4, ఏప్రిల్ 2016, సోమవారం

విదుర నీతి

మన పెద్దలు మనకు అనేకములయిన ధర్మములను శాస్త్రములను చెప్పారు. వానిని అవగతం చేసుకొనుట ఈనాడు కష్ట సాధ్యం. దీనికి ముఖ్య కారణం అవి చెప్పబడిన కాలంలో రాచరిక వ్యవస్థ ఉండేది. కానీ ఈ రోజు మనం ఉన్నది గణతంత్ర వ్యవస్థ. కానీ కొంచెం అన్వయం చేసుకొనగలిగితే, ఆ శాస్త్రములలోని అనేక విషయములు మనకు నిత్య జీవన క్రమం అత్యంత ఉపయుక్తములుగా ఉంటాయి.
 అలా ఉపయుక్తం అయిన శాస్త్రములలో నీతి శాస్త్రం ఒకటి. దీనిని అనేక మంది అనేక గ్రంధములలో మనకు అందించే ప్రయత్నం చేసారు. అయితే వ్యాస భగవానుడు మహాభారతమును గ్రందీకరించే సమయంలో ఈ నీటిని విదురుని ద్వారా దృతరాష్ట్రునికి చెప్పించారు. ఈ మహాభారతమును ఆంధ్రీకరించే సమయమందు కవిత్రయంలోని తిక్కన ఆ భాగమును వదలి వేసినాడు.
ఆ వదలి వేసిన భాగమును "శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి" గారు తెలుగులో చక్కగా మూడు అస్వాసములుగ రచించినారు.
ఈ శీర్షికలో సంస్కృత శ్లోకం, దానికి  శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తెలుగు లో చెప్పిన పద్యం/ గద్యం - వాని భావం చెప్పే ప్రయత్నం చేస్తాను.
తప్పులుంటే తెలియ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి