29, జూన్ 2020, సోమవారం

దశకంఠుడు నిజంగా అంత చెడ్డవాడా?

మనం ఇంతకూ ముందు రాక్షసుల గురించి, కైకసి కి విశ్రవసునివలన కలిగిన సంతానం గురించి తెలుసుకున్నాం కదా!అలాగే ఒక తల్లి తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆమె అసూయను పిల్లల ముందు ప్రదర్శిస్తే, అది ఆ పిల్లల మనస్సు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం!

ఒకరోజు లంకాధిపతిగా ఉన్న వైశ్రవణుడు తన పుష్పక విమానంలో తన తండ్రి, విశ్రవసుని కలవటానికి వచ్చాడు. అతనిని అక్కడ అంత  వైభోగం లో చూసిన కైకసికి అసూయ కలిగింది. ఆమె తన పెద్దకుమారుడు అయిన దశకంఠుని వద్దకు వెళ్లి, అతనిని కూడా అతని సోదరుని వలే గొప్పవానిగా ఉంటె చుడాలీని ఉన్నది అని కోరుకున్నది. అంటే కాక అతను అనుభవిస్తున్న స్వర్ణలంక నిజమునకు తమదే అని చెప్పింది. ఆ మాటలు విన్న దశకంఠునికి, తన సవతి సోదరుని మీద విపరీతమయిన అసూయ, ద్వేషములు కలిగాయి.
అప్పటివరకూ అతనికి తన సవతి సోదరుని మీద అంత కోపం, ద్వేషం ఉన్నట్లు ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. పిల్లలకు తమ తల్లి మాట  మంత్రం లా పని చేస్తుంది. తన తల్లి అలా అతనిని, తన సవతి సోదరునితో పోల్చి మాట్లాడటం, అతను అనుభవిస్తున్న సౌకర్యములు నిజానికి అతనికే సంబందించినవి అని చెప్పి బాధపడటం అతని మనస్సును తీవ్రంగా ప్రభావితం చేసింది. అది అతనిలో కోపం, అసూయ, ద్వేషం మొదలయిన వికారములకు కారణం అయ్యింది.
 ఎలా అయినా తల్లి కోరికను తాను తీర్చుతాను అని చెప్పాడు. ఆమె కోరికలు అన్ని సిద్దించాలి అంటే కేవలం తపస్సు ఒక్కటే మార్గం అని తెలుసుకున్న అతను తన తమ్ముళ్లను కూడా తన వెంట తీసుకుని గోకర్ణము నకు వెళ్లి అక్కడ బ్రహ్మదేవుని గురించి ఘోరమయిన తపస్సు చేశారు.
మరి ఆ తపస్సు ఏమయ్యింది? వారు ఏమి వారములు కోరుకున్నారు అని తరువాతి టపాలో చెప్పుకుందాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి