19, ఆగస్టు 2014, మంగళవారం

ఉపపాండవులు

పాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లకు ద్రౌపది యందు జన్మించిన ఐదుగురు పుత్రులను మనం ఉపపాండవులు అంటాము.  వీరు ఒకొక్క సంవత్సరo వయో భేదం తో జన్మించారు. వీరు మహారధులు.


  1. ధర్మరాజు పుత్రుడు ప్రతివింధ్యుడు
  2. భీమసేనుడి పుత్రుడు సుతసోముడు
  3. అర్జునుని పుత్రుడు శృతకర్ముడు 
  4. నకులుని పుత్రుడు శతానీకుడు
  5. సహదేవుని పుత్రుడు శ్రుతసేనుడు


ప్రతివింధ్యుడు: శత్రువులను వింధ్య పర్వతం వలే ఎదుర్కొనగలడు గనుక ఇతనికి ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారు.

సుతసోముడు: భీముడు వెయ్యి సోమయాగాలు చేసిన తర్వాత సూర్యచంద్రుల తేజస్సు తో కలిగిన పుత్రుడు కనుక ఇతనికి సుతసోముడు అని పేరు పెట్టారు.

శృతకర్ముడు: అర్జునుడు తాను ఎన్నో ఘనకార్యములు చేసిన తర్వాత పుట్టిన వాడు కనుక ఇతనికి శృతకర్ముడు అని పేరు పెట్టారు.

శతానీకుడు : తమ కౌరవవంశ రాజర్షి ఐన శతానీకుని పేరు నకులుడు తన పుత్రునికి అనందం గా పెట్టుకున్నారు.

శ్రుతసేనుడు: ఇతను కృత్తిక నక్షత్రం లో జన్మించాడు కనుక శ్రుతసేనుడు అని  పేరు పెట్టారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి