాభారతంలో ఉంది.  ఇద్దరు అన్నదమ్ములు అస్తి  కోసం గొడవపడుతూ ఆ గొడవను తరువాతి జన్మలో కూడా కొనసాగించారు.  మరి ఆ కధ ఎమిటో చూద్దామా!
విభావసుడు - సుప్రతీకుడు  అని ఇద్దరు అన్నదమ్ములు. వారికి పెద్దలనుండి చాలా ఆస్తి సంక్రమించింది.  తమ్ముడయిన సుప్రతీకుడు అన్నగారిదగ్గరకు వెళ్లి  ఆస్తి ని ధర్మంగా పంచమని కోరాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. ఇలా వారి గొడవ పెరిగి పెద్దది అయ్యి, విభావసుడు సుప్రతీకుని ఏనుగుగా జన్మించమని, సుప్రతీకుడు విభావసుని తాబేలువు కమ్మని ఒకరికి ఒకరు శాపం ఇచ్చుకున్నారు.
అలా శాపం ఇచ్చుకున్న కారణంగా కొంతకాలానికి ఇద్దరు ప్రాణములు విడచి ఆ శాపముల ప్రకారం ఒకరు ఏనుగు గాను మరొకరు తాబేలు గాను జన్మించి, పూర్వజన్మ లోని శతృత్వం కారణంగా జంతు జన్మలో కూడా ఆ శతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గొడవ కొన్ని వేల యేండ్లవరకు సాగింది.
మరి ఇంతకీ వీరి గొడవ ఎలా తీరింది? వీరి గొడవ తీరలేదు, వారు ఇద్దరూ  గరుడునికి  ఆహారం అయ్యారు. ఆ విషయం మరో టపాలో!!

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి