7, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీ రామ శతకము

శ్రీ రామశతకము తిరుకోవలూరు రామానుజస్వామి వారిచే రచింపబడినది. దీనిని వారు ఆ సీతారాములకు అంకితం ఇచ్చారు. వారు ఈ శతకమును మొదలుపెట్టేముందు శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత  శ్రీరామ చంద్రులవారికి నమస్కరించారు. వీరు ఈ శతకమును సీస, తేటగీతి పద్యములలో రచించినారు. ఈ శతక మకుటం "అందుకొనవయ్య శ్రీరామ వందనములు".

ఉ : శ్రీ రఘురామచంద్ర నిను చిత్తమునందలపోసి పొందరే
      సూరులు తొల్లి మోక్షమును సూరిజన స్త వనీయనిన్నునే
      మారక గొల్చి వేడెదరమాపతి మమ్ముల గూడబ్రోవనీ
      భారమెగాక నన్యులదె భక్తులపాలిటి పెన్నిదానమా

 సీ : శ్రీ రామ చంద్ర నా చిరు విన్నపము వినుము
                         మేదివాగ్దోషమో యెరుక పడదు
        ఎందు వ్యాకరణ సంబంధ దోషముకద్దో
                           ఛందస్సు రీతి పొందెందులేదో
         కవుల స్నేహములేని కతన తెల్యగలేను
                            సత్కావ్య పఠనంబు సలుపలేదు
          నీ నామ స్మరణంబు నానేరములబాప
                      సీస పద్యంబుల జెప్పినాడ

తే : తప్పులేవైన తెలియక చెప్పితేని
      తప్పుబట్ట వటంచు తలచియేదొ
      పలికి అంకిత మిడితి నీ పాదరేణు
     నౌటరామానుజునికృతి నందుకొనుము!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి