26, ఫిబ్రవరి 2015, గురువారం

దేవుడు నరునిగా అవతరించాడా? - అనే ఒక ప్రశ్నకు సమాధానం

దేవుడు నరునిగా అవతరించాడా? 

అనే ఒక ప్రశ్నకు సమాధానం గా ఈ టపా రాస్తున్నాను. 

దేవుడు మనిషిగా అవతరించాడో లేదో మనం ఇప్పుడు ఇక్కడ కుర్చుని చెప్పలేము. మీరు చెప్పిన ధార్మిక గ్రంధముల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి అనే నినాదంతో నేను ఏకీభవిస్తున్నాను. మీరు ఉటంకించిన భగవద్గీత శ్లోకములు మీ భావమునకు మంచి సామర్ధ్యమును తెచ్చి పెట్టాయి. 
మీరు చెప్పిన శ్లోకములకు మీకు అర్ధం మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 
  అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ:
               పరం భావ మజానంతే వమామయ మనుత్తమం. గీత:7:24

ఈ శ్లోకం లో చెప్పిన "మాం" అనే పదమునకు అర్ధం చెప్తారా? "మాం" అంటే సంస్కృతం లో అర్ధం "నేను" అని. అంటే శ్రీకృష్ణుడు తనగురించి తాను భగవంతునిగా చెప్పుకుంటున్నాడు. 

మీరు చెప్పిన అర్ధం ఇప్పుడు సరిగా చూడండి. "నా పూర్తి స్వభావం తెలియని మందబుద్దులు నన్ను కేవలం పంచభూతాత్మకమైన శరీరంగా తలుస్తారు" అని. అంతే కానీ నీను ఎప్పుడూ  అవతరించలేదు అని కాదు. మీకు సమాధానం దొరికినది అని భావిస్తున్నాను.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి