24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆకూతి వంశం

స్వయంభు మనువు కు గల ముగ్గురు పుత్రికలలో వారికి ఆకుతి అనే పుత్రిక యందు అమితమైన ప్రేమ కలిగి ఉండుట చేత ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసే సమయంలో వారికి జన్మించిన పుత్రుని తనకు వంశోభివృద్ధి కొరకు అడిగాడు. దానికి ఆకూతి, రుచి ప్రజాపతుల ఇద్దరి అంగీకారం తీసుకుని వారి వివాహం జరిపించాడు.
వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు గా జన్మించాడు. స్వామివారిని విడచి ఎన్నటికీ ఉండలేని శ్రీమహాలక్ష్మి కూడా దక్షిణ గా జన్మించినది. ముందుగా స్వయంభువమనువుకు ఇచ్చిన మాట ప్రకారం రుచి, ఆకూతిలు యజ్ఞుని అతనికి ఇచ్చారు. కానీ దక్షిణని తామే పెంచారు. వారికి యుక్తవయస్సు రాగా వారికి వివాహం చేశారు.
యజ్ఞుడు, దక్షిణలకు 12 మంది పుత్రులు కలిగారు.
వారు
  1. తోషుడు 
  2. ప్రతోషుడు 
  3. సంతోషుడు 
  4. భద్రుడు 
  5. శాంతి 
  6. ఇడస్పతి 
  7. ఇధ్ముడు 
  8. కవి 
  9. విభుడు 
  10. వహ్ని/ అగ్ని 
  11. సుదేవుడు 
  12. రోచనుడు 
వీరు స్వయంభు మన్వంతరము సమయంలో తుష్టికారకులు అనే దేవతా గణములుగా ఉన్నారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి