7, మే 2020, గురువారం

వసిష్టుడు- పుత్రశోకం

మానవుని జీవితంలో అత్యంత బాధాకరమయినవి అష్ట కష్టములు అని చెప్పుకున్నాం కదా! అయితే వాతన్నేంటిని మించిన అత్యంత భాదాకరామయిన విషయం తన సొంత బిడ్డలను పోగొట్టుకోవటం. ఒక బిడ్డను పోగొట్టుకుంటేనే అంత కష్టం అయితే, వందమంది కొడుకులను ఒకేరోజు పోగొట్టుకుంటే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతమో కదా!!!
ఇంతకీ ఇంతటి కష్టం ఎవరికీ వచ్చింది? ఆ భాదను వారు ఎలా భరించారు? ఆ బాధనుండి ఎలా బయట పడ్డారు? ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం!

వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ల మధ్య స్పర్ధలు పెరుగుతున్న సమయంలో శాపవశాత్తూ రాక్షసుడిగా మారిన కల్మాషపాదుడు వశిష్ఠుని పుత్రులు శక్తి మొదలయిన వారు అయిన వందమందిని ఒకే రోజు చంపేశాడు. దానికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఏం  చేసాడు?
తన తపో బలం ఏంటో ఉన్నా , ఆ కల్మాషపాదుడిని శపించలేదు, తన పుత్రులను బ్రతికించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధిని తప్పించుకొనుట సాధ్యం కాదు అని అనుకున్నాడు. కానీ తన పుత్రులు మరణించిన భాధను భరించలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు మొత్తంగా ఐదు సార్లు ఆ ప్రయత్నం చేసాడు. ఎంత మహర్షి అయినా, బ్రహ్మర్షి అయినా పుత్ర వియోగ బాధ ను భరించుట కటం కదా!

మరి ఇంతకీ అతను ఆ బాధనుండి ఎలా బయట పడ్డాడో తెలుసా? అతను  అత్యంత బాధాకరమయిన స్థితి లో ఉన్న వశిష్ఠుడు తన ఆశ్రమములో గర్భంతో ఉన్న శక్తి భార్య అయిన తన కోడలిని చూసాడు. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంలో ఉన్న శిశువు వేదములు చదవటం అతనికి వినిపించింది. ఆ కడుపులోని బిడ్డ స్వరం చక్కని శక్తి మహర్షి స్వరంలా వినిపించ సాగింది. ఆ బిడ్డ కడుపులో ఉండగా శక్తి ఉచ్చరించే వేదములను  ఆ బిడ్డ విన్నాడు. ఇప్పుడు అదే వేదములను చక్కని స్వరంతో ఉచ్చరిస్తున్నాడు. ఆ చక్కని స్వరం విన్న వశిష్ఠుని మనస్సు  ఊరట చెందింది.

అత్యంత బాధ కలిగినప్పుడు సామాన్య మానవుని నుండి మహర్షి, బ్రహ్మర్షులయినా ఒకేరకంగా ఆలోచిస్తారు. కానీ ఆ బాధను మరచిపోయే మార్గం తెలుసుకుని, ఆ కారణంకోసం తన జీవితాలను అంకితం చేస్తే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి