8, జనవరి 2016, శుక్రవారం

అసూయ

అరిషట్ వర్గములలో ఒకటయిన మత్సరం ఒక తల్లి తన సొంత కొడుకు వికలాంగుడు అవ్వటానికి కారణం అయింది అంతేకాక అదే కొడుకు చేత శాపం పొందేలా చేసింది.
కశ్యప ప్రజాపతి నవ బ్రహ్మలలో ఒకరైన మరీచి పుత్రుడు.  అతనికి 13 మంది భార్యలు ఉన్నారు. వారు దక్ష ప్రజాపతి పుత్రికలు.
వారిలో ఇద్దరు కద్రువ మరియు వినత. వీరిద్దరికీ సంతానం కలుగ లేదు. అనేకములయిన పూజలు వ్రతములు చేసిన తరువాత కశ్యప ప్రజాపతి వారికి ఎటువంటి సంతానం కావాలని అడిగాడు. అప్పుడు కద్రువ తనకు అమిత బలసంపన్నులు,దీర్ఘ దేహములు కలవారు అనేకులు సంతానంగా కావాలి అని కోరింది.  వినత కద్రువ పిల్లలకంటే బలవంతులయిన వారిని ఇద్దరిని కోరింది. కశ్యప ప్రజాపతి అలాగే అని చెప్పారు. కద్రువ అనేకములయిన గుడ్లను , వినత రెండు గుడ్లను పొందారు. కొంతకాలానికి కద్రువ పిల్లలు ఒక్కొక్కరు గుడ్డుల లోనుండి బయటకు రాసాగారు. వారిని చుసిన వినత తన బిడ్డలు ఇంకా బయటకు రాలేదని బెంగపెట్టుకుంది. ఒకరోజు ఆగలేక తనకు ఉన్న రెండు గుడ్లలో ఒకదాన్ని పగులగొట్టింది. అప్పుడు అందులోనుండి సగం దేహం ఏర్పడిన (ఉరువుల నుండి పైభాగం మాత్రమే ఏర్పడిన) బాలుడు బయటకు వచ్చాడు. అతని పేరు అనూరుడు అని పెట్టారు. అతను బయటకు రాగానే తన తల్లి చేసిన తొందరపాటు పనికి ఆమెను నిందించి, ఆమె ఎవరిని చూసి అసూయ చెందిందో ఆ సవతికి దాసిగా ఉండమని శపించాడు. అంతే కాకుండా ఆ రెండవ గుడ్డును జాగ్రత్తగా చూసుకొమ్మని, అందులోనుండి జన్మించబోయే తన తమ్ముడు అమిత పరాక్రమవంతుడు అవుతాడు మరియు తల్లిని దాస్యం  నుండి  రక్షిస్తాడు అని చెప్పాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి