1, మే 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 2

రామాయణములో అత్యంత ముఖ్యమయినది, ఎంతో ప్రాముఖ్యం కలిగినది సుందరకాండ. ఆ సుందర కాండ ముఖ్య ఉద్దేశ్యం హనుమంతుడు సీతాదేవిని లంకలో వెతుకుట. ఆ ఘట్టమును అనేక కవులు అనేక రకములుగా వర్ణించారు. అటువంటి వర్ణనలలో ఉన్న ఒక సీస పద్యం మల్లెమాల రామాయణం లోనిది మీకోసం!
ఈ పద్యమునకు సందర్భం : హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం ఎంత ఏకాగ్రతగా, మిగిలినవారికి తన ఉనికి తెలియకుండా ఉండేలా ఎంత జాగ్రత్తగా మసలుకుంటూ వెతుకుతున్నాడో చెప్తున్న సందర్భం

కడునేర్పు తో పాలు కాజేయ వంటింట 
మెల్లగా తారాడు పిల్లివోలె 
కటిక చీకటివేళ కలవారి గృహములో 
దూరి యన్వేషించు దొంగవోలె 
బొక్కలోపల గూడ నెక్క డేమున్నదో 
నక్కి గాలించు నక్కవోలె 
అతినిగూఢ మ్మైన ఆత్మతత్వమ్మును 
తనలోన వెదకెడు తపసివోలె 

ఇంత మంచి అచ్చ తెలుగు పద్యమునకు విడిగా భావం చెప్పటం అవసరం లేదు కదా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి