13, ఆగస్టు 2014, బుధవారం

తిరునారాయణ దేవాలయం - మెలుకోటి

తిరునారాయణ/ చెలువనారాయణ దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ దేవాలయం విసిస్టత అంతా  ఆ దేవతాముర్తులదే అని చెప్పటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు కొన్ని దేవాలయములలో స్వయంభుదేవతా విగ్రహములగురించి చెప్తారు. కాని ఈ దేవాలయం ప్రత్యేకత ఇక్కడి మూలవిరాట్టుతో పాటు ఇక్కడి ఉత్సవమూర్తి కూడా స్వయంభువ మూర్తే.

మూలవిరాట్టు:

బ్రహ్మదేవుడు  ఒకసారి తాను నిరంతరం పూజించుకోవటానికి స్వామివారి మూర్తి కావాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా బ్రహ్మదేవునిముందు శ్రీమన్నారాయణుడు తిరునారాయణమూర్తిగా కనిపించారు. పరమానందభరితుడైన బ్రహ్మదేవుడు ఆ మూర్తిని ఆరాధించటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి బ్రహ్మమానస పుత్రుడైన సనత్ కుమారుడు అతను భూలోకంలో ఆరాధించుకొనుటకు ఆ మూర్తిని ఇవ్వమని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ మూర్తిని  తన కుమారునికి ఇచ్చాడు. ఆ మూర్తిని తీసుకున్న సనత్ కుమారుడు భూలోకానికి వచ్చి ఆ మూర్తిని ఉంచటానికి తగిన ప్రాంతం కోసం ఎంతో వెతికిన తరువాత చివరకు మేల్ కోటి ఆ పుణ్యస్థలం అని నిర్ధారించుకుని అక్కడ ప్రతిష్టించారు. ఈనాటికి మనం ఆ ముర్తినే మూలవిరాట్టుగా దర్శించవచ్చు.

ఈ మూలవిరాట్ మూర్తి ఎంతో ప్రత్యేకమైనది. ఈ మూర్తికి హృదయభాగంలో, పాదముల చెంత శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుంది.

పాదముల వద్ద వేంచేసి ఉన్న శ్రీదేవి


ఉత్సవమూర్తి :

మూలవిరాట్టు తన స్థానానికి తేలికగానే వచ్చి చేరింది కాని ఉత్సవమూర్తి ఇక్కడకు చేరటానికి ఎంతో కాలం పట్టింది. స్వయంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడే ఆ పనికి పూనుకోవలసి వచ్చినది.

కృతయుగం:
బ్రహ్మదేవుడు తన సత్యలోకంలో తాను నిరంతరం ఆరాధించే తిరునారాయణమూర్తి ని తన పుత్రునికి ఇచ్చినతరువాత అతనికి ఎంతో  వెలితి గా అనిపించినది. మరలాతనకు అటువంటి మూర్తికి ఆరాధన చేయాలి అనిపించగానే మరలా శ్రీమన్నారాయణుడు అతని ముందు శ్రీదేవి, భూదేవిలను హృదయం లో ఉంచుకున్న మూర్తిగా దర్సనం ఇచ్చారు. బ్రహ్మదేవుడు సంతోషించి ఆ మూర్తిని ఆరాధించటం మొదలుపెట్టారు. ఈ మూర్తిని సెల్వనారాయణ అని పిలిచారు.

త్రేతాయుగం:
రావణసంహారానంతరం శ్రీరాముడు తన నిత్యపూజామూర్తిఐన రంగనాధుని విభీషనుడికి ఇచ్చేసాడు. తరువాత రాముడు నిత్యం ఆరాధించుకొనుటకు ఒక మూర్తి కావాలని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తానూ పూజించే సెల్వనారాయణమూర్తి ని రామునికి ఇచ్చాడు. రామునికి ఎంతో ఇష్టమైన ఆ మూర్తిని రామప్రియ అని పిలిచారు. శ్రీరాముడు తన అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆముర్తిని తన కుమారుడైన కుసునకు ఇచ్చాడు.
అలా బ్రహ్మదేవుని నుండి సూర్యవంశానికి ఆ మూర్తి చేరుకున్నది.

ద్వాపరయుగం:
కాలాంతరంలో కుశుడు రామప్రియను తన కుమార్తె అయిన కనకమాలినికి పుట్టింటి కానుకగా ఇచ్చాడు. కనకమాలిని యాదవకులానికి చెందిన యాదవకుమారుని వివాహం చేసుకోవటం వల్ల రామప్రియ యాదవ వంశాన్ని చేరుకున్నది. అలా తరాలు మారి శ్రీకృష్ణ బలరాముల వరకు రామప్రియ యాదవుల కులదేవతగా ఉన్నది.
కొంతకాలానికి బలరాముడు తన స్నేహితులతో కలిసి తీర్ధయాత్రలకు వెళుతూ ఉండగా మెలుకోటిలో తిరునారయణుని చూసి తమ కులదైవానికి, తిరునారాయణునికి ఉన్న సారూప్యతను గమనించాడు. తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణునికి ఈ విషయం చెప్పారు. ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి మరలా మెలుకోటికి వచ్చి చూసి, రామప్రియ మెలుకోటిలో ఉండటమే సరి అయినది అని నిర్ణయించి రామప్రియను మెలుకోటిలోనే ఉంచారు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి