29, మార్చి 2019, శుక్రవారం

రామాయణం - గాయత్రి మంత్రము

రామాయణం ని వాల్మీకి మహర్షి రచించినప్పుడు దానికి "సీతాయా చరితం మహత్" "పౌలస్య వధ" అని కూడా పేరు పెట్టారు. అంతే కాకుండా మన పెద్దలు ఈ  రామాయణం నకు గాయత్రీ మంత్రమునకు గల అవినాభావ సంబంధం అనేక రకములుగా చెప్పారు.
వారు చెప్పిన అనేక రకములయిన సంబంధములలో కొన్ని ఇక్కడ చెప్పుకుందాం!

  1. సంఖ్య : రామాయణం లోని శ్లోకముల సంఖ్య 24000, గాయత్రి మంత్రము లోని అక్షరముల సంఖ్య  24. కనుక ఈ గాయత్రి మంత్రములలోని ఒకొక్క అక్షరంతో ఒకొక్క వెయ్యి శ్లోకములను వ్రాసి , ఆ మంత్ర అర్థమును నిబంధించారని మన పెద్దలు చెప్తారు. అలాగే  గాయత్రీ రామాయణం అను పేరున రామాయణము 24 శ్లోకములతో లోకములో ప్రసిద్ధి లో ఉన్నది. 
  2. రామాయణం లో మనకు 7 కాండలు ఉన్నాయి. అవి 
బాలకాండ 
అయోధ్య కాండ 
అరణ్య కాండ 
కిష్కింద కాండ 
సుందరకాండ 
యుద్ధ కాండ 
ఉత్తర కాండ 

వీనిలో ఒక్కొక్క కాండ గాయత్రి మంత్రం లోని ఏ భాగాన్ని సూచించునో ఇప్పుడు చూద్దాం! 

  • బాలకాండ : తత్స వితృ 
  • అయోధ్య కాండ : వరేణ్య 
  • అరణ్య కాండ : భర్గో 
  • సుందరకాండ : దేవస్య 
  • యుద్ధ కాండ : ధీమహీ 
  • ఉత్తర కాండ : ధీయోయోనః  
3. గాయత్రి మంత్రమునకు ఆదిమంత్రము, మహామంత్రము అని పేరు. 
     అలాగే రామాయణమునకు ఆది కావ్యము, మహా కావ్యము అని పేరు 
4. గాయత్రి మంత్రమునకు మహర్షి విశ్వామిత్రుడు 
    రామాయణమున శ్రీరామునకు సర్వశాస్త్రములను నేర్పించింది కూడా విశ్వామిత్రుడే 
5. గాయత్రి మంత్రాధిదేవత సవిత 
    శ్రీ రాముని వంశమే సూర్య వంశము. 
6. గాయత్రి మంత్రమునకు ముఖము అగ్ని దేవుడు 
    శ్రీ రామావతారమునకు అగ్నియే మూలము 
7. గాయత్రి మంత్రమునకు హృదయం శ్రీవిష్ణువు, శిఖ రుద్రుడు 
    రామాయణం లో శ్రీ విష్ణు అవతారమయిన శ్రీరాముడు హృదయము, రుద్రుని అంశ కల్గిన            హనుమంతుడు రామాయణమునకు శిఖ వంటి వాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి