25, ఆగస్టు 2014, సోమవారం

ఏకదంతుడు

విఘ్నరాజు వినాయకునికి ఏకదంతుడు అనే పేరుకూడా ఉన్నది. ఆ పేరు అతనికి ఎలావచ్చింది అనేవిషయం గురించి పురాణములలో అనేకవిధాలుగా చెప్పబడింది. 

1. బ్రహ్మాండ పురాణం:
వేయిచేతులు కలిగిన కార్త్యవీర్యార్జునుని సంహరించిన తరువాత పరశురాముడు ఆదిదంపతులైన శివపార్వతుల ను దర్శించుకొనుటకు కైలాసపర్వతానికి వచ్చాడు. ఆ సమయంలో ఏకాంతంలో ఉన్న పర్వతిపరమేస్వరులు తమ ఏకాంతమునకు ఎటువంటి భంగం కలుగకుండా చూడమని బాలగణపతిని నియమించారు. 

పరశురాముని రాకనుగమనించిన వినాయకుడు అతనికి నమస్కరించి ఈ సమయంలో ఆదిదంపతుల దర్శనం కుదరదు అని చెప్పారు. మహర్షి పరశురాముడు అప్పటికే భూమండలం అంతా 21సార్లు తిరిగి క్షత్రియుల నాశం చేసి ఉన్నారు. అతనిలో కొంత గర్వంప్రవేసించి ఉన్నది. ఆ సమయలో అతనికి వినాయకుని మాటలు నచ్చలేదు. ఈ బాలకుడు తనను ఎదిరిస్తున్నాడు అని భావించారు. మహాదేవునకు భక్తుడనైన నన్ను ఇలా ఆపివేసే అధికారం నీకు ఏడూ అని వినాయకుడిని ఎదిరించాడు. అతనిలోని గర్వమును గమనించిన వినాయకుడు ఆ గర్వమును తొలగించాలని భావించాడు. ఎట్టి పరిస్థితులలోనూ పరశురాముని లోపలకు అనుమతించలేనని స్పష్టంచేసాడు. కోపగించిన పరశురాముడు పరమశివప్రసాదమైన తన పరశువును వినాయకుని మీద ప్రయోగించాడు. అతనికి వినాయకుడు కూడా అతనికి ఆయుధములతో సమాధానం చెప్పటం ప్రారంభించారు. వారిద్దరి మద్య జరిగిన యుద్ధంలో పరశురాముడు తన పరశువుతో వినాయకుని ఎడమవైపు దవడమీద చేసిన దాడి వల్ల అతని ఎడమ దంతం విరిగిపోయినది. 
బయట జరుగుతున్న ఈ కోలాహలం విన్న శివపార్వతులు బయటకు వచ్చారు. తన పుత్రుని విరిగిన దంతమును చూసిన పార్వతీదేవి ఆగ్రహించి పరశురాముని శపించదలచినది. ఆ ఆపదను ముందే గమనించిన నారద మహాముని పార్వతిమాతను వారించారు. ఈ పొరపాటు జరుగుటకు కారణం పరశురామునికి వినాయకుడు ఆదిదంపతుల పుత్రుడు అని తెలియక పోవుట  అని, విరిగిన ఈ వినాయక దంతం మునుముందు కాలంలో ఎన్నో తరములకు, సకల మానవకోటికి ఉపయోగపడుతుంది అని చెప్పి పార్వతిదేవిని సంతోషపరచారు. 

కాలాంతరంలో ఆ దంతంతోనే విఘ్నేశ్వరుడు వ్యాసభగవానుడు చెప్తూ ఉండగా మహాభారత ఇతిహాసాన్ని రచించారు. 
      
2. వేరే పురాణములలో వినాయకుడు యుధం చేసినది శనిదేవుడు అని చెప్పబడినది.

3. వినాయకుడు ముషికాసురుని నియంత్రించే సమయంలో తన దంతమును వినియోగించారు అని మరొక కధ  ప్రచారంలో ఉన్నది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి