11, మార్చి 2022, శుక్రవారం

విదుర నీతి - 12

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 

సంస్కృత శ్లోకం:

క్షిప్రం విజానాతి ఛిరంశ్రుణోతి, విజ్ఞాయ చార్ధం భజతేన కామాత్

నా సంపృష్ణో వ్యౌపయుంక్తే పరార్ధే, తత్ప్రజ్ఞానం ప్రధమం పండితస్య 

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

వినుటగురూక్త వాక్యమును వేగముజెందక సావధానత్

వినియదిమానసంబున జపించుటపిమ్మట తత్పదార్ధముం

గనుటయుదానగార్యమనఘంబుగజేయుట పృష్టుడయ్యుదా

మునవచియింపకుండుటివి ముఖ్యగుణంబులు కౌరవేశ్వరా!


భావం:

ఏ విషయమును అయినాసరే సులభంగా అర్ధం చేసుకునే గుణం, ఎంతసేపయినా ఎదుటి వారు చెప్తున్న విషయాలను శ్రద్ధగా వినే గుణం, కావాలనుకున్న దానిని కేవలం కోరికతో మాత్రమే కాకుండా ఉచితానుచితములు అలోచించి పొందాలని అనుకునే గుణం, ఇతరుల గురించిన విషయములు అవసరము లేనిదే అడుగని గుణం అనేవి పండితులకు ఉండే ముఖ్య గుణములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి