2, జూన్ 2020, మంగళవారం

రాక్షస సంతాన వృద్ధి

ఇంతకుముందు మనం రాక్షసులకు పిల్లలు ఎలా వెంటనే కలుగుతారు,  వారు ఎందుకు తమ తల్లి వయస్సు కలవారు అవుతారు అని తెలుసుకున్నాం కదా!
పార్వతీదేవి, శివుని కరుణా కటాక్షామముల వల్ల పెరిగి పెద్దవాడయిన సుకేశునికి గ్రామణి అనే గంధర్వుడు తన కుమార్తె దేవవతిని ఇచ్చి వివాహం జరిపించాడు.  వారికి మాల్యవంతుడు, మాలి, సుమాలి అనే ముగ్గురు కుమారులు కలిగారు. వీరు ముగ్గురూ మేరుపర్వతం వద్ద బ్రహ్మగురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు వారిని వరములు కోరుకొమ్మన్నాడు. 
వారికి అత్యంత బలం కావాలని, వారి మధ్య ఎన్నటికీ విరోధం కలుగకుండా ఉండాలని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ఆ వరములు ఇచ్చారు. తరువాత వారు విశ్వకర్మదగ్గరకు వెళ్లి తమకు నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని అడిగారు. దానికి విశ్వకర్మ స్వర్ణలంక ని తమ నివాసంగా చేసుకోమని చెప్పాడు.   
తరువాత వారు ఒక గందర్వ కాంత నర్మద యొక్క ముగ్గురు కుమార్తెలు సుందరి, కేతుమతి, వసుధలను వివాహం చేసుకున్నారు.   వారికి అనేకమంది సంతానం కలిగారు. వీరి వలననే రాక్షస సంతానం వృద్ధి చెందింది. 
రావణాసురుని తల్లి అయిన కైకసి, సుమాలి పుత్రిక. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి