1, మార్చి 2022, మంగళవారం

విదుర నీతి - 10

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః

 సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే

యస్య సమ్సారిణీ ప్రజ్ఞా ధర్మార్ధావనువర్తతే

కామాదర్ధం వృణీతే యః స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఏ మనుజుండు పండితసమీడ్యుడు సంసృతిసాగరంబునన్

బాములనెన్ని జెందిన విపక్వమనస్కత ధర్మమర్ధమున్

గామముకంటె శ్రేష్టమని గాంచి మదిన్విడనాడకుండునో

యామనుజుండు తత్వవిదుడండ్రు జనంబులు మానవేశ్వరా! 

భావం:

ఎవరైతే తాను చేసే పనిని చలి, వేడి, భయము, అభిమానము, కలిమి, లేమి అనేవాటికి లోబడి తమ పనిని ఆపకుండా పని చేసుకుంటూ పోతారో వారిని, ఎవరి బుధ్ధి ధర్మార్ధములను కామము కంటే గొప్పది అని మనస్సులో గట్టిగా భావిస్తూ ఉంటాడో అటువంటి వానిని పండితుడు లేదా జ్ఞాని అని చెప్తారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి