6, జూన్ 2020, శనివారం

రాక్షసులు లంకను వదలి ఎందుకు వెళ్లారు?

మనం ఇంతకు ముందు లంక ను స్వర్ణలంక అని ఎందుకు అంటారో తెలుసుకున్నాం కదా! ఆ లంక ముందుగా రాక్షసుల నివాసస్థలంగా ఉండి ఆ తరువాత అది వైశ్రవణునికి నివాసంగా ఉంది. అయితే వైశ్రవణుడు అక్కడికి చేరే సమయానికి లంక కాళీగా ఉంది. మరి అతనికంటే ముంది  ఉన్న ఆ రాక్షసులు లంకను వదిలి ఎక్కడకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు?
రాక్షస గణములు ప్రగటానికి కారణం మాల్యవంతుడు,మాలి, సుమాలి అని చెప్పుకున్నాం కదా!  వారి వరముల కారణంగా మాల్యవంతుడు, మాలి, సుమాలి సోదరులు గర్వం పెరిగి,   సర్వ లోకములను వేధించటం మొదలుపెట్టారు. దేవతలు దిక్కులేనివారు అయ్యారు. దేవతలు కైలాసమునకు వెళ్లి శివునకు మొరపెట్టుకున్నారు. కానీ పరమేశ్వరుడు సుకేశుని మీది జాలి, ప్రేమ కారణంగా  కుమారులను సంహరించటానికి సుముఖం  కాలేక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని చెప్పాడు.
వారి మొరలు  విష్ణువు దేవతలకు అభయం ఇచ్చాడు. ఆ విషయం ఆ ముగ్గురు అన్నదమ్ములకు చారుల  ద్వారా తెలిసింది. అప్పుడు పెద్దవాడయిన మాల్యవంతుడు విష్ణువు ఇంతకు ముందు కూడా రాక్షసులను చంపి ఉన్నాడు కనుక ఏమి చెయ్యాలి అని తన తమ్ముళ్లను అడిగాడు. దానికి ఆ తమ్ముళ్లు విష్ణువు అలా  మనలను చంపుతాను అని చెప్పుటకు కారణం ఆ దేవతలు కనుక ముందుగా ఆ దేవతలను నాశనం చేయాలి అని చెప్పారు. ఆ మాటలను అంగీకరించిన మాల్యవంతుడు వెంటనే దేవతల మీద యుద్ధం ప్రకటించారు.
అనేక రాక్షస సైన్యమును వెంటపెట్టుకుని వీరు స్వర్గం మీద దాడి చేశారు. రాక్షసులు దండెత్తి వస్తున్నారని తెలిసిన దేవతలు పారిపోయారు. ఈ విషయాలు అన్ని తెలుసుకున్న విష్ణువు తన వాహనం గరుడుని పై,సకల ఆయుధాలను ధరించి బయలుదేరాడు. యుద్ధభుమిని చేరే సమయానికి, గరుడుని రెక్కల వేగానికి ఆ యుద్ధభూమీలోని రాక్షసులు ఎగిరిపోయారు, వారి ఆయుధాలు చెల్లాచెదురు అయిపోయాయి. ఎగిరిపోగా మిగిలిన రాక్షసులు విష్ణువు మీద యుద్ధం చేయనారంభించారు. వారు ప్రయోగించిన అన్ని బాణములు విషుమూర్తి దేహంలో కలిసిపోతున్నాయి. విష్ణుమూర్తి కూడా వారిపై బాణముల వర్షం కురిపిస్తున్నాడు.
ఆ బాణ వర్షమునకు ఎందరో రాక్షసులు నేలకూలారు. కొందరు పారిపోయారు. ఆ విజయమునకు సూచనగా విష్ణువు తన పాంచజన్యమును పూరించాడు.  ఆ పాంచజన్య శబ్దమునకు రాక్షసుల వాహనములకు కట్టిన జంతువులు పారిపోయాయి. అలా వారి యుద్ధం ఓడిపోతున్న ఉక్రోషంతో సుమాలి తిన్నగా వెళ్లి విష్ణువుతో తలపడ్డాడు.  అలా మళ్ళీ కొందరు రాక్షసులు విష్ణువు చుట్టూ చేరి యుద్ధం చేయసాగారు. అప్పుడు విష్ణువు ఒక బాణంతో సుమాలి సారధిని సంహరించాడు. అప్పుడు అతని రధమును ఆ గుఱ్ఱములు దూరంగా లాక్కుని వెళ్లిపోయాయి. అప్పుడు మాలి యుద్దానికి వచ్చాడు. మాలి భయంకరంగా యుద్ధం చేసాడు. అయితే అతని బాణములు ఏవి విష్ణువును భాధించలేదు. అప్పుడు మాలి తన గధతో గరుడుని ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బను తట్టుకోలేక గరుడుడు అకస్మాతుగా కదిలాడు. గరుడుని ఆధీనంలోకి తెచ్చుకున్న తరువాత విష్ణుమూర్తి ఆ మాలిని సంహరించటం కోసం సుదర్శనమును ప్రయోగించాడు. ఆ సుదర్శనం మాలి కంఠమును నరికి వేసింది. ఆ దృశ్యమును చుసిన రాక్షసులు భయపడి పారిపోయారు.
అలా పారిపోతున్న రాక్షసులను విష్ణువు గరుడుని మీద వెంబడించాడు. అలా వెంబడిస్తున్న విష్ణువును మాల్యవంతుడు ఎదిరించాడు. అల ఎదిరించిన మాల్యవంతుడిని గరుడుడు తన రెక్కలతో కొట్టాడు. ఆ దెబ్బకు మాల్యవంతుడు దూరంగా ఎగిరిపోయాడు. అలా మాల్యవంతుడు ఎగిరిపోవటం చూసిన సుమాలి అతని సైన్యమును తీసుకుని, లంకకు వెళ్లి , అక్కడ వారి కుటుంబాలను కూడా తీసుకుని పాతాళమునకు వెళ్లి దాక్కున్నారు. మాలి చనిపోవటం, మాల్యవంతుడు దూరంగా ఎగిరి పోవటంతో రాక్షసులకు సుమాలి రాజుగా , రాక్షస రాజ్యమును స్థాపించి పరిపాలించాడు.
అలా ఖాళీ అయినా లంకను తనకు నివాస యోగ్యంగా మార్చుకొమ్మని విశ్రవసుడు  తన కుమారుడు వైశ్రవణునికి చెప్పాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి