17, ఆగస్టు 2014, ఆదివారం

మరుత్తులు

కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో దితి, అదితి అని ఇద్దరు. దితికి పుట్టిన
హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులను శ్రీమహావిష్ణువు (నరసింహ,
వరాహ అవతారములలో) సంహరించాడని తెలిసి చాలా దుఃఖితురాలయ్యింది.
ఆమె కశ్యపప్రజాపతి వద్దకు వెళ్లి ప్రణమిల్లి, తనకు ఈసారి జన్మించే కుమారుడు
 ఇంద్రుణ్ణి జయించగల వాడు కావాలని కోరినది. అందుకు కశ్యపుడు విష్ణువు 
గురించి 1000 సంవత్సరములు నియమ, నిష్టలు తప్పకుండా తపమాచరిస్తే 
ఇంద్రుణ్ణి జయించగల కొడుకు పుడతాడని బదులిచ్చాడు. ఆమె నియమంతో, 
నిష్ఠతో తొమ్మిది వందల తొంబై సంవత్సరాలు  తపస్సు చేసింది. కొంత కాలానికి 
దితి గర్భం దాల్చింది. 
దితి గర్భం గురించి, ఆమెకు కలుగబోయే శక్తివంతమైన పుత్రుని గురించి తనతల్లి 
అదితి ద్వారా విన్న ఇంద్రుడు తన పినతల్లి దితివద్దకు వచ్చి ఆమెకు సేవలు చేస్తాను 
అని ఆమె దగ్గర చేరాడు. అతని దృష్టి సదా ఆమె ఎప్పుడైనా నియమం 
తప్పుతుందేమో అనే ఉంది.ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 
ఒక రోజు ఆమె మధ్యాహ్న సమయం లో తల విరబోసుకొని గడప వద్ద నిద్రపోతూ ఉంది. 
ఆ సమయములో కాళ్ళకు ఆమె విరబోసుకొన్న జుత్తు తగులుతూ ఉంది. ఇది 
చూసి ఇంద్రుడు ఆమె అపవిత్రురాలయ్యిందని తెలుసు కొని సూక్ష్మ రూపములో ఆమె 
గర్భములోకి ప్రవేశించించి గర్భస్థ శిశువుని ఏడు ముక్కలుగా నరికాడు. లోపలి శిశువు 
"నన్ను నరికివేయ వద్దు " అంటూ ఏడుస్తూ ఉంది.. ఇంద్రుడు " మారుదో మాదదస్యేసి 
(ఏడవకు ఏడవకు) " అంటూ నరకుతున్నాడు. ఇంతలో దితికి మెలుకువ 
వచ్చింది. తన గర్భంలో జరుగుతున్న సంగతిని గ్రహించింది. "ఇంద్రా! నా బిడ్దను 
చంపకు!" అని అంది.  ఆమెకు తన బిడ్డని చంపుతున్న ఇంద్రునిపై కోపం వచ్చింది. 
ఆమె ఇంద్రుడిని శపించింది. 
"ఇంద్రా! నీ త్రైలోక్య ఆధిపత్యం కోసం నవ్ నా గర్భస్థ శిశువు పై దాడికి పునుకున్నావు 
కనుక నీకు ఆ ఆధిపత్యం సదా కంటకప్రాయమై, నీకు ప్రశాంతంగా పరిపాలించే పరిస్థితి 
ఉండకుండా ఉండు గాక!" ఇంద్రుని శపించిన తరువాత కూడా ఆమె కోపం తగ్గలేదు. 
"ఇంద్రునికి ఈ సమాచారాన్ని చెప్పి నా బిడ్డను సంహరించమని చెప్పినది అదితి కనుక 
మరుజన్మలో ఆమె కన్నుల ముందే తన పుత్రులను చంపుతున్న ఏమి చేయలేని 
నిస్సహాయ స్థితిలో నేను ఎలా ఉన్నానో అలాగే ఆమె కూడా తన పుత్రులను పోగొట్టుకుంటుంది!
(కాలాంతరం లో అదితే దేవకిగా జన్మించినది అని చెప్తారు, ఆ సమయం లో ఆమె తన 6 గురు 
పుత్రులను తన అన్న కంసుడు చంపుట చూడవలసి వచ్చినది)
 ఇంద్రుడు" తల్లీ! నీవు అపవిత్రురాలివైనావు, కాబట్టి నేను శిశువుని నరికివేయ గలిగాను" 
అని అన్నాడు.
ఆ సమయానికి అక్కడకు వచ్చి పరిస్థితి చూసిన కశ్యప ప్రజాపతి, దితి కోపాన్ని తగ్గించుకోమని, 
ఒక్కపుత్రుడికి బదులుగా ఇంద్రుదిసు నరుకబడిన 7 ముక్కలు 7 రు పుత్రులుగా జ
న్మిస్తారు అని ఉరడించాడు. 
ఇంద్రునిచే "మారుదః" అనిపించుకున్నారు కనుక వారిని "మరుత్తులు" అని పిలిచారు.  
ఒకరు బ్రహ్మ లోకములో, ఒకరు ఇంద్రలోకములో, ఒకరు అంతరిక్షములో, మిగిలిన నలుగురు 
నాలుగు దిక్కుల వాయువుకి అభిమాన దేవతలుగా సంచరించి, ఇంద్రునితో కలిసి ఉంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి