12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఇల జననం

వైవస్వతమనువు మనకు గల 14 మంది మనువులలో ఏడవ వాడు. ప్రస్తుతం మనం ఉన్న మన్వంతరమునకు అధిపతి.
ఇతను సూర్య భగవానుని కుమారుడు కనుక సూర్య వంశస్తుడు. శ్రద్దాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి వివాహం అయిన చాలాకాలం వరకు వారికి సంతానం కలుగ లేదు. కనుక వసిష్ఠ మహామునిని వారి పుత్ర ప్రాప్తి కోసం ఒక యజ్ఞం చేయమని కోరారు.
ఐతే శ్రద్ధాదేవికి పుత్రిక పై మమకారం కలుగుట  వల్ల ఆమె వసిష్టునకు చెప్పే సాహసం చేయలేక ఆ యజ్ఞములో హోతగా ఉండే వ్యక్తి వద్దకు వెళ్లి అతను యజ్ఞములో పుత్రికను కాంక్షిస్తూ ఆజ్యమును విడువమని కోరినది. దానికి అంగీకరించిన హోట అలాగే చేసెను.
ఆ యజ్ఞం చేసిన కొంతకాలమునకు శ్రద్దాదేవి గర్భందాల్చెను. తరువాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చెను. ఆ ఆడపిల్లకు ఇల అని నామకరం చేసారు.
కొంతకాలం తరువాత వైవస్వతమనువు వసిష్టుని వద్దకు వెళ్లి, " తమవంటి అత్యంత నిష్టా గరిష్టులు చేసిన యజ్ఞం, తమరు చేసిన సంకల్పమునకు విరుద్దంగా ఎలా ఫలితమును ఇచ్చినది?" అని అడిగెను.
జరిగిన విషయమును తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న వసిష్టుడు వైవస్వతమనువునకు విషయం చెప్పి, తనకు ఉన్న శక్తిచేత ఇలను పురుషునిగా మార్చగలను అని ఆమెను పురుషునిగా మార్చారు. పురుషునిగా మారిన ఇలను సుద్యుమ్నుడు అని పిలిచారు.


నా ఆలోచన:
మనకు ఈ కాలంలో ఉన్నట్లుగా బాలికల పట్ల వివక్షత ఆ రోజులలో ఉన్నట్లు కనిపించుట లేదు. పుట్టినది బాలిక అని తెలిసినా ఆమెకు నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు గానీ పుట్టగానే పుత్రుని బదులుగా పుత్రిక జన్మించినది అని గురు వసిష్టుల వద్దకు పరుగులు పెట్టలేదు.

మరి ఒక బాలికను బాలునిగా ఎందుకు మార్చారు?

ఇక్కడ తప్పు శ్రద్దాదేవిది. ఆమెకు ఆడపిల్ల కావాలని కోరిక ఉన్నపుడు ఆమె తన భర్తకు చెప్పి ఉండాలి. కనీసం ఆ యజ్ఞ భాద్యతను నిర్వహిస్తున్న వసిష్టునకు కూడా చెప్పలేదు. హోత  అంటే మన ఈకాలంలో వాడుక భాషలో చెప్పాలంటే ఒక సహాయకునికి చెప్పినది.
యజ్ఞ సంకల్పం చేయబడినది ఒక పుత్రుని కోసం, కనుక పుట్టిన వాడు పుత్రుడే అయి తీరాలి. కాని తల్లి కోరిక మీద పుత్రిక జన్మించినది. ఈ సమస్యకు పరిష్కారం లింగమార్పిడి.
మనకు ఇప్పుడు తెలిసిన లింగమార్పిడి విధానం మన కన్నా విపులంగా మన పూర్వులకు బాగా తెలుసు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి