6, మార్చి 2022, ఆదివారం

విదుర నీతి - 11

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యధాశక్తి చికీర్షంతి యధా శక్తి చ కుర్వతే

న కించిదవమన్యంతే పండితా భరతర్షభ

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

మీరినపనులకొడంబడ, కేరినినిందింపకాత్మ హితకార్యములన్

సైరించుకొనెడుపూరుషు డారయునైహిక సుఖంబు హస్తిపురీశా

భావంః

ఓ భరత వంశ మహారాజా! తన తెలివితో పరణితి కలిగి ఎవరయితే తన శక్తిని అర్ధం చేసుకుని ఆ శక్తికి తగిన పనులు చేస్తాడో, తను చేయగలిగిన ఏ పనిని అయినా చులకనగా అనుకోకుండా ఉంటాడో అతనినే పండితుడు లేదా జ్ఞాని అని అంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి