22, సెప్టెంబర్ 2014, సోమవారం

శుకమహర్షి జననం

శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు.  శుక మహర్షి విచిత్రమైన ఆకారం కలవాడు. తల వరకు చిలుక, శరీరం మానవ దేహం.
శుక మహర్షి కూడా వేద వ్యాసుని వలే పుట్టుకతోనే పరమ జ్ఞాని. ఐతే తండ్రిని మించిన తనయుడు. మరి అటువంటి వాని పుట్టుకకు కారణం ఏమిటి?
సరస్వతి నది ఒడ్డున నివసిస్తున్న సమయంలో వ్యాసమహాముని కావ్యములను, పురాణములను రచిస్తూ ఉండేవారు. అలా ఉన్న సమయంలో వారు ఒక పిచుకల జంటను చూస్తూ ఉండేవారు. కొంత కాలమునకు ఆ పిచ్చుకలకు ఒక చిన్న పిచ్చుక జన్మించినది. ఆ చిన్ని పిచ్చుకకు వారు చూపించే ప్రేమను గమనిస్తూ ఉండేవారు వ్యాస భగవానులు. అలా ఆ పిచ్చుకలను చూసినప్పుదంతా తనకు ఒక పుత్రుడు లేడే  అనే భాద కలుగుతూ ఉండేది.
ఒకనాడు అరణిని మంధిస్తూ ఈ విధమైన క్షేత్రం లేకుండా పుత్రోదయం ఏ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా వారి దృష్టి అటుగా వెళుతున్న ఘృతాచి అనే అప్సరస పై పడినది. పుత్రుని పొందాలన్న కోరికతో ఉన్న ఆయన శరీరం వీర్యమును స్కలించినది. ఐతే వ్యాస మహాముని తనను చూస్తూ ఉండగా అతని శరీరంలో కలుగుతున్న మార్పుని గమనించిన ఘృతాచి వ్యాసమహాముని తనను శపిస్తాడేమో అన్న భయంతో ఆమె చిలుకగా మారి ఎగిరిపోసాగినది.
అంటే వ్యాస భగవానునికి వీర్యస్కలనం అయిన  సమయమునకు అతని మనసును కదిలించిన క్షేత్రం చిలుకగా మారినది. కనుక ఆ సమయంలో జన్మించిన పుత్రునికి చిలుక రూపం రావలసి ఉన్నది. మానవుని రూపంలో ఉన్న వ్యాసుని రూపంకూడా రావలసి ఉన్నది కనుక శుకుని రూపం తలవరకూ చిలుక, మిగిలిన శరీరం మానవ ఆకృతిలో ఉంటాయి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి