11, సెప్టెంబర్ 2014, గురువారం

స్త్రీ వనము

మన పురాణములలో ఒక విచిత్రమైన వనం (తోట) గురించి చెప్పారు. అది స్త్రీవనం. ఆ వనంలోకి స్త్రీలు మాత్రమే  అడుగుపెట్టగలరు. ఒకవేళ పురుషులు ఎవరైనా అడుగుపెడితే వారు కూడా స్త్రీలు అయిపోతారు. ఎందుకు?

ఒక రోజు శివ పార్వతులు ఒక వనంలో క్రీడించుచుండగా, ఆ విష్యం తెలియని జ్ఞానవంతులైన, దిగంబరులయిన మునులు శివ దర్శనార్ధమై వచ్చారు. అప్పుడు ఆ సమయంలో దిగంబరులయిన మునులను చూసిన పార్వతీదేవి కించిత్ సిగ్గుపడి పక్కకు వెళ్ళినది. శివపార్వతుల ఏకాంతమును భంగం చేసాం అనే అపరాధ భావనతో ఆ మునులు అక్కడి నుండి నరనారాయణులు నిరంతరం తప్పస్సులో మునిగి ఉండే బదరికి వెళ్ళిపోయారు.
కానీ తమ ఏకాంతమునకు  ఇటువంటి ఒక విఘ్నం ఇకమీదట కలుగ కూడదనే పార్వతి మనోసంకల్పం తెలుసుకున్న మహాదేవుడు ఒక నిర్ణయం చేసాడు. ఆనాటి నుండి ఎవరైతే ఆ వనంలో అడుగు పెడతారో వారు స్త్రీలుగా మారిపోతారు.

ఎందుకు ?
ఎందుకంటే ఆ రోజు వచ్చినది దిగంబరులయిన మునులు. వారికి శరీర సంబందమైన ఏ విధమైన విషయంలోనూ ఆసక్తి ఉండదు. అటువంటి వారిని ఆ వనం లోనికి రావద్దు  అని చెప్పలేరు. అలాగని వారికి శరీరం గురించిన సిగ్గు వంటి భావనను ధరించమని భోదించలేరు. దీనికి మధ్యే మార్గం సహజంగా సిగ్గుతో ఉండే స్త్రీలయితే బాగుంటుంది అని. ఒకవేళ ఇటువంటి మునులు మరలా అక్కడకు వస్తే అక్కడ ప్రవేశించగానే స్త్రీలుగా మారిపోతారు. అప్పుడు స్త్రీకి సహజమైన సిగ్గు కారణంగా వారు వస్త్రములను ధరిస్తారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి